AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breakfast Tips: ఉదయమే ఖాళీ కడుపుతో వీటిని తిన్నా.. తాగినా ఎసిడిటీకి వెల్కమ్ చెప్పినట్లే..

ఎక్కువ మంది భారతీయులు తమ రోజుని ఉదయం స్ట్రాంగ్ టీ తో మొదలు పెడతారు. అంతేకాదు అల్పాహారంగా అందుబాటులో ఉన్న ఆహారాన్ని తినే అలవాటు కూడా ఎక్కువగా ఉంది. ఇలా రోజు ప్రారంభంలో కొన్ని రకాల ఆహారాన్ని తినడం వలన ఎసిడిటీతో ఇబ్బంది పడేలా చస్తుంది. ఉదయం సమయంలో కొన్ని రకాల ఆహార పదార్ధాలను తినే లేదా తాగే అలవాటు ఉంటె ఈరోజునే ఈ అలవాటును మార్చుకోండి. ఈ రోజు అవి ఏమిటో తెలుసుకుందాం..

Surya Kala
|

Updated on: Nov 12, 2024 | 6:28 PM

Share
ఎక్కువ మంది భారతీయులు తమ రోజుని పాలతో చేసిన టీతో ప్రారంభించడం సర్వసాధారణం. అయితే పోహా, ఇడ్లీ, దోశ, పొటాటో శాండ్‌విచ్ వంటివి అల్పాహారానికి సరైనవిగా పరిగణించబడతాయి. హెల్త్‌లైన్ ప్రకారం ఉదయం తినే అల్పాహారం భారీగా ఉండాలి. అందువల్ల చాలా మంది ప్రజలు అల్పాహారంలో ఇటువంటి వాటిని తింటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఎసిడిటీతో ఇబ్బంది పడేలా చేస్తుంది. అయితే ఎక్కువ మంది ఎసిడిటీని తేలికగా తీసుకుంటారు. ఈ ఎసిడిటీ నిరంతరం కొనసాగితే కడుపులో అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది.

ఎక్కువ మంది భారతీయులు తమ రోజుని పాలతో చేసిన టీతో ప్రారంభించడం సర్వసాధారణం. అయితే పోహా, ఇడ్లీ, దోశ, పొటాటో శాండ్‌విచ్ వంటివి అల్పాహారానికి సరైనవిగా పరిగణించబడతాయి. హెల్త్‌లైన్ ప్రకారం ఉదయం తినే అల్పాహారం భారీగా ఉండాలి. అందువల్ల చాలా మంది ప్రజలు అల్పాహారంలో ఇటువంటి వాటిని తింటారు. అయితే కొన్ని రకాల ఆహార పదార్ధాలు ఎసిడిటీతో ఇబ్బంది పడేలా చేస్తుంది. అయితే ఎక్కువ మంది ఎసిడిటీని తేలికగా తీసుకుంటారు. ఈ ఎసిడిటీ నిరంతరం కొనసాగితే కడుపులో అనేక తీవ్రమైన సమస్యలకు కారణం అవుతుంది.

1 / 8
మసాలా లేదా నూనెతో కూడిన ఆహారాన్ని  తినే విషయంలో నియమాలు పాటించక పొతే ఎసిడిటీకి ప్రధాన కారణం అవుతాయి. అందువల్ల అల్పాహారం లేదా ఉదయాన్నే ఛాతీలో లేదా కడుపులో మంటను కలిగించే కొన్ని పదార్థాలను తినడం మానుకోవాలి. ఈ ఆహార పదార్ధాలతో రోజును అస్సలు ప్రారంభించకూదు.

మసాలా లేదా నూనెతో కూడిన ఆహారాన్ని తినే విషయంలో నియమాలు పాటించక పొతే ఎసిడిటీకి ప్రధాన కారణం అవుతాయి. అందువల్ల అల్పాహారం లేదా ఉదయాన్నే ఛాతీలో లేదా కడుపులో మంటను కలిగించే కొన్ని పదార్థాలను తినడం మానుకోవాలి. ఈ ఆహార పదార్ధాలతో రోజును అస్సలు ప్రారంభించకూదు.

2 / 8
అసిడిటీ ఎందుకు వస్తుందంటే.. కడుపు లోపల ఆమ్ల ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు మన pH స్థాయి ప్రభావితమవుతుంది. pH బ్యాలెన్స్ లో తేడా వస్తే పుల్లని త్రేనుపు, గుండెల్లో మంట లేదా ఆహారం తినే విషయంలో సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్య ప్రతిరోజూ కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. కనుక యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం.

