AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నది ఒడ్డున శివయ్యకు బీరుతో అభిషేకం చేసిన ఇద్దరు యువకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు

హిందూ ధర్మంలో శివలింగంపై బిల్వ పత్రం, పూలు, నీరు, పాలు మొదలైన వాటిని సమర్పిస్తూ.. భక్తులు శివునికి అభిషేకం చేయడాన్ని మీరు చూసి ఉంటారు. అయితే వైరల్ అవుతున్న వీడియోలో ఇద్దరు యువకులు శివలింగానికి బీరుతో అభిషేకం చేస్తున్నారు.

నది ఒడ్డున శివయ్యకు బీరుతో అభిషేకం చేసిన ఇద్దరు యువకులు.. కేసు నమోదు చేసిన పోలీసులు
Viral News 1
Surya Kala
|

Updated on: Jun 25, 2022 | 8:26 PM

Share

Viral news: వివిధ రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో కొన్ని చాలా ఫన్నీగా ఉంటాయి మరి కొన్ని ఆందోళన కలిగిస్తాయి. అలాంటి ఒక ఆశ్చర్యకరమైన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారుతోంది. అంతేకాదు.. ఈ వీడియో ప్రస్తుతం వివాదాస్పదంగా మారింది. సనాతన హిందూ ధర్మంలో శివలింగంపై బిల్వ పత్రం, పూలు, నీరు, పాలు మొదలైన వాటిని సమర్పిస్తూ.. భక్తులు శివునికి అభిషేకం చేయడాన్ని మీరు చూసి ఉంటారు. అయితే వైరల్ అవుతున్న  వీడియోలో ఇద్దరు యువకులు శివలింగానికి బీరుతో అభిషేకం చేస్తున్నారు. ఇద్దరూ మత్తులో ఉన్నారు. నది ఒడ్డున కూర్చుని బీరు తాగుతూ.. వారు శివలింగంపై కూడా బీరు పోస్తున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ప్రజలు చాలా కోపంగా ఉన్నారు. అంతేకాదు ఆ ఇద్దరు యువకులపై పోలీసు కేసు నమోదైంది.

నది ఒడ్డున ఉన్న శివలింగం వద్ద ఇద్దరు యువకులు బూట్లు వేసుకుని కూర్చున్నట్లు వీడియోలో చూడవచ్చు. ఈ యువకుల్లో ఒకరు నవ్వుతూ బీరు తాగుతుండగా, మరో యువకుడు శివలింగానికి బీరుతో అభిషేకం చేస్తూ కనిపిస్తున్నాడు.  అప్పుడు.. శివలింగాన్ని తాకి, నమస్కరించి, అతను లేచి నిలబడి కెమెరా వైపు నడుస్తున్నాడు. విశేషమేమిటంటే బ్యాక్ గ్రౌండ్ లో శివయ్య కు సంబంధించిన భక్తి సాంగ్  కూడా ప్లే అవుతోంది. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.

ఈ వీడియో చండీగఢ్ లోని అని తెలుస్తోంది. సమాచారం ప్రకారం, వారిలో ఒకరు చండీగఢ్‌లోని సెక్టార్ 26 నివాసి. మీడియా కథనాల ప్రకారం, బజరంగ్ దళ్ యువకుడిపై ఐటీ పార్క్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి

నిందితులపై కఠిన చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు చేపడతామని భజరంగ్ దళ్ హెచ్చరించింది. మీడియా కథనాల ప్రకారం.. ఇది శివుడిని అవమానించడమేనని నిందితులను వీలైనంత త్వరగా పట్టుకోవాలని వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని సామాజిక కార్యకర్త అరవింద్ సింగ్ అన్నారు. (Source)

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
ముంబైపై ఘన విజయం.. ప్లేఆఫ్ రేస్‌లోకి కేకేఆర్ ఎంట్రీ..!
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
భానుడి భగభగలు..! ఎండల్లో ఎలాంటి డ్రింక్స్ తాగాలి? వేటికి దూరంగా..
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
సోషల్ మీడియా స్టార్ కుర్చీతాత హఠాన్మరణం.. ఏం జరిగిందంటే?
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
2026లో కెరీర్ గ్రోత్ కోసం హైదరాబాద్ టాప్ 10 కంపెనీలు ఇవే..
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
పిడుగురాళ్లలో 47.6, నిర్మల్‌లో 46.5 డిగ్రీలు.. సూరీడుతో జాగ్రత్త
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఊరు పెరిగింది.. జనాభా పెరిగింది.. ట్రాఫికర్ మాత్రం షేమ్‌టుసేమ్
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
ఒకే FDలో మొత్తం డబ్బు పెట్టేస్తున్నారా? తప్పు చేస్తున్నట్లే!
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
పెరుగు బాగా పులిసిపోయిందా? పారేయకండి.. ఈ 4 వంటకాలతో పాటు మీ ఇళ్లు
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
సమ్మర్‌ స్పెషల్ హెల్తీ బ్రేక్‌ఫాస్ట్‌..ఈ గులాబీ రంగు ఇడ్లీలు ట్రై
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..
రోజుకు 2 అరటిపండ్లు తింటే ఏం జరుగుతుంది..? పెద్ద కథే ఇది..