గుర్లలో ఏం జరిగింది ?? డయేరియా వ్యాప్తి వెనుక నిజాలు ఏంటి ??
దాహాన్ని తీర్చాల్సిన మంచినీరు.. ప్రాణాలు తీస్తోంది. అమృతంలా గొంతు దిగాల్సిన జలం.. గరళంలా మారుతోంది. కలుషిత నీటిని తాగితే మనిషికి అనారోగ్యం తప్పదు. డయేరియా రూపంలో పంజా విసురుతుంది. ఒక్కోసారి అది ప్రాణాలనూ బలి తీసుకుంటుంది. దాదాపు మూడు వేల జనాభా ఉండే విజయనగరం జిల్లా గుర్లలో జరిగింది.. ఇదే. అక్కడ.. డయేరియా దెబ్బతో ఊరంతా అనారోగ్యం పాలైంది. వాంతులు, విరోచనాలతో అల్లాడుతోంది.
పారిశుధ్యం లోపించడం, నీటి కాలుష్యం వల్ల.. డయేరియా విజృంభించింది. దీంతో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. అయితే ఈ అంశం.. రాజకీయరంగు పులుముకోవడంతో హాట్ టాపిక్ గా మారింది. అధికార, ప్రతిపక్షాలు.. విమర్శలు, ఆరోపణల దాడి చేసుకుంటున్నాయి. ఇంతకీ గుర్లలో ఏం జరిగింది? డయేరియా వల్ల అక్కడ ఎలాంటి విషాదం చోటుచేసుకుంది? అక్కడి పరిస్థితిని చక్కదిద్దడానికి ప్రభుత్వం ఇప్పుడు ఏం చేస్తోంది? విజయనగరం జిల్లా గుర్లలో అతిసారం వల్ల కర్ఫ్యూలాంటి వాతావరణం నెలకొంది. ఊళ్లో వారంతా వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. పరిస్థితి సీరియస్ గా ఉండడంతో.. ప్రభుత్వం కూడా వెంటనే స్పెషల్ హెల్త్ క్యాంప్స్ ను ఏర్పాటు చేసింది. అధికారులు, మంత్రులు ఇక్కడ పర్యటించారు. పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం చేశారు. కానీ ఇక్కడ డయేరియా వల్ల 11 మంది చనిపోయారని వైసీపీ ఆరోపిస్తోంది. ప్రభుత్వం మాత్రం డయేరియాతో ఒక్కరే ప్రాణాలు కోల్పోయారని ప్రకటించింది. మిగిలినవారంతా వివిధ ఆరోగ్య సమస్యలతో మరణించారు అని అంటోంది. ఇలాంటి సమయంలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అక్కడ పర్యటించడం.. ప్రాధాన్యతను సంతరించుకుంది. గుర్ల PHCలో ఇంకా చికిత్స పొందుతున్న.. 20 మందికి పైగా బాధితులను పరామర్శించిన పవన్.. వారి ఆరోగ్యం ఎలా ఉందో కనుక్కున్నారు. వారికి అందుతున్న వైద్యసదుపాయాలను అడిగి తెలుసుకున్నారు. వ్యాధి ఎలా వ్యాప్తి చెందింది.. దానికి గల కారణాలపై అధికారులను ఆరా తీశారు. గ్రామంలో శానిటేషన్ ఎలా ఉందో పరిశీలించారు. SSR పేటలో ఉన్న తాగునీటి...
రూ. 60 వేల విలువైన కెమెరా ఆర్డర్ పెడితే.. ఆన్లైన్ మోసం..
ప్రపంచంలోనే అత్యంత కఠినమైన డ్రైవర్ టెస్ట్, దాని ప్రయోజనాలు
18 లక్షల సార్లు స్కిప్పింగ్ చేస్తాడా ?? నెట్టింట జోరుగా చర్చ
పండ్లపై ఎలుకల మందు పూసి అమ్ముతున్న వ్యాపారులు
ఫ్రెంచ్ అబ్బాయి..యానాం అమ్మాయి పెళ్లి.. గుర్రపు బండిపై ఊరేగుతూ..
అర్ధరాత్రి టపాసుల మోత.. హడలెత్తిపోతున్న జనం
నెరవేరిన కల.. అంతలోనే చిదిమేసిన మృత్యువు..

