Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మద్యం ప్రియులకు పండుగలాంటి వార్త.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. ఎగబడ్డ జనం!

మార్చి నెలలో ఉత్తరప్రదేశ్‌లో భారీ స్థాయిలో మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. కొత్త ఆర్థిక సంవత్సరానికి ముందే పాత కాంట్రాక్టర్లు తమ స్టాక్‌ను క్లియర్ చేయడంతో మద్యం ప్రియులు బారులు తీరారు. చాలా మంది ఒక బాటిల్ ధరకు రెండు బాటిళ్లను అమ్మకాలు జరుగుతుండటంతో క్యూలైన్‌లు పెరిగిపోయాయి. ఒక్కొక్కరు పెట్టెల కొద్దీ మద్యాన్ని కొనుగోలు చేస్తున్నారు.

మద్యం ప్రియులకు పండుగలాంటి వార్త.. ఒకటి కొంటే మరొకటి ఫ్రీ.. ఎగబడ్డ జనం!
Wine Shop
Follow us
Balaraju Goud

|

Updated on: Mar 25, 2025 | 8:32 PM

మద్యం ప్రియులకు మంచి రోజులు వచ్చాయి. ప్రస్తుతం, ఉత్తరప్రదేశ్‌‌లోని అన్ని జిల్లాల్లో దాదాపు అన్ని మద్యం దుకాణాలలో మద్యం బాటిళ్లకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. అమ్మకం అంటే ఒక సీసా ధరకు రెండు సీసాలు. ఈ వార్త అందిన వెంటనే, మద్యం దుకాణాల వద్దకు పెద్ద ఎత్తున మద్యం ప్రియులు చేరుకోవడంతో పొడవైన క్యూ ఏర్పడటం ప్రారంభమైంది. పరిస్థితి ఎలా ఉందంటే, సాధారణంగా ఒక బాటిల్ మద్యం కొనే వారు కూడా ఇప్పుడు ఒక బాక్స్ మద్యం కొంటున్నారు. మార్చి నెలతో మద్యం దుకాణాలు మూసివేత కారణంగా ఈ పరిస్థితి తలెత్తింది.

నిజానికి, కొత్త ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ 1 నుండి ప్రారంభమవుతుంది. దీంతో, కొత్త మద్యం ఒప్పందాలు ప్రారంభించడం జరుగుతుంది. పాత కాంట్రాక్టర్ కొత్తగా దుకాణం పొందకపోతే, అతను తన దుకాణాన్ని మూసివేయవలసి ఉంటుంది. అటువంటి పరిస్థితిలో, కాంట్రాక్టర్లందరూ తమ గిడ్డంగులలో నిల్వ చేసిన స్టాక్‌ను ఖాళీ చేసే ప్రక్రియను ప్రారంభించారు. దీని కోసం, చాలా దుకాణాలలో పాత స్టాక్ అమ్మకం ప్రారంభించారు. కొన్ని దుకాణాలలో, ఒకటి ధరకు రెండు సీసాలు ఇస్తున్నారు. కొన్ని దుకాణాలలో మద్యం ధర సగానికి తగ్గించారు.

ఈ వార్త మద్యం ప్రియులకు ఆనందాన్నిచ్చింది. మంగళవారం(మార్చి 25) మధ్యాహ్నం, నోయిడాలోని మద్యం దుకాణాలకు పెద్ద సంఖ్యలో జనం చేరుకున్నారు. మండే ఎండలను సైతం లెక్కచేయకుండా, గంటల తరబడి క్యూలో నిలబడి, తమకు నచ్చిన మద్యం అధిక మోతాదులో కొనుగోలు చేసిన తర్వాతే వెళ్లిపోయారు. చాలా మంది దుకాణాల నుండి సీసాలతో కాకుండా మొత్తం పెట్టెలతో బయటకు రావడం కనిపించింది. ముజఫర్‌నగర్, ఘజియాబాద్, మీరట్, ఆగ్రా, బల్లియా, ఘాజీపూర్ వంటి జిల్లాల్లోనూ ఇలాంటి పరిస్థితి కనిపించింది.

చాలా మంది తమ కార్యాలయాల నుండి సెలవు తీసుకుని మరీ క్యూలైన్లలో నిల్చుంటున్నారు. ఇక మరికొందరు ఇతర వ్యాపారులు తమ దుకాణాలను మూసివేసిన తర్వాత మద్యం దుకాణాలకు చేరుకుంటున్నారు. తక్కువ ధరకు మద్యం దొరుకుతుండటంతో ఒక రోజు సెలవు తీసుకోవడమే కాకుండా, వచ్చే నెలకు సంబంధించిన స్టాక్ కూడా సేకరించినట్లు ఒక వినియోగదారుడు తెలిపారు. అలాంటి చౌక మద్యం రాబోయే ఒక సంవత్సరం వరకు అందుబాటులో ఉండదు. బదులుగా, కొత్త ఒప్పందాలు ప్రారంభమైన తర్వాత మద్యం ధర మరింత పెరుగుతుందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మద్యం దుకాణాలకు వినియోగదారులు బారులు తీరుతున్నారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..