TV9 WITT: ‘హమారా భారత్‌ మహాన్‌’ అన్న మాటను గట్టిగా వినిపించిన టీవీ నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్

టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌ చరిత్ర సృష్టించింది. హమారా భారత్‌ మహాన్‌ అన్న మాటకు టీవీ నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్ వేదికైంది. TV9 నెట్‌వర్క్ వార్షిక ఫ్లాగ్‌షిప్ కాన్‌క్లేవ్, వాట్ ఇండియా థింక్స్ టుడే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2024 రెండవ ఎడిషన్ ముగిసింది. సత్తా సమ్మేళన్‌ పేరిట దేశ రాజధాని న్యూఢిల్లీలో గత మూడు రోజులుగా జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.

TV9 WITT: 'హమారా భారత్‌ మహాన్‌'  అన్న మాటను గట్టిగా వినిపించిన టీవీ నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్
Tv9 What India Thinks Today Global Summit 2024
Follow us

|

Updated on: Feb 28, 2024 | 8:30 AM

టీవీ9 గ్లోబల్‌ సమ్మిట్‌ చరిత్ర సృష్టించింది. హమారా భారత్‌ మహాన్‌ అన్న మాటకు టీవీ నెట్‌వర్క్ గ్లోబల్ సమ్మిట్ వేదికైంది. TV9 నెట్‌వర్క్ వార్షిక ఫ్లాగ్‌షిప్ కాన్‌క్లేవ్, వాట్ ఇండియా థింక్స్ టుడే న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ 2024 రెండవ ఎడిషన్ ముగిసింది. సత్తా సమ్మేళన్‌ పేరిట దేశ రాజధాని న్యూఢిల్లీలో గత మూడు రోజులుగా జరిగిన గ్లోబల్‌ సమ్మిట్‌లో భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే, ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ సహా వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, దేశ, విదేశాలకు చెందిన ప్రముఖులు, AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ హాజరయ్యారు.

దేశంలోని నంబర్ వన్ న్యూస్ నెట్‌వర్క్ TV9 వాట్ ఇండియా థింక్స్ టుడే రెండవ ఎడిషన్ థీమ్ ఇండియా: పొయిజ్డ్ ఫర్ ది నెక్స్ట్ బిగ్ లీప్. ఇది ప్రపంచ రంగంలో భారతదేశం ప్రదర్శిత నాయకత్వంపై దృష్టి పెడుతోంది. ఫిబ్రవరి 25 నుండి ఫిబ్రవరి 27 వరకు జరిగిన ఈ ఈవెంట్‌లో ప్రధాన ఆకర్షణ ప్రధాని నరేంద్ర మోదీ. టీవీ9 వేదికగా సమకాలీన రాజకీయాలపై తనదైన శైలిలో స్పందించారు ప్రధాని మోదీ. మరోసారి తమ ప్రభుత్వమే ఖాయమని, అతివేగంగా , అద్భుతమైన నిర్ణయాలు తీసుకుంటామని ప్రకటించారు. టీవీ9 సమ్మిట్‌లో దేశానికి చక్కని సందేశమిచ్చారు ప్రధాని మోదీ. భిన్నత్వంలో ఏకత్వానికి భారత్‌ నిదర్శనమన్నారు. టీవీ9 దీనికి ప్రతిబింబమని ప్రశంసించారు. గ్లోబల్ సమ్మిట్‌లో, క్రీడలు, వినోదం, ఆరోగ్యం, సంస్కృతి, ఆర్థిక వ్యవస్థ, మహిళా శక్తి, AI వంటి అనేక ముఖ్యమైన సెషన్‌లు మొదటి రెండు రోజులు జరిగాయి. మూడవ రోజు పవర్ కాన్ఫరెన్స్ నిర్వహించడం జరిగింది.

