AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Pressure: ఈ పండు రోజూ తింటే వారంలోనే అధిక రక్తపోటు నార్మల్‌ అయిపోతుంది.. తెలుసా?

చాప కింద నీరులా రక్తపోటు కూడా నిశ్శబ్దంగా ఆయువును కబలించే ఓ మహమ్మారి. ఈ 'సైలెంట్ కిల్లర్' పక్షవాతం, గుండెపోటుకు దారి తీస్తుంది. రక్తపోటు 120/80 కంటే ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సాధారణ అధిక రక్తపోటు ఉన్న వారు రోజూ మందులు వేసుకోవడం అవసరం. ఒక్క రోజు మందులు తీసుకోకపోయినా స్ట్రోక్ ముప్పు మరింత పెరుగుతుంది. అయితే, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మందులతోపాటు..

Srilakshmi C
|

Updated on: Sep 29, 2024 | 8:28 PM

Share
చాప కింద నీరులా రక్తపోటు కూడా నిశ్శబ్దంగా ఆయువును కబలించే ఓ మహమ్మారి.  ఈ 'సైలెంట్ కిల్లర్' పక్షవాతం, గుండెపోటుకు దారి తీస్తుంది. రక్తపోటు 120/80 కంటే ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సాధారణ అధిక రక్తపోటు ఉన్న వారు రోజూ మందులు వేసుకోవడం అవసరం. ఒక్క రోజు మందులు తీసుకోకపోయినా స్ట్రోక్ ముప్పు మరింత పెరుగుతుంది. అయితే, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మందులతోపాటు రోజూ తినే ఆహారం మీద కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి.

చాప కింద నీరులా రక్తపోటు కూడా నిశ్శబ్దంగా ఆయువును కబలించే ఓ మహమ్మారి. ఈ 'సైలెంట్ కిల్లర్' పక్షవాతం, గుండెపోటుకు దారి తీస్తుంది. రక్తపోటు 120/80 కంటే ఎక్కువగా ఉంటే జాగ్రత్తగా ఉండటం ముఖ్యం. సాధారణ అధిక రక్తపోటు ఉన్న వారు రోజూ మందులు వేసుకోవడం అవసరం. ఒక్క రోజు మందులు తీసుకోకపోయినా స్ట్రోక్ ముప్పు మరింత పెరుగుతుంది. అయితే, రక్తపోటును అదుపులో ఉంచుకోవడానికి మందులతోపాటు రోజూ తినే ఆహారం మీద కూడా తగిన శ్రద్ధ తీసుకోవాలి.

1 / 5
అధిక రక్తపోటు ఉన్న వారు అధిక ఉప్పు గల ఆహారాలను పూర్తిగా నివారించాలి. వాస్తవానికి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు ముప్పు తగ్గుతుంది. పొటాషియం మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మూత్రం ద్వారా శరీరం నుంచి అదనపు సోడియంను బయటకు పంపుతుంది.

అధిక రక్తపోటు ఉన్న వారు అధిక ఉప్పు గల ఆహారాలను పూర్తిగా నివారించాలి. వాస్తవానికి పొటాషియం అధికంగా ఉండే ఆహారాన్ని తీసుకోవడం ద్వారా రక్తపోటు ముప్పు తగ్గుతుంది. పొటాషియం మూత్రపిండాలపై ఒత్తిడిని తగ్గిస్తుంది. మూత్రం ద్వారా శరీరం నుంచి అదనపు సోడియంను బయటకు పంపుతుంది.

2 / 5
అంతేకాకుందా పొటాషియం శరీరంలో ద్రవం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఈ ఖనిజం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. బీపీ కంట్రోల్ చేయడానికి అరటి పండ్లు తీసుకుంటే ఎంతోమేలు.

అంతేకాకుందా పొటాషియం శరీరంలో ద్రవం, ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహిస్తుంది. ఈ ఖనిజం రక్తపోటును అదుపులో ఉంచుతుంది. అరటి పండ్లలో పొటాషియం అధికంగా ఉంటుంది. బీపీ కంట్రోల్ చేయడానికి అరటి పండ్లు తీసుకుంటే ఎంతోమేలు.

3 / 5
అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ అరటిపండు తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని సులభంగా నివారించవచ్చు. అధిక రక్తపోటు నివారణకు ప్రతిరోజూ 2 అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే 1 వారంలోపు రక్తపోటును 10 శాతం వరకు తగ్గిస్తుంది.

అరటిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఈ పండు అధిక రక్తపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ప్రతిరోజూ అరటిపండు తినడం ద్వారా గుండె జబ్బుల ప్రమాదాన్ని సులభంగా నివారించవచ్చు. అధిక రక్తపోటు నివారణకు ప్రతిరోజూ 2 అరటిపండ్లను తినడం అలవాటు చేసుకోవాలి. ఇలా చేస్తే 1 వారంలోపు రక్తపోటును 10 శాతం వరకు తగ్గిస్తుంది.

4 / 5
పొటాషియంతో పాటు, అరటి పండ్లలో విటమిన్లు A, C, ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అరటిపండ్లలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అరటిపండ్లు తింటే కూడా కంటి చూపు మెరుగవుతుంది. అరటిపండ్లు తినడం వల్ల జీర్ణ రుగ్మతలు, ముఖ్యంగా మలబద్ధకం వంటి వాటిని నివారించవచ్చు. అయితే అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి వారు వైద్యుల సలహా మేరకు తీసుకుంటే మంచిది.

పొటాషియంతో పాటు, అరటి పండ్లలో విటమిన్లు A, C, ప్రోటీన్, ఫైబర్, ఫోలేట్ అధికంగా ఉంటాయి. అధిక రక్తపోటు ఉన్నవారికి ఇవి ఎంతో ఉపయోగపడతాయి. అరటిపండ్లలో కాల్షియం కూడా ఉంటుంది. ఇది ఎముకలను బలోపేతం చేయడానికి సహాయపడుతుంది. అరటిపండ్లు తింటే కూడా కంటి చూపు మెరుగవుతుంది. అరటిపండ్లు తినడం వల్ల జీర్ణ రుగ్మతలు, ముఖ్యంగా మలబద్ధకం వంటి వాటిని నివారించవచ్చు. అయితే అరటిపండ్లు తినడం వల్ల బరువు పెరుగుతుందనే భయం చాలా మందిలో ఉంటుంది. ఇలాంటి వారు వైద్యుల సలహా మేరకు తీసుకుంటే మంచిది.

5 / 5