AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tripura Local Body Elections: త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. రెండో స్థానానికే పరిమితమైన తృణమూల్

త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ.. అక్కడ స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది.

Tripura Local Body Elections: త్రిపుర స్థానిక ఎన్నికల్లో బీజేపీ క్లీన్ స్వీప్.. రెండో స్థానానికే పరిమితమైన తృణమూల్
Tripura Civic Polls
Balaraju Goud
|

Updated on: Nov 28, 2021 | 4:40 PM

Share

Tripura Local Body Elections Results: త్రిపురలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన భారతీయ జనతా పార్టీ.. అక్కడ స్థానిక సంస్థలకు జరుగుతున్న ఎన్నికల్లో తొలిసారిగా బరిలోకి దిగింది. అయినప్పటికీ అపూర్వ విజయాన్ని బీజేపీ సొంతం చేసుకుంది. దీంతో పశ్చిమ బెంగాల్‌తోపాటు త్రిపురలోనూ టీఎంసీ జెండా ఎగరేస్తుందన్న తరుణంలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ముఖ్యంగా ఈ ఎన్నికలతో రాష్ట్రంలో తమ ఉనికి చాటుకుంటామని భావించిన తృణమూల్ కాంగ్రెస్ ఆశలకు ఈ ఎన్నికల ఫలితాలు గండి కొట్టాయి.

త్రిపుర స్థానిక సంస్థలకు జరిగిన ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అధిక్యత కనబర్చింది. 14 మునిసిపాలిటీలకు జరిగిన ఎన్నికల ఫలితాలు ఆదివారం వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు ఇంకా కొనసాగుతోంది. ఇతర పార్టీలను బీజేపీ క్లీన్ స్వీప్ చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే బీజేపీ 8 స్థానాల్లో విజయ ఢంకా మోగించింది. కాగా, మిగిలిన స్థానాల్లో కూడా ఆధిక్యంలో కొనసాగుతోంది. త్రిపురలో మొత్తం 20 మునిసిపాలిటీలకు గానూ 14 స్థానాల్లో గురువారం ఓటింగ్ జరిగింది. బీజేపీ అన్ని స్థానాల్లో అభ్యర్థులను నిలబెట్టింది. మొత్తం 334 వార్డులకు గానూ బీజేపీ ఇప్పటికే 112 స్థానాల్లో ఏకపక్షంగా విజయం సాధించింది. మిగిలిన మున్సిపల్ కార్పొరేషన్, నగర పంచాయతీ ఎన్నికల్లో మొత్తం 222 స్థానాలకు ఓటింగ్ జరిగింది.

రాష్ట్ర ఎన్నికల సంఘం తాజా సమాచారం ప్రకారం అంబాసా, జిరానియా, తెలియమురా, సబ్రూమ్‌లలో బీజేపీ ఆధిక్యంలో ఉంది. 2018లో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ త్రిపురలో స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేస్తోంది. అగర్తల మున్సిపల్ కార్పొరేషన్ (AMC)లోని అన్ని వార్డులలో తృణమూల్ కాంగ్రెస్ (TMC) రెండవ స్థానాన్ని పొందినట్లు ట్రెండ్‌లు చూపిస్తున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు ఏఎంసీ ఏరియాల్లో బీజేపీకి 58,821 ఓట్లు రాగా, టీఎంసీకి 22,295 ఓట్లు వచ్చాయి. సీపీఐ(ఎం) 15,960 ఓట్లతో మూడో స్థానంలో కొనసాగుతోంది.

సీపీఐ(ఎం)తో పొత్తు పెట్టుకున్న మరో మూడు వామపక్ష పార్టీలు సీపీఐ, ఫార్వర్డ్ బ్లాక్, ఆర్‌ఎస్‌పీ మొత్తం 2,650 ఓట్లను సాధించాయి. అయితే సీపీఎం మాత్రం బీజేపీ కంటే వెనుకంజలో ఉంది. అగర్తల మినహా, రెండు పట్టణ సంస్థలలో టిఎంసి రెండవ స్థానంలో నిలిచింది. మమతా బెనర్జీ నేతృత్వంలోని పార్టీ మూడు పట్టణ సంస్థలలో మూడవ స్థానంలో ఉంది. ఆరు మునిసిపల్ బాడీలలో (త్రిపుర ఎన్నికలలో TMC) కాంగ్రెస్ మూడవ స్థానంలో ఉంది. ఈ 222 స్థానాల్లో దాదాపు 785 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. 36 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు.

మరోవైపు బీజేపీ కార్యకర్తలు సంబరాలు చేసుకున్నారు. అయితే, కౌంటింగ్ ఇంకా కొనసాగుతోందని, తుది ఫలితం ప్రకటించడానికి కొంత సమయం పడుతుందని ఎన్నికల సంఘం అధికారులు చెబుతున్నారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద శాంతిభద్రతల పరిరక్షణ కోసం సెంట్రల్ ఆర్మ్‌డ్ పోలీస్ ఫోర్స్, త్రిపుర పోలీసులు, త్రిపుర స్టేట్ రైఫిల్స్ (టీఎస్‌ఆర్) సిబ్బందిని మోహరించడంతో గట్టి భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోలేదు. గురువారం ఓటింగ్‌తో, టిఎంసి, సిపిఐ(ఎం) ఓట్ల రిగ్గింగ్‌కు పాల్పడ్డాయని ఆరోపించాయి. రెండూ వివిధ మున్సిపాలిటీలలో రీపోలింగ్ చేయాలని డిమాండ్ చేశాయి. అదే సమయంలో అధికార బీజేపీ ఈ ఆరోపణలను తోసిపుచ్చింది.

Read Also…  Omicron Variant: కొత్త వేరియంట్‌పై కేంద్రం అలర్ట్.. అన్ని రాష్ట్రాలకు కీలక ఆదేశాలు.. సిద్ధంగా ఉండాలని లేఖ!

మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
మొట్టమొదటి వందే భారత్‌ స్లీపర్‌ ట్రైన్‌.. పట్టాలెక్కేది అప్పుడే!
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
సుడిగాలి సుధీర్ ఫాలో అవుతున్న ఒకే ఒక్క హీరో.
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
నన్ను గెలిపిస్తే కుక్కల బెడద ఉండదు.. సర్పంచ్‌ అభ్యర్థి హామీ!
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్‌..! లోయర్‌ బెర్త్‌లు ఇక వారికే..
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
రాహుల్ సేన ఘన విజయం..యశస్వి మెరుపు సెంచరీతో సిరీస్ మనదే!
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
హైదరాబాద్‌లో అదిరే టూరిస్ట్ ప్లేస్.. 10వేల రకాల పక్షులు.. ఇంకా..
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
వారసత్వ జువెలరీలో మెరిసిన నీతా అంబానీ..స్వదేశ్ ఫ్లాగ్‌షిప్ స్టోర్
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
యశస్వి జైస్వాల్ ధమాకా..4వ మ్యాచ్‌లోనే తొలి వన్డే సెంచరీ
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
ఇంటర్నెట్‌ అవసరం లేకుండానే పీఎఫ్‌ బ్యాలెన్స్‌ ఇలా చెక్‌ చేయండి!
అందంలో తల్లిని మించిపోయిందిగా..
అందంలో తల్లిని మించిపోయిందిగా..