న్యూస్9 గ్లోబల్ సమ్మిట్ ఫిబ్రవరి 25న టీవీ9 నెట్‌వర్క్ MD, CEO బరున్ దాస్ స్వాగత ప్రసంగంతో ప్రారంభమైంది. కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ క్రీడలు, క్రీడాకారులను ముందుకు తీసుకెళ్లడానికి రోడ్‌మ్యాప్ గురించి వివరించారు. దీని తర్వాత, పూనావాలా ఫిన్‌కార్ప్ MD అభయ్ భూతాడ పరిశ్రమపై తన అభిప్రాయాలను అందించారు. నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ బ్రాండ్ ఇండియా గురించి చెప్పారు. దీంతో పాటు ప్రముఖ బాడ్మింటన్ క్రీడాకారుడు పుల్లెల గోపీచంద్, నటి రవీనా టాండన్, ఖుష్బూ సుందర్, చిత్ర దర్శకుడు శేఖర్ కపూర్, రాకేష్ చౌరాసియా, వి సెల్వ గణేష్ పలు అంశాలపై మాట్లాడారు. Tv9 నక్షత్ర సమ్మాన్‌ను మొదటి రోజే ప్రకటించారు. దీనిని అందుకున్న వ్యక్తులలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, రవీనా టాండన్, అమీర్ హుస్సేన్ లోన్, రాకేష్ చౌరాసియా, వి సెల్వగ్నేష్, అన్మోల్ ఖర్బ్ ఉన్నారు.

వాట్ ఇండియా థింక్స్ గ్లోబల్ సమ్మిట్ రెండవ రోజు అనేక ముఖ్యమైన అంశాలపై చర్చ జరిగింది. రెండో రోజు ప్రధాన ఆకర్షణ ప్రధాని నరేంద్ర మోదీ, సుపరిపాలన, గత పదేళ్ల విజయాలు, ప్రజల కోసం చేసిన పనులను ప్రస్తావిస్తూ, యూపీఏ ప్రభుత్వంలో నిలిచిపోయిన ప్రాజెక్టులను కూడా ప్రస్తావించారు. అవి ఎన్‌డిఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎలా పూర్తి చేసిందో వివరించారు. గత భారతదేశాన్ని ప్రస్తావిస్తూ, ప్రస్తుత భారతదేశంలో మారిన పరిస్థితుల గురించి ప్రధాని చెప్పారు. భవిష్యత్ అవకాశాల గురించి కూడా చర్చించారు. ఆస్ట్రేలియా మాజీ ప్రధాని టోనీ అబాట్, మాల్దీవుల మాజీ మంత్రి మరియా అహ్మద్ దీదీ, ఐక్యరాజ్యసమితిలో భారత మాజీ శాశ్వత ప్రతినిధి సయ్యద్ అక్బరుద్దీన్, కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ, అశ్విని వైష్ణవ్, విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్, నటుడు ఆయుష్మాన్ ఖురానా, కంగనా రనౌత్, మారుతీ చైర్మన్ సుజుకి. ఆర్‌సి భార్గవ, డాక్టర్ వివేక్ లాల్‌తో సహా వ్యాపారం, వాణిజ్యం, పరిశ్రమలు, స్టార్టప్‌లతో అనుబంధం ఉన్న అనుభవజ్ఞులు తమ అభిప్రాయాలను అందించారు.

వాట్ ఇండియా థింక్స్ టుడే గ్లోబల్ సమ్మిట్ మూడవ రోజు, పవర్ కాన్ఫరెన్స్‌లో టీవీ9 వేదికపై రాజకీయ ప్రముఖులు తమ అభిప్రాయాలను వెల్లడించారు. మూడో రోజు నవ భారత శౌర్య కథతో ప్రారంభమైంది. ఈ సెషన్‌లో, కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ గత 10 సంవత్సరాలలో రక్షణ విధానంలో ఎలాంటి మార్పులు జరిగాయో చెప్పారు. చివరిరోజు సెషన్ కేంద్ర హోం మంత్రి అమిత్ షా ‘నేపత్య కే నాయక్’తో ముగిసింది. ఇందులో గత పదేళ్ల ప్రభుత్వ పనితీరు, ఈడీ, యూసీసీ దుర్వినియోగ ఆరోపణలు, రానున్న లోక్‌సభ ఎన్నికలతో పాటు పలు ముఖ్యమైన అంశాలపై అమిత్ షా మాట్లాడారు.

