AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కలిసే జీవిస్తాం.. కలిసే మరణిస్తాం.. పోలీసు అంకుల్ మాకు పెళ్లి చేయండి అంటున్న 15 ఏళ్ల బాలికలు.. ఎక్కడంటే

ఆ బాలికలు ఇద్దరూ ఒప్పుకోలేదు. కలిసి జీవిస్తాం.. లేదా కలిసి చనిపోతాం అంటూ చెబుతూనే ఉన్నారు. పోలీసులు ఎంతగానో నచ్చ చెప్పినా వారిద్దరూ అంగీకరించకపోవడంతో పోలీసులు బాలికల తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం రెండు గంటలపాటు శ్రమించి బాలికలను ఇద్దరినీ శాంతింపజేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో సహా వెనక్కి పంపించారు.

కలిసే జీవిస్తాం.. కలిసే మరణిస్తాం.. పోలీసు అంకుల్ మాకు పెళ్లి చేయండి అంటున్న 15 ఏళ్ల బాలికలు.. ఎక్కడంటే
Saharanpur Two Girls Love
Surya Kala
|

Updated on: Jun 07, 2024 | 9:36 AM

Share

పోలీస్ అంకుల్ మేమిద్దరం ప్రేమించుకుంటున్నాం.. పెళ్లి చేసుకుని జీవితాంతం కలిసి జీవిస్తాం.. అంటూ ఇద్దరు బాలికలు పోలీసు స్టేషన్ గడప ఎక్కారు. ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మైనర్ బాలికలు తమ పెళ్లి జరిపించమని పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పోలీసులను అభ్యర్థించారు. ఆ ఇద్దరు బాలికలు చేయి చేయి పట్టుకుని చెబుతుంటే.. స్టేషన్‌లో ఉన్నవారంతా వెంటనే స్పృహ కోల్పోయారు. ఈ ఘటన సహరన్‌పూర్‌లో చోటు చేసుకుంది.

బుధవారం 14, 15 ఏళ్ల ఇద్దరు బాలికలు చేయి చేయి పట్టుకుని పోలీస్ స్టేషన్‌లోకి ప్రవేశించారు. పోలీస్ స్టేషన్‌కి రావడానికి గల కారణం ఏమిటని పోలీసులు అడగ్గా.. సార్, మేమిద్దరం నిజంగా ప్రేమించుకుంటున్నాం. ఒకరినొకరం విడిచి ఉండలేం.. ఒకరు లేకుండా ఒకరు జీవించలేం.. కనుక మేము కలకాలం కలిసి జీవించడానికి మీరు మాకు పెళ్లి చేయాలని కోరుకుంటున్నాము. మా కుటుంబ సభ్యులు మమ్మల్ని పెళ్లి చేసుకోనివ్వరు. అందుకే మేము మీ సహాయం కోరడానికి వచ్చామని చెప్పారు.

పోలీసులు బాలికలు చెప్పిన మాటలు విని మొదట తమాషా చేస్తున్నారని అనుకున్నారు. అయితే ఆ బాలికలు ఇద్దరూ తాము పెళ్లి చేసుకుంటాం అంటూ పట్టుదలతో ఉన్నారు. దీంతో పోలీసులు వారిని ఇది కరెక్ట్ కాదు అని ఒప్పించే ప్రయత్నం చేశారు. అయితే ఆ బాలికలు ఇద్దరూ ఒప్పుకోలేదు. కలిసి జీవిస్తాం.. లేదా కలిసి చనిపోతాం అంటూ చెబుతూనే ఉన్నారు. పోలీసులు ఎంతగానో నచ్చ చెప్పినా వారిద్దరూ అంగీకరించకపోవడంతో పోలీసులు బాలికల తల్లిదండ్రులను పోలీస్‌స్టేషన్‌కు పిలిపించారు. అనంతరం రెండు గంటలపాటు శ్రమించి బాలికలను ఇద్దరినీ శాంతింపజేశారు. ఆ తర్వాత కుటుంబ సభ్యులతో సహా వెనక్కి పంపించారు.

ఇవి కూడా చదవండి

ప్రేమకథ ఎలా మొదలైందంటే

ఇద్దరు బాలికల్లో ఒకరు జ్వాలాపూర్ వాసి అని పోలీస్ స్టేషన్ తెలిపింది. కొద్దిరోజుల క్రితం జ్వాలాపూర్‌లో నివాసముంటున్న ఓ బాలిక తన కుటుంబంతో కలిసి పిరాన్‌ కాలియార్‌ దర్గాకు వెళ్లింది. అక్కడ ఆ బలికకి ఒక టీనేజ్ అమ్మాయి పరిచయమైంది. ఇద్దరూ ఫోన్ నంబర్లు మార్చుకున్నారు. తర్వాత తరచుగా మొబైల్ ఫోన్లలో మాట్లాడటం ప్రారంభించారు. ఆ తర్వాత వారు ఒకరితో కలసి జీవించాలని నిర్ణయించుకున్నారు.

జూన్ 5న ఇద్దరూ పోలీస్ స్టేషన్‌కు చేరుకుని పెళ్లి చేసుకోవాలని పోలీసులను అభ్యర్థించారు. దీంతో పోలీసులు వారిద్దరినీ శాంతింపజేసి ఇంటికి పంపించారు. అయితే ఇప్పుడు ఈ విషయం ఏరియాలో చర్చనీయాంశంగా మారింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..