AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పరుగెడుతూనే రెండు భాగాలుగా విడిపోయిన నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ రైలు..!

ఉత్తరప్రదేశ్‌లో రైలుకు పెను ప్రమాదం తప్పింది. చందౌలిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ సమీపంలో ఢిల్లీ నుండి వస్తున్న రైలు జాయింట్ కప్లింగ్ విరిగిపోయింది. దీని కారణంగా రైలు రెండు భాగాలుగా విడిపోయింది. దీంతో రైలు లోపల కూర్చున్న ప్రయాణికుల్లో భయాందోళన నెలకొంది. రైలు మరమ్మతులు చేపట్టిన తర్వాత రైలు యథావిధిగా కదిలింది.

పరుగెడుతూనే రెండు భాగాలుగా విడిపోయిన నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ రైలు..!
Train
Balaraju Goud
|

Updated on: Mar 04, 2025 | 8:32 AM

Share

ఉత్తరప్రదేశ్‌లోని చందౌలిలో పెను ప్రమాదం తప్పింది. ఇక్కడ ఢిల్లీ నుండి వస్తున్న రైలు అకస్మాత్తుగా రెండు భాగాలుగా విడిపోయింది. నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ ఆనంద్ విహార్ నుండి ఒడిశాలోని పూరీకి వెళుతోంది. చందౌలిలోని దీన్ దయాళ్ ఉపాధ్యాయ జంక్షన్ సమీపంలో రైలు కప్లింగ్ అకస్మాత్తుగా తెగిపోయింది. దీని కారణంగా రైలు రెండు భాగాలుగా విడిపోయింది.

రైలు నంబర్ 12876 నందన్ కానన్ ఎక్స్‌ప్రెస్ స్లీపర్ కోచ్ S4 బోగీ జాయింట్ విరిగిపోవడం వల్ల రెండు భాగాలుగా విడిపోయింది. కొద్దిసేపటికే అక్కడ గందరగోళం చెలరేగింది. రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. ప్రస్తుతం రైలు మరమ్మతులు చేపడుతున్నట్లు అధికారులు తెలిపారు.

అంతకు ముందు, ఫతేపూర్‌లో కూడా ఒక పెద్ద రైల్వే ప్రమాదం తప్పింది. ఇక్కడ ఒకే ట్రాక్‌పై రెండు గూడ్స్ రైళ్లు ఒకదానికొకటి ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇంజిన్ బాగా దెబ్బతింది. ఈ గూడ్స్ రైళ్లు ఖాగా పట్టణంలో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో రెండు వాహనాల లోకో ఫైలట్లు తీవ్రంగా గాయపడ్డారు. సిగ్నల్ అందుబాటులో లేకపోవడంతో మొదటి గూడ్స్ రైలు ఖాగా కొత్వాలి ప్రాంతంలోని పంభీపూర్ వద్ద DFCCIL ట్రాక్‌పై నిలబడి ఉంది. దానిని వెనుక నుండి మరో గూడ్స్ రైలు ఢీకొట్టింది. అదృష్టవశాత్తూ ఈ ప్రమాదంలో ఎవరూ ప్రాణాలు కోల్పోలేదు.

రెండు రోజుల క్రితం, బీహార్‌లోని మిథిలా ఎక్స్‌ప్రెస్ రైలు లోకో ఫైలట్ సమయస్పూర్తితో వ్యవహరించడంతో రైలు పట్టాలు తప్పకుండా బయటపడింది. మిథిలా ఎక్స్‌ప్రెస్ హౌరా నుండి రక్సౌల్ జంక్షన్‌కు వస్తోంది. అప్పుడు, రక్సౌల్ కాలువపై రైల్వే క్రాసింగ్ మూసివేయడంతో, ఒక బైకర్ పక్క నుండి ట్రాక్ దాటడానికి ప్రయత్నించాడు. కానీ బైక్ రైల్వే ట్రాక్ మధ్యలో ఇరుక్కుపోయింది. బైక్ రైడర్ తన బైక్ ను బయటకు తీయడానికి తన శాయశక్తులా ప్రయత్నించాడు. కానీ అతను విఫలమయ్యాడు. ఇంతలో, మిథిలా ఎక్స్‌ప్రెస్ పదే పదే హారన్ మోగిస్తూ వచ్చింది. ఆ బైకర్ తన బైక్‌ను పట్టాల మధ్యలో వదిలేసి అక్కడి నుండి వెళ్లిపోయాడు. ఆ తర్వాత రైలు లోకో ఫైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపాడు. కానీ రైలు బైక్‌ను కొంత దూరం ఈడ్చుకుంటూ వెళ్లి ముందుకు కదిలింది. ఆ తర్వాత, లోకో ఫైలట్ రైలు నుండి దిగి బైక్‌ను తీసివేసి, ఆర్‌పిఎఫ్‌కు సమాచారం ఇచ్చిన తర్వాత, రైలు రక్సౌల్ జంక్షన్‌కు బయలుదేరింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
బీచ్‌లో పరువాల విందు.. బాలయ్య నటి అదిరిపోయే ఫొటోస్
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..
శిక్షణ ఇచ్చిన గురువుకే పంగనామం పెట్టాలనుకున్నాడు.. చివరకు..