AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vande Sadharan: పుష్ – పుల్ ఫస్ట్ లుక్ అదిరిందిగా.. దూసుకుపోయేందుకు వందే సాధారణ్ రెడీ..

Vande Sadharan Push-Pull loco: ప్రస్తుతం ఈ రైలు AC చైర్ కార్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ఛార్జీలు ఇతర సాధారణ రైళ్ల కంటే కొంచెం ఎక్కువ. దీనిని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి, రైల్వే తన నాన్-ఎసి వెర్షన్‌ను అతి త్వరలో ప్రారంభించబోతోంది. ఈ వందే సామాన్య్ రైలు ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో చూపించారు. ఈ వందే ఆర్డినరీ రైలు ఎంత ప్రత్యేకత ఎంటో చూద్దాం..

Vande Sadharan: పుష్ - పుల్ ఫస్ట్ లుక్ అదిరిందిగా.. దూసుకుపోయేందుకు వందే సాధారణ్ రెడీ..
Minister Ashwini Vaishnaw
Sanjay Kasula
|

Updated on: Oct 12, 2023 | 6:39 AM

Share

ప్రస్తుతం దేశంలో అత్యంత చర్చనీయాంశమైన రైలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు. ఫిబ్రవరి 2019లో ప్రధాని నరేంద్ర మోదీ వారణాసి-దేశ రాజధాని ఢిల్లీ మధ్య ఈ రైలును ప్రారంభించారు. అప్పటి నుంచి దేశంలో మొత్తం 34 జతల వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలు ఎక్కాయి. అయితే, ప్రస్తుతం ఈ రైలు AC చైర్ కార్‌లో మాత్రమే అందుబాటులో ఉంది. దీని ఛార్జీలు ఇతర సాధారణ రైళ్ల కంటే కొంచెం ఎక్కువ. దీనిని సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడానికి, రైల్వే తన నాన్-ఎసి వెర్షన్‌ను అతి త్వరలో ప్రారంభించబోతోంది. ఈ వందే సామాన్య్ రైలు ఫస్ట్ లుక్ రివీల్ అయింది. ఆ వివరాలను కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ తన ఎక్స్ ఖాతాలో చూపించారు. ఈ వందే ఆర్డినరీ రైలు ఎంత ప్రత్యేకత ఎంటో చూద్దాం.

వందే సామాన్య్ రైలు ఎలా ఉంది..

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలు దేశంలోనే తొలి సెమీ హైస్పీడ్ రైలు. ఇదే తరహాలో సామాన్యుల కోసం నాన్ ఏసీ రైలు వందే సాధారణ్ కూడా సిద్ధమవుతోంది. దీనిని నాన్ ఏసీ పుష్ పుల్ ట్రైన్ అని కూడా పిలుస్తారు. అంటే రైలు ముందు, వెనుక రెండింటిలో ఇంజన్లు ఉన్నాయి. రైలు ఎక్కడి నుండైనా వేగంగా దూసుకుపోగలదు. ఈ ఏడాది చివరి నాటికి ఈ రైలు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులోగా దీని ట్రాయల్ రన్ ప్రారంభమవుతుందని భావిస్తున్నారు.

ఇది చెన్నైలోని ఇంటిగ్రల్ కోచ్ ఫ్యాక్టరీ (ICF, చెన్నై)లో తయారు చేయబడుతోంది. ఈ రైలు సెట్ సిద్ధంగా ఉంది, దీనికి 22 కోచ్‌లు ఉన్నాయి. రెండు వైపులా లోకోమోటివ్ ఇంజన్లు అమర్చబడి ఉంటాయి. ఇందులో 12 స్లీపర్ క్లాస్ కోచ్‌లు, 8 జనరల్ కోచ్‌లు, 2 గార్డు కోచ్‌లు ఉన్నాయి. చిత్తరంజన్ లోకోమోటివ్ ఫ్యాక్టరీ (CLW)లో వందే సాధన కోసం ప్రత్యేకంగా రెండు ఇంజన్‌లను తయారు చేస్తున్నారు.

Push Pull Loco

Push Pull Loco

2019లో మొదటి వందే భారత్ రైలు..

2019 ఫిబ్రవరిలో దేశంలోనే తొలి వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ప్రధాని నరేంద్ర మోదీ జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలు వారణాసి, న్యూఢిల్లీ మధ్య నడుస్తుంది. దీని తరువాత, ఇది న్యూఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి, ముంబై సెంట్రల్ నుండి గాంధీనగర్ మధ్య నడుస్తుంది. అప్పటి నుండి, దేశంలో మొత్తం 34 జతల వందేభారత్ రైళ్లు నడపబడ్డాయి.

వందే మెట్రో, వందే స్లీపర్ కోసం కూడా సన్నాహాలు జరుగుతున్నాయి. వందే భారత్, వందే మెట్రో స్లీపర్ వెర్షన్‌పై రైల్వే కూడా వేగంగా పని చేస్తోంది. తాజాగా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వందే భారత్ స్లీపర్ వెర్షన్ రైలు కాన్సెప్ట్ ఫోటోను పంచుకున్నారు. వచ్చే ఏడాది మార్చి నాటికి వచ్చే అవకాశం ఉంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లు ఉంటాయి, వాటిలో 11 AC 3 టైర్, 4 AC 2 టైర్, 1 కోచ్ 1st AC. వచ్చే ఏడాది మార్చిలోపు ఈ రైలు సెట్ సిద్ధమై, ఆ తర్వాత మొదటి రైలును పరీక్షకు పంపనున్నారు. అదే సమయంలో, ఫిబ్రవరి-మార్చి నాటికి వందే మెట్రోకు సంబంధించి సన్నాహాలు కూడా పూర్తి స్థాయిలో జరుగుతున్నాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ చూడండి