అసిడిటీ ఎందుకు వస్తుందంటే.. కడుపు లోపల ఆమ్ల ఆహార పదార్థాలు ఎక్కువగా ఉన్నప్పుడు మన pH స్థాయి ప్రభావితమవుతుంది. pH బ్యాలెన్స్ లో తేడా వస్తే పుల్లని త్రేనుపు, గుండెల్లో మంట లేదా ఆహారం తినే విషయంలో సమస్యలు మొదలవుతాయి. ఈ సమస్య ప్రతిరోజూ కొంతమందిని ఇబ్బంది పెడుతుంది. కనుక యాసిడ్ రిఫ్లక్స్‌ను నియంత్రించడం చాలా ముఖ్యం.

3 / 8
ఉదయం టీతో వీటిని తినొద్దు.. కొంతమందికి అల్పాహారంలో పరాటాగా తింటారు. దీనిని టీతో కలిపి తినడం ఇష్టం. బంగాళాదుంప పరాటాలో మసాలాలు, నూనె రెండూ ఉంటాయి. కనుక ఆలూ పరాటాను టీతో కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్యలు వస్తాయి. టీ , స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ లేదా ఇతర పొట్ట సమస్యలు పెరుగుతాయి.

ఉదయం టీతో వీటిని తినొద్దు.. కొంతమందికి అల్పాహారంలో పరాటాగా తింటారు. దీనిని టీతో కలిపి తినడం ఇష్టం. బంగాళాదుంప పరాటాలో మసాలాలు, నూనె రెండూ ఉంటాయి. కనుక ఆలూ పరాటాను టీతో కలిపి తీసుకోవడం వల్ల అసిడిటీ సమస్యలు వస్తాయి. టీ , స్పైసీ ఫుడ్ తీసుకోవడం వల్ల ఎసిడిటీ లేదా ఇతర పొట్ట సమస్యలు పెరుగుతాయి.

4 / 8
అటుకులతో టీ.. కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారాల పదార్ధాలతో పాటు టీని కూడా కలిపి తాగుతారు. అటుకులు వేసుకుని టీ తాగడం అత్యంత సాధారణ విషయం. ఈ రకమైన ఆహారం రుచికరమైనది అయినప్పటికీ.. మీ ఆరోగ్యంతో మీరే ఆడుకోవడం అంటున్నారు నిపుణులు. అల్పాహారంగా అటుకులు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినవచ్చు. అయితే ఈ అటుకులతో పాటు మసాలా లేదా టీ వంటి తినకూడదు లేదా త్రాగకూడదు. ఇలా చేయడం వల్ల కూడా అసిడిటీ గంటల తరబడి ఇబ్బంది పెడుతుంది.

అటుకులతో టీ.. కొంతమంది ఆరోగ్యకరమైన ఆహారాల పదార్ధాలతో పాటు టీని కూడా కలిపి తాగుతారు. అటుకులు వేసుకుని టీ తాగడం అత్యంత సాధారణ విషయం. ఈ రకమైన ఆహారం రుచికరమైనది అయినప్పటికీ.. మీ ఆరోగ్యంతో మీరే ఆడుకోవడం అంటున్నారు నిపుణులు. అల్పాహారంగా అటుకులు వంటి ఆరోగ్యకరమైన ఆహారాన్ని తినవచ్చు. అయితే ఈ అటుకులతో పాటు మసాలా లేదా టీ వంటి తినకూడదు లేదా త్రాగకూడదు. ఇలా చేయడం వల్ల కూడా అసిడిటీ గంటల తరబడి ఇబ్బంది పెడుతుంది.

5 / 8
సిట్రస్ పండ్లు.. నారింజ లేదా నిమ్మ వంటి సిట్రస్ పదార్థాలను ఖాళీ కడుపుతో తినడం లేదా వీటితో చేసిన జ్యూస్ ను త్రాగడం వల్ల కూడా ఎసిడిటీ వస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లం పెరుగుతుందని దీని వల్ల pH బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పొరపాటు ఎసిడిటీ పెరిగేలా చేస్తుంది. ఈ విషయంపై జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ ఖాళీ కడుపుతో పుల్లని తినడం వల్ల ఎసిడిటీ రావడం ఖాయని చెప్పారు.

సిట్రస్ పండ్లు.. నారింజ లేదా నిమ్మ వంటి సిట్రస్ పదార్థాలను ఖాళీ కడుపుతో తినడం లేదా వీటితో చేసిన జ్యూస్ ను త్రాగడం వల్ల కూడా ఎసిడిటీ వస్తుంది. ఇలా చేయడం వల్ల శరీరంలో ఆమ్లం పెరుగుతుందని దీని వల్ల pH బ్యాలెన్స్ లో మార్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఈ పొరపాటు ఎసిడిటీ పెరిగేలా చేస్తుంది. ఈ విషయంపై జైపూర్‌కు చెందిన ఆయుర్వేద నిపుణుడు డాక్టర్ కిరణ్ గుప్తా మాట్లాడుతూ ఖాళీ కడుపుతో పుల్లని తినడం వల్ల ఎసిడిటీ రావడం ఖాయని చెప్పారు.

