AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెండు గంటల్లో పెళ్లి.. వరుడి నుంచి ఫోన్ కాల్ అందుకుని స్పృహతప్పి పడిపోయిన వధువు!

ఆగ్రాలో ఒక వరుడి చేసిన ఘనకార్యం వెలుగులోకి రావడంతో వధువు తరపు వారు అతనిపై కేసు పెట్టారు. పెళ్లి రోజున, వరుడు తాను పోలీస్ స్టేషన్‌లో ఉన్నానని పెళ్లి తేదీ మార్చుకోవాలంటూ వధువుతో చెప్పాడు. తనను పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పాడు. ఈ విషయం తెలుసుకున్న వధువు కుటుంబం పోలీస్ స్టేషన్‌కు చేరుకుంది.

రెండు గంటల్లో పెళ్లి.. వరుడి నుంచి ఫోన్ కాల్ అందుకుని స్పృహతప్పి పడిపోయిన వధువు!
Groom
Balaraju Goud
|

Updated on: Feb 16, 2025 | 4:44 PM

Share

చేతులకు గోరింట కట్టుకుని, ఎర్రటి దుస్తులు ధరించిన ఒక వధువు తన వరుడి కోసం ఎదురుచూస్తోంది. పెళ్లి ఊరేగింపును స్వాగతించడానికి వధువు కుటుంబం నిలబడి ఉంది. ఇంతలో వధువు సెల్‌ఫోన్ మోగింది. అవతలి నుంచి కాల్ చేసిన వ్యక్తి నవ వరుడు. కంగారుగా కాల్ లిఫ్ట్ చేయడంతో పెళ్లి తేదీ మార్చుకోమని వరుడు సూచించాడు. ప్రస్తుతం తాను పోలీస్ స్టేషన్‌లో ఉన్నానని చెప్పాడు. ఇది విన్న వధువు స్పృహతప్పి పడిపోయింది. ఆ తరువాత వధువు కుటుంబం పోలీస్ స్టేషన్‌కు చేరుకోవడంతో అసలు నిజం తెలిసి, పెళ్లిని నిలిపివేశారు.

న్యూ ఆగ్రాకు చెందిన అమ్మాయి వివాహం గత ఏడాది నవంబర్‌లో తాజ్‌గంజ్‌కు చెందిన అంబర్ శర్మ అనే యువకుడితో నిశ్చయమైంది. అంబర్ శర్మ ఒక ఆటోమొబైల్ కంపెనీలో మేనేజర్‌గా పని చేస్తున్నాడు. ఫిబ్రవరి 10న నిశ్చితార్థ వేడుక జరిగింది. ఫిబ్రవరి 12న వివాహం జరగాల్సి ఉంది. దయాల్‌బాగ్ రోడ్డులోని రిసార్ట్‌లో వివాహ వేడుకకు వధువు కుటుంబం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అతని దగ్గరి బంధువులు, స్నేహితులు కూడా వచ్చారు. పెళ్లి ఊరేగింపు సాయంత్రం ఆరు గంటలకు చేరుకోవాలి. మధ్యాహ్నం 3:15 గంటలకు, వరుడు వధువుకు ఫోన్ చేసి తన గురించి చెప్పి, పెళ్లి వేడుకకు రాలేనని చెప్పాడు. తానూ తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌లో ఉన్నానని చెప్పాడు. పెళ్లి తేదీని వాయిదా వేసుకుందామని అతను వధువుకు చెప్పాడు.

ఇది విన్న తర్వాత వధువు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. వధువు తండ్రి వెంటనే తాజ్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు చేరుకున్నాడు. అయితే అక్కడ ఢిల్లీకి చెందిన ఒక అమ్మాయి తన ఒడిలో ఒక బిడ్డతో కనిపించింది. ఆ అమ్మాయి తాను వరుడిని ఒక ఆలయంలో వివాహం చేసుకున్నానని, లివ్-ఇన్ సంబంధంలో జీవిస్తున్నానని చెప్పింది. ఆ ప్రేమికుడు ఆమెను వదిలేసి వేరే చోట పెళ్లి చేసుకోబోతున్నాడు. ఈ సమాచారం అందిన వెంటనే, ఆమె ఢిల్లీ నుండి ఇక్కడికి వచ్చింది. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు వరుడిని అరెస్ట్ చేశారు.

పెళ్లి ఊరేగింపు కోసం ఎదురు చూస్తున్న వధువు, వివాహం ఆగిపోవడంతో తీవ్ర అస్వస్థతకు గురైంది. సొసైటీ వాట్సాప్ గ్రూప్ ద్వారా ఈ సంబంధం ఏర్పడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. ఆ అబ్బాయి బయోడేటా వచ్చి సంబంధం సరిచేసుకుంది. అప్పటి వరకు వరుడి వివాహం గురించి ఎటువంటి సమాచారం లేదని వధువు బంధువులు తెలిపారు.

మరిన్ని హ్యుమన్ ఇంట్రెస్ట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

Follow Us