AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తమిళనాడులో దారుణం.. భర్త రోజూ తాగొచ్చి వేధిస్తున్నాడని భార్య ఏం చేసిందంటే

తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. మద్యం మత్తులో వేధిస్తున్న భర్తను.. భార్య కిరోసన్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే విల్లుపురం జిల్లా రెడ్డివనం టీవీనగర్ లో దక్షిణామూర్తి కుమారుడు సేతుపతి (23) పుదిచ్చేరిలో ఉన్న ఓ పంచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు.

తమిళనాడులో దారుణం.. భర్త రోజూ తాగొచ్చి వేధిస్తున్నాడని భార్య ఏం చేసిందంటే
Crime
Aravind B
|

Updated on: Apr 30, 2023 | 9:04 AM

Share

తమిళనాడులో దారుణం వెలుగుచూసింది. మద్యం మత్తులో వేధిస్తున్న భర్తను.. భార్య కిరోసన్ పోసి నిప్పంటించిన ఘటన ఆలస్యంగా బయటపడింది. వివరాల్లోకి వెళ్తే విల్లుపురం జిల్లా రెడ్డివనం టీవీనగర్ లో దక్షిణామూర్తి కుమారుడు సేతుపతి (23) పుదిచ్చేరిలో ఉన్న ఓ పంచర్ దుకాణంలో పనిచేస్తున్నాడు. అతను ఆదే ప్రాంతానికి చెందిన మురుగవేణి(19) ని 2019లో ప్రేమ వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత వీళ్లు గుడిసెలో నివాసం ఉండేవారు. అయితే 2019 ఆగస్టు ఒకటో తేదిన ఇంట్లో నిద్రిస్తున్న సేతుపతి గుడెసెకు నిప్పు అంటుకుంది. దీంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

గుడిసెకు నిప్పు అంటుకున్న సమయంలో గుడిసె బయట తలుపులు వేసినట్లు తెలిసింది. దీంతో మురుగవేనిని పోలీసులు విచారించగా తన భర్త మద్యం తాగి తరచూ వేధించేవాడని అందుకే కిరోసిన్ పోసి ఇంటికి నిప్పంటించనినట్లు ఒప్పుకుంది. దీంతో పోలీసులు ఆమెను అరెస్టు చేశారు. ఈ కేసు దిండివనం అదనపు జిల్లా సెసెన్స్ కోర్టులో విచారణ జరగింది. మురుగవేని నేరం రుజువు కావడంతో శుక్రవారం రోజున న్యాయమూర్తి ఆమెకు యావజ్జీవ శిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. అనంతరం కడలూరు సెంట్రల్ జైలుకు ఆమెను తరలించారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..