AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coronavirus: 8 రోజుల శిశువుకు కరోనా పాజిటివ్‌.. కోవిడ్‌ను జయించిన బాలుడు.. హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో..

Coronavirus: 8 రోజుల శిశువుకు కరోనా పాజిటివ్‌.. కోవిడ్‌ను జయించిన బాలుడు.. హర్షం వ్యక్తం చేసిన తల్లిదండ్రులు
Subhash Goud
|

Updated on: Apr 29, 2021 | 10:43 PM

Share

Coronavirus: దేశ వ్యాప్తంగా కరోనా అల్లకల్లోలం చేస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు అధిక సంఖ్యలో నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో ఒక ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఘజియాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో  శ్వాస సంబంధిత సమస్యతో బాధపడుతున్న8 రోజుల శిశువును అడ్మిట్‌ చేశారు. దీంతో వైద్యులు ఆ శిశువుకు వెంటనే చికిత్స ప్రారంభించి కరోనా పరీకలు చేశారు అందులో శిశువుకు కరోనా పాజిటివ్ తేలింది. ఇక  శిశువు అనారోగ్యం నుంచి కోలుకున్నాడు. ఇక ఆ బాలుడు ఇప్పుడు కరోనాను జయించాడు. ఆ తర్వాత శిశువుకు కరోనా పరీక్షలు నిర్వహించగా, అందులో నెగిటివ్ రిపోర్టు రావడంతో తల్లిదండ్రుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. దీంతో వైద్యులు బాలున్ని డిశ్చార్జి చేశారు అయితే అప్పుడే పుట్టిన శిశువును సైతం వదిలి పెట్టడం లేదు కరోనా మహమ్మారి. ప్రముఖులు, సామాన్యుల నుంచి అప్పుడే పుట్టిన శిశువులను సైతం వెంటాడుతోంది. ఇక దేశ వ్యాప్తంగా కరోనా మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. రోజురోజుకు పాజిటివ్‌ కేసులు, మరణాలు తీవ్ర స్థాయిలో నమోదు కావడంలో ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సైతం కరోనా కట్టడికి తీవ్ర స్థాయిలో చర్యలు చేపడుతున్నాయి.

ఇవీ చదవండి:

మహారాష్ట్రలో కరోనా విలయతాండవం.. రికార్డు స్థాయిలో కరోనా పాజిటివ్‌ కేసులు.. తాజాగా ఎన్ని కేసులంటే..!

Telangana CM KCR: తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మరోమారు కరోనా పరీక్షలు.. ఎందుకంటే..!