AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నదిలో ఈదుకుంటూ వెళ్లి అంతిమక్రియలు.. శ్మశానవాటిక లేక గ్రామస్థులకు తప్పని తిప్పలు

ఓ వ్యక్తి చనిపోవడంతో అతని దహనసంస్కారాలకు స్థలం లేక నదిని దాటుతూ పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హృదయ విదారకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

నదిలో ఈదుకుంటూ వెళ్లి అంతిమక్రియలు.. శ్మశానవాటిక లేక గ్రామస్థులకు తప్పని తిప్పలు
Balaraju Goud
|

Updated on: Feb 19, 2021 | 4:59 PM

Share

Carrying the dead body River : మనిషి బతికినన్ని రోజులూ ఎక్కడైనా, ఏదోలా బతికేయొచ్చు. కానీ అదే మనిషి చనిపోతే అంతిమ సంస్కారాలకైనా కచ్చితంగా కొంత ప్రదేశం కావాలి. అలాంటిది ఊరికి ఉత్తరానే ఉండాలి. కానీ.. ఇప్పుడు అవే శ్మశానాలూ కబ్జా అవుతున్నాయి. ఫలితంగా అంత్యక్రియలకూ ఆస్కారం లేకుండా పోయింది. శ్మశానవాటికకు వెళ్లడానికి సరైన రహదారి లేక జనం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తాజాగా ఓ వ్యక్తి చనిపోవడంతో అతని దహనసంస్కారాలకు స్థలం లేక నదిని దాటుతూ పూర్తి చేయాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ హృదయ విదారకర ఘటన తమిళనాడు రాష్ట్రంలో చోటుచేసుకుంది.

తమిళనాడులోని వేలూరు జిల్లా అత్తికుప్పంలో ఓ వ్యక్తి ఇటీవల మరణించాడు. దీంతో కుటుంబసభ్యులు అతని అంతిమక్రియలు చేసేందుకు నిర్ణయించుకున్నారు. దీంతో శ్మశానానికి వెళ్లే దారి కబ్జా చెయ్యడంతో ఊరికి ఆనుకుని ఉన్న నది దాటుకుంటూ వెళ్లి అవతలి ఒడ్డున దహనసంస్కారాలు నిర్వహించారు. శ్మశానానికి వెళ్లే దారి లేక నదిలోనే మునుగుతూ శవాన్ని మోసుకెళ్లారు గ్రామస్థులు. ఇలా ప్రాణాలకు తెగించి అంత్యక్రియలను పూర్తి చేశారు.

అయితే, అత్తి కుప్పం గ్రామంలో ఎవరైనా చనిపోతే వారిని ప్రాణాలకు తెగించి శ్మశానానికి తీసుకెళ్లాల్సిందే అంటున్నారు గ్రామస్థులు. శ్మశానికి దారి లేక నది మధ్యలోనే దిగి పూర్తిగా మునిగిపోయే ప్రమాదం ఉన్న ఏ మాత్రం లెక్కచేయకుండా శవాన్ని తమ భుజం ఫై వేసుకొని వెళ్తున్నారు. శ్మశానానికి వెళ్లే దారిని ప్రైవేట్ వ్యక్తులు ఆక్రమించడం తో వేరే దారి లేక ప్రాణాలకు తెగించి అంత్యక్రియలు నిర్వహిస్తున్నామని గ్రామస్థులు తెలిపారు. దీనిపై గ్రామస్థులు కొన్ని రోజులుగా పోరాటాలు చేసిన తమకు న్యాయం జరగడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా కబ్జాకు గురైన శ్మశానావాటికకు విముక్తి కలిగించాలని గ్రామస్థులు వేడుకుంటున్నారు.

ఇదీ చదవండి… గుత్తికోయలపై అధికారుల ఆటివిక దాడి.. గిరిజనుల గుడిసెలు పీకి.. నిప్పంటించిన అటవీ అధికారులు