AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దారుణం.. డెంగ్యూతో చికిత్స పొందుతున్న వ్యక్తికి మోసంబి జ్యూస్ ఎక్కించిన వైద్యులు.. రోగి మృతి

ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రి వద్దకు ఇప్పటికే కమిటీ వెళ్లి, విచారణ చేపట్టిందన్నారు. మరికొద్ది గంటల్లోనే రిపోర్టు వస్తుంది.

దారుణం.. డెంగ్యూతో చికిత్స పొందుతున్న వ్యక్తికి మోసంబి జ్యూస్ ఎక్కించిన వైద్యులు.. రోగి మృతి
Dengue Patient Died
Jyothi Gadda
|

Updated on: Oct 20, 2022 | 7:51 PM

Share

ఉత్తరప్రదేశ్ లక్నోలో దారుణ ఘటన చోటు చేసుకుంది. డెంగీతో బాధపడుతున్న ఓ రోగికి బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించారు. దీంతో రోగి ప్రాణాలు కోల్పోయాడు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే డెంగీ రోగి చనిపోయాడని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ప్రయాగ్‌రాజ్‌ ఝుల్వాలోని గ్లోబల్‌ ఆస్పత్రిలో వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యం కారణంగానే వ్యక్తి మృతిచెందాడంటూ మృతుడి బంధువులు, కుటుంబ సభ్యులు ఆరోపించడంతో విచారణకు ఆదేశించారు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలను వేదాంక్‌ సింగ్‌ సోషల్ మీడియాలో పోస్ట్‌ చేశారు. దీంతో వార్త వైరల్‌ అవుతోంది. పూర్తి వివరాల్లోకి వెళితే..

ప్రయాగ్‌రాజ్‌ ఝుల్వాలోని గ్లోబల్ ఆస్పత్రిలో బ్లడ్ ప్లాస్మాకు బదులుగా మోసంబి జ్యూస్ ఎక్కించడంతో రోగి ప్రదీప్ పాండే చనిపోయాడని బంధువులు ఆరోపించారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక వీడియోలో కూడా ప్లేట్‌లెట్స్‌కు బదులుగా ఆ ప్యాకెట్‌లో మోంసబి జ్యూస్ కనిపించింది. డెంగీ రోగి చనిపోయిన ఘటనపై యూపీ డిప్యూటీ సీఎం బ్రజేశ్‌ పఠాక్‌ స్పందించారు. ఈ ఘటనపై విచారణ జరిపేందుకు కమిటీని ఏర్పాటు చేశామని తెలిపారు. గ్లోబల్ ఆస్పత్రి వద్దకు ఇప్పటికే కమిటీ వెళ్లి, విచారణ చేపట్టిందన్నారు. మరికొద్ది గంటల్లోనే రిపోర్టు వస్తుంది. తక్షణమే చర్యలు తీసుకుంటామని చెప్పారు.

ప్రయాగ్‌రాజ్‌ ఐజీ రాకేశ్‌ సింగ్‌ మాట్లాడుతూ.. ప్రభుత్వం ఏర్పాటు కమిటీ విచారణ జరుపుతుందన్నారు. ఫేక్ ప్లాస్మా పంపిణీ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనుమానితులను ఇప్పటికే అదుపులోకి తీసుకున్నట్లు ఐజీ తెలిపారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితం నకిలీ బ్లడ్ బ్యాంక్‌ను కూడా గుర్తించి బ్యాన్‌ చేసినట్టుగా సింగ్ తెలిపారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఇక 24 గంటల పాటు సేవలు
ఏపీ ప్రజలకు అదిరిపోయే న్యూస్.. ఇక 24 గంటల పాటు సేవలు
ఆయన అన్నం పెట్టాడు.. ఆవిడ కన్నం వేసింది..! కట్‌చేస్తే..36 గంటల్లో
ఆయన అన్నం పెట్టాడు.. ఆవిడ కన్నం వేసింది..! కట్‌చేస్తే..36 గంటల్లో
మార్చి నెలలలో వారికి అంతా హ్యాపీ..! ఇందులో మీ రాశి ఉందా?
మార్చి నెలలలో వారికి అంతా హ్యాపీ..! ఇందులో మీ రాశి ఉందా?
ముదురు మటన్‌ మెత్తగా, త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి..
ముదురు మటన్‌ మెత్తగా, త్వరగా ఉడకాలంటే ఇలా చేయండి..
బంగారం రేంజ్‌కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
బంగారం రేంజ్‌కి మామిడి.. టన్ను ధర తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..
రైతుల కోసం కేంద్రం మరో కొత్త నిర్ణయం.. అందరికీ బెనిఫిట్
రైతుల కోసం కేంద్రం మరో కొత్త నిర్ణయం.. అందరికీ బెనిఫిట్
భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు..స్వామివారి పట్టు వస్త్రాలు మాయం
భద్రాద్రి రామాలయంలో ఇంటి దొంగలు..స్వామివారి పట్టు వస్త్రాలు మాయం
శుక్రుడితో వారికి లక్ష్మీ కటాక్షం.. వారి లైఫ్ స్టైల్ మారిపోవడం..
శుక్రుడితో వారికి లక్ష్మీ కటాక్షం.. వారి లైఫ్ స్టైల్ మారిపోవడం..
అరె ఏంట్రా ఇది! ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్.. అమ్మాయి ఎవరంటే?
అరె ఏంట్రా ఇది! ఎంగేజ్మెంట్ చేసుకున్న షణ్ముఖ్.. అమ్మాయి ఎవరంటే?
త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్
త్వరలో విశ్వంభర రిలీజ్ డేట్ అనౌన్స్‌మెంట్