AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. డెంగ్యూతో చికిత్స పొందుతున్న వ్యక్తికి మోసంబి జ్యూస్ ఎక్కించిన వైద్యులు.. రోగి మృతి

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రి వద్దకు ఇప్పటికే కమిటీ వెళ్లి, విచారణ చేపట్టిందన్నారు. మరికొద్ది గంటల్లోనే రిపోర్టు వస్తుంది.

దారుణం.. డెంగ్యూతో చికిత్స పొందుతున్న వ్యక్తికి మోసంబి జ్యూస్ ఎక్కించిన వైద్యులు.. రోగి మృతి
Dengue Patient Died
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2022 | 7:51 PM

Share

ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డెంగీతో బాధపడుతున్న ఓ రోగికి బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించారు. దీంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే డెంగీ రోగి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ ఝుల్వాలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతిచెందాడంటూ మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వేదాంక్‌ సింగ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో వార్త వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రయాగ్‌రాజ్‌ ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించడంతో రోగి ప్రదీప్ పాండే చనిపోయాడని బంధువులు ఆరోపించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వీడియోలో కూడా ప్లేట్‌లెట్స్‌కు బదులుగా ఆ ప్యాకెట్‌లో మోంసబి జ్యూస్ కనిపించింది. డెంగీ రోగి చనిపోయిన ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్‌ పఠాక్‌ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రి వద్దకు ఇప్పటికే కమిటీ వెళ్లి, విచారణ చేపట్టిందన్నారు. మరికొద్ది గంటల్లోనే రిపోర్టు వస్తుంది. తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రయాగ్‌రాజ్‌ ఐజీ రాకేశ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు కమిటీ విచారణ జరుపుతుందన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ తెలిపారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నకిలీ బ్లడ్ బ్యాంక్‌ను కూడా గుర్తించి బ్యాన్‌ చేసినట్టుగా సింగ్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది.. బ్లాక్ కాఫీ మ్యాజిక్
ఈ ఒక్క అలవాటు మీ ఆరోగ్యాన్ని మార్చేస్తుంది.. బ్లాక్ కాఫీ మ్యాజిక్
తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. అసలు విషయం తెలిస్తే..
తిన్న వెంటనే స్వీట్ తినాలనిపిస్తోందా.. అసలు విషయం తెలిస్తే..
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో మారిన వాతావరణం.. వచ్చే 3 రోజుల వెదర్ రిపోర్ట్
బిట్స్ పిలానీకి భారీ విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి
బిట్స్ పిలానీకి భారీ విరాళం ప్రకటించిన పూర్వ విద్యార్థి
సిరిసంపదల కోసం పెంచే మొక్క...ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
సిరిసంపదల కోసం పెంచే మొక్క...ఈ జాగ్రత్తలు తప్పనిసరి!
దాదా స్టైలే వేరు..బిగ్ బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
దాదా స్టైలే వేరు..బిగ్ బాస్ హోస్ట్‌గా సౌరవ్ గంగూలీ
వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
వార్నీ.. 1982 నాటి కేసులో ఇప్పుడు తీర్పు.. 100 ఏళ్ల వృద్ధుడికి..
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఎమ్మెల్యే శ్రీధర్‌తో కారులో లాంగ్ డ్రైవ్.. మరో వీడియో వదిలిన వీణ.
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
ఈ రాశుల వారికీ బ్యాడ్ టైమ్ స్టార్ట్.. జాగ్రత్తగా ఉండండి!
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..
రైతు భరోసా, ఇందిరమ్మ ఇళ్లపై సీఎం రేవంత్ బిగ్ అప్డేట్..