ఇక కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే TV9 మహామంచ్ నుండి ప్రజాస్వామ్యం, సందేశ్‌ఖలి, రైతుల ఉద్యమంతో సహా అనేక అంశాలపై తన అభిప్రాయాలను వ్యక్తం చేశారు. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ ఆమ్ ఆద్మీ పార్టీ, ED, ప్రాథమిక అవసరాలైన ఉచిత విద్యుత్, ఉచిత విద్య, ఉచిత వైద్యం వంటి వాటి గురించి మాట్లాడారు. AIMIM చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ ‘ఆల్ ఇండియా భాయిజాన్’ సెషన్‌లో పాల్గొన్నారు. స్వామి రామ్‌దేవ్, జమ్మూ కాశ్మీర్ ఎల్‌జీ మనోజ్ సిన్హా, పంజాబ్ సీఎం భగవంత్ మాన్, కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్, ధర్మేంద్ర ప్రధాన్, భూపేంద్ర యాదవ్, కాంగ్రెస్ నాయకుడు పవన్ ఖేడా, ఢిల్లీ ప్రభుత్వ మంత్రి అతిషి సహా ఇతర ప్రముఖులు టీవీ9 గ్రాండ్ ప్లాట్‌ఫామ్‌లో భాగమయ్యారు. సమ్మిట్‌లో నటులు అమీర్‌ఖాన్‌, కిరణ్‌రావు పాల్గొని తమ అభిప్రాయాలను వెల్లడించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి… 

Latest Articles
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
రాజస్థాన్ vs కోల్‌కతా మ్యాచ్ రద్దు.. SRHకు కలిసొచ్చిన అదృష్టం
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
వర్షం అంతరాయంతో  7 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచిన కోల్ కతా
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
లారెన్స్ గొప్ప మనసుకు మరో నిదర్శనం ఈ వీడియో! మీరు చూసేయండి
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
పొలంలో నాటి దిష్టబొమ్మ.!గాల్లోఎగురుతూ గ్రామస్తులనేహడలెత్తిస్తుంది
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
కరప్షన్‌కు కేరాఫ్‌గా మారిన కాకతీయ యూనివర్సిటీ..?
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
చెన్నై ఓటమికి ఆ ఇద్దరు ఆటగాళ్లే కారణం..ఏకిపారేస్తోన్న అభిమానులు
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
తిరుమలలో ముగిసిన పద్మావతి పరిణయ మహోత్సవం
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
రెండ్రోజుల దర్యాప్తులో కీలక ఆధారాలు.. నివేదికలో కీలక నేతలు..?
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
ఓరీ దేవుడో.. మహిళ కిడ్నీలో 300 రాళ్లు.!కారణం తెలిసి వైద్యులే షాక్
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
బయటికి చెప్పట్లేదు కానీ.. పుష్ప 2 కి డేంజర్ బెల్స్. రాకపోతే.?
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
భారతీయ బాలుడి నిజాయతీకి దుబాయ్ పోలీసులు ఫిదా.!
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఇంట్లో పెట్స్‌ని పెంచుకునేవాళ్లు తప్పక చూడాల్సిన న్యూస్‌ ఇది..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఛీ.. ఇదేం పాడుపని.. మహిళా కారులో ఉండగానే డ్రైవర్‌ గలీజు పని..
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
ఈ ఏడాది సకాలంలోనే రుతుపవనాలు.. ముందుగానే వర్ష సూచన.
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
పైకి చూస్తే ఉల్లిపాయల బస్తాలు.. లోపల చూస్తే షాకింగ్‌ సీన్‌..
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
ట్రాఫిక్‌ రూల్సా మజాకా.! కారులో హెల్మెట్ పెట్టుకోలేదని ఫైన్.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
లే ఆఫ్ ఎదుర్కొంటున్న హెచ్ 1బీ వీసాదారులకు గుడ్‌ న్యూస్‌.
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
పసిప్రాణం కోసం ఆరాటం.. రూ.17.5 కోట్ల ఇంజెక్షన్‌కు నిధుల సేకరణ.!
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
హిట్టా.? ఫట్టా.? ఆహాలో రిలీజ్ అయ్యిన విద్యా వాసుల అహం రివ్యూ.
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..
ధనుష్ ఒక గే.. సుచిత్ర షాకింగ్ కామెంట్స్. వీడియో వైరల్..