6 / 8
కెఫిన్ పదార్ధాలు.. టీ లేదా కాఫీలో కెఫీన్ ఉంటుంది. వీటిని ఖాళీ కడుపుతో తాగడం వలన ఎసిడిటీ బారిన పడవచ్చు. భారతీయులు టీతో రోజుని ప్రారంభిస్తారు. దీనిలోని కెఫిన్ అసిడిటీని కలిగించడమే కాదు శరీరంలో డీహైడ్రేషన్‌ను కూడా పెంచుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల తరచుగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుందని డాక్టర్ కిరణ్ చెబుతున్నారు.

కెఫిన్ పదార్ధాలు.. టీ లేదా కాఫీలో కెఫీన్ ఉంటుంది. వీటిని ఖాళీ కడుపుతో తాగడం వలన ఎసిడిటీ బారిన పడవచ్చు. భారతీయులు టీతో రోజుని ప్రారంభిస్తారు. దీనిలోని కెఫిన్ అసిడిటీని కలిగించడమే కాదు శరీరంలో డీహైడ్రేషన్‌ను కూడా పెంచుతుంది. ఖాళీ కడుపుతో టీ తాగడం వల్ల తరచుగా యాసిడ్ రిఫ్లక్స్ సమస్య వస్తుందని డాక్టర్ కిరణ్ చెబుతున్నారు.

7 / 8
తీపి పదార్ధాలు.. చక్కెర ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది. భారతదేశంలో ఎక్కువ మంది అల్పాహారం కోసం చాక్లెట్లు, బిస్కెట్లు సహా ఇతర చక్కెర ఆహారాలను తింటారు. ఇలా తీపి పదార్ధాలను తినడం వలన ఇన్సులిన్ స్థాయి క్షీణిస్తుంది. ఎసిడిటీ కూడా రావచ్చు. అందువల్ల ఖాళీ కడుపుతో తీపి పదార్థాలు తినవద్దు. అల్పాహారానికి ముందు నానబెట్టిన శనగలు, పెసలు లేదా డ్రై ఫ్రూట్స్ తినవచ్చు.

తీపి పదార్ధాలు.. చక్కెర ఆరోగ్యాన్ని అనేక విధాలుగా దెబ్బతీస్తుంది. భారతదేశంలో ఎక్కువ మంది అల్పాహారం కోసం చాక్లెట్లు, బిస్కెట్లు సహా ఇతర చక్కెర ఆహారాలను తింటారు. ఇలా తీపి పదార్ధాలను తినడం వలన ఇన్సులిన్ స్థాయి క్షీణిస్తుంది. ఎసిడిటీ కూడా రావచ్చు. అందువల్ల ఖాళీ కడుపుతో తీపి పదార్థాలు తినవద్దు. అల్పాహారానికి ముందు నానబెట్టిన శనగలు, పెసలు లేదా డ్రై ఫ్రూట్స్ తినవచ్చు.

8 / 8
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
బ్యాట్స్ మెన్ల బాదుడు..బౌలర్ల ఏడుపు.. ఒకే టీ20 మ్యాచ్లో 449 రన్స్
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
ఓర్నీ.! పెద్ద బాంబ్ పేల్చిన వాతావరణ శాఖ
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
సూర్య స్థానంలో శివ కార్తికేయన్.. 'పురనానూరు' కథలో జరిగిన మార్పులు
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
మూడు పొయ్యిలున్న గ్యాస్ పై వంట చేస్తున్నారా.. ఇక మీరు అప్పుల పాలే
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వాస్తు టిప్స్ : దరిద్రంపోయి కోటీశ్వరులు అవ్వాలా..
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
వయస్సు పెరిగినా యంగ్‌గా కనిపించాలా?.. హీరోయిన్ ఫిట్‌నెస్ సీక్రెట్
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
ఢిల్లీ టీమ్‎కి బై బై..కింగ్ కోహ్లీ సడన్ ఎగ్జిట్ వెనుక నిజం ఇదే
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
Rewind 2025: టాలీవుడ్‌పై బాలీవుడ్ స్టార్ల దండయాత్ర..!
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
కేబినెట్‌విస్తరణపై సీఎం రేవంత్ కసరత్తు.. రేసులో ఉన్నది ఎవరు?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?
సూర్యపై వేటు, గిల్‌కు నోఛాన్స్.. భారత టీ20 కెప్టెన్‌గా ఎవరంటే?