AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: సకాలంలో, సురక్షితంగా తీసుకొచ్చారు.. ప్రధాని మోదీపై హక్కీ పిక్కి తెగ సభ్యుల ప్రశంసలు

జరుగుతున్న అంతర్యుద్ధం మధ్య ఆపరేషన్ కావేరీ కింద సూడాన్ నుండి తరలించబడిన కర్ణాటకలోని శివమొగ్గలోని హక్కీ పిక్కీ తెగ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సంభాషించారు. ప్రభుత్వం సుడాన్ నుండి తరలించిన భారతీయులలో కర్ణాటకకు చెందిన హక్కీ పిక్కీ ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన కనీసం 31 మంది ఉన్నారు. తమను సకాలంలో, సురక్షితంగా తరలించేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలకు నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

PM Modi: సకాలంలో, సురక్షితంగా తీసుకొచ్చారు.. ప్రధాని మోదీపై హక్కీ పిక్కి తెగ సభ్యుల ప్రశంసలు
PM Modi
Sanjay Kasula
|

Updated on: May 07, 2023 | 7:51 PM

Share

భారత్ ఆపరేషన్ కావేరిని విజ‌య‌వంతంగా పూర్తి చేసింది. పోర్ట్ సూడాన్ నుంచి తరలించడానికి భారతీయులు ఎవరూ వేచి లేరని సూడాన్ లోని భారత రాయబార కార్యాలయం తెలిపింది. ఈ క్ర‌మంలోనే సూడాన్ లో చిక్కుకున్న దాదాపు 3,800 మంది భారతీయులను సుర‌క్షితంగా స్వ‌దేశానికి తీసుకువ‌చ్చింది కేంద్ర ప్ర‌భుత్వం. కేంద్ర ప్రభుత్వం వేగంగా తీసుకున్న ఈ నిర్ణయంపై నిర్వాసితులు ఆనందం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. జరుగుతున్న అంతర్యుద్ధం మధ్య ఆపరేషన్ కావేరీ కింద సూడాన్ నుండి తరలించబడిన కర్ణాటకలోని శివమొగ్గలోని హక్కీ పిక్కీ తెగ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం సంభాషించారు. ప్రభుత్వం సుడాన్ నుండి తరలించిన భారతీయులలో కర్ణాటకకు చెందిన హక్కీ పిక్కీ ఆదివాసీ కమ్యూనిటీకి చెందిన కనీసం 31 మంది ఉన్నారు.

ఆదివారం కర్ణాటకలోని శివమొగ్గలో ఆపరేషన్ కావేరీ కింద సూడాన్ నుంచి తరలించబడిన హక్కీ పిక్కీ తెగ సభ్యులతో ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యేకంగా సంభాషించారు. తమను సకాలంలో, సురక్షితంగా తరలించేలా ప్రభుత్వం తీసుకున్న చురుకైన చర్యలకు నిర్వాసితులు ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలిపారు.

వారు సూడాన్‌లో ఎదుర్కొన్న కఠినమైన పరిస్థితులను, ప్రభుత్వం, భారత రాయబార కార్యాలయం తమ భద్రతకు ఎలా భరోసా ఇచ్చాయో వివరించారు. తమకు ఎలాంటి స్క్రాచ్ కూడా రాకుండా ప్రభుత్వం చూసుకుందని, ప్రధాని మోదీ కృషి వల్లే ఇదంతా జరిగిందని వారు అన్నారు.

ప్రధాని మోదీ తీసుకున్న నిర్ణయం పట్ల వారు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. తమ హృదయంలో ఆయన డబుల్ ఇంజన్ కాదు ట్రిపుల్ ఇంజన్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నట్లు భావిస్తున్నామని అన్నారు. హక్కీ పిక్కీ సంఘ సభ్యుల పూర్వీకులు మహారాణా ప్రతాప్‌కు ఎలా అండగా నిలిచారో ప్రధాని మోదీ గుర్తు చేసుకున్నారు.

ప్రపంచం మొత్తం మీద భారతీయులెవరైనా కష్టాల్లో ఉంటే ఆ సమస్య పరిష్కారమయ్యే వరకు మోదీ ప్రభుత్వం విశ్రమించదని మరోసారి చేసి చూపించారని హక్కీ పిక్కీ తెగ సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు.

కొందరు రాజకీయ నాయకులు ఈ అంశాన్ని రాజకీయం చేసేందుకు ప్రయత్నించారని.. భారతీయులు ఎక్కడ దాక్కున్నారో బయటపెడితే పెద్ద ప్రమాదం వాటిల్లుతుందనేది మా ఆందోళన అని అన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరికీ భద్రత కల్పించడానికి కేంద్ర ప్రభుత్వం నిశ్శబ్దంగా పనిచేసిందన్నారు.

ఈ వీడియోను ఇక్కడ చూడండి..

తమకు అండగా నిలిచిన దేశ బలాన్ని గుర్తుంచుకోవాలని కోరారు. కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు, సమాజానికి, దేశానికి చేయూతనిచ్చేందుకు ఎప్పుడూ సిద్ధంగా ఉండాలని సూచించారు. విదేశీలకు భారతీయ వైద్యంపై విశ్వాసం ఉంచడం.. వారు భారతదేశానికి చెందినవారని విన్నప్పుడు ఎలా సంతోషిస్తారో కూడా వారు వివరించారు.