Viral Video: పైనుంచి చూస్తే.. అది నార్మల్ కప్బోర్డ్.. లోపల చెక్ చేయగా..
ఆపరేషన్ జమ్ముకశ్మీర్ను పక్కాగా అమలు చేస్తున్నాయి..భారత భద్రతా దళాలు. కలుగుల్లో దాక్కున్న ఉగ్రమూకలను..బయటకు తీసుకువచ్చి మరీ హతమారుస్తున్నారు. దీంతో సైన్యం నుండి తప్పించుకునేందుకు..సరికొత్త పథకాలు అమలు చేస్తున్నారు..ఉగ్రవాదులు.
బయటకు చూస్తే అదో సాధారణ ఇల్లు.. అందులో అతి సాధారణమైన కప్బోర్డ్. అయితే అసలు కథంతా దాని లోపలే ఉంది. కశ్మీర్లో భద్రత దళాల నుండి తప్పించుకునేందు..సరికొత్త మార్గాలను కనిపెడుతున్నారు..ఉగ్రవాదులు. స్థానికులకు సైతం అనుమానం రాకుండా జనావాసాల మధ్యే ఇళ్లలో బంకర్లు నిర్మిస్తున్నారు. దాడి చేశాక సైన్యానికి అనుమానం రాకుండా బంకర్ దూరి సేదదీరుతున్నారు.అక్కడి నుండే నెక్ట్స్ ఎటాక్కు ప్లాన్ చేస్తున్నారు.
ఇటీవల చిన్నిగామ్ ఫీసల్లో జరిగిన ఎన్కౌంటర్లో ఒకేచోట నలుగురు హిజ్బుల్ ఉగ్రవాదులను హతమార్చింది సైన్యం. అయితే ఉగ్రవాదులు బస చేసిన ఇంట్లో అనుమానం వచ్చి సోదాలు జరిపితే ఈ బంకర్ విషయం బయటపడింది. ఓ ఇంట్లో ఉన్న కప్బోర్డ్లో ఉగ్రవాదులు ఏకంగా బంకర్ నిర్మించినట్టు భద్రతాదళాలు గుర్తించాయి. దీన్ని పూర్తిగా కాంక్రీట్తో నిర్మించినట్లు సైనిక వర్గాలు చెబుతున్నాయి. ఈ బంకర్లోకి వెళ్లడానికి చిన్న అల్మారా వంటి దానిలో డోర్ ఏర్పాటుచేశారు. ఒక మనిషి పాక్కొంటూ బంకర్లోకి ప్రవేశించవచ్చు.
The four militants, who were killed in last night’s encounter at Chinnigam, used to stay in this hideout at Chinnigam Frisal in Kashmir’s Kulgam district. pic.twitter.com/euLk6QG6Le
— Ahmed Ali Fayyaz (@ahmedalifayyaz) July 7, 2024
ప్రస్తుతం జమ్మూకశ్మీర్లో పెరుగుతున్న ఉగ్ర దాడుల వెనక లష్కరే నేత సైఫుల్లా సాజిద్ జట్ హస్తం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు చెబుతున్నాయి. వీడిపై రూ.10 లక్షల రివార్డు కూడా ఉంది. పాక్ రాజధాని ఇస్లామాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నాడు..సైఫుల్లా సాజిద్. గత నెలలో బస్సుపై జరిగిన ఉగ్రదాడిలో కూడా సైఫుల్లా హస్తం ఉన్నట్లు భావిస్తున్నారు.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..