AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Coimbatore: ఓనం వేడుక‌ల్లో విషాదం… ముగ్గురు కాలేజీ విద్యార్థులను మింగేసిన మెట్లబావి.. అసలేమైందంటే..

ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఓనం వేడుక‌లు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం.

Coimbatore: ఓనం వేడుక‌ల్లో విషాదం... ముగ్గురు కాలేజీ విద్యార్థులను మింగేసిన మెట్లబావి.. అసలేమైందంటే..
Onam Celebrations
Jyothi Gadda
|

Updated on: Sep 09, 2022 | 9:05 PM

Share

Coimbatore: త‌మిళ‌నాడు రాష్ట్రం కోయంబ‌త్తూరులో దారుణం జ‌రిగింది. ఓనం వేడుక‌లు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా కారు ప్ర‌మాదం జ‌రిగింది. అతివేగంతో అదుపుత‌ప్పి కారు బావిలో ప‌డిపోయింది. 70 అడుగుల లోతున్న బావిలో కారు బోల్తా కొట్టింది. ఈ ఘ‌ట‌న‌లో ముగ్గురు కాలేజీ విద్యార్థులు మృత్యువాతపడ్డారు. ఓనం వేడుక‌లు ముగించుకుని తిరిగి వ‌స్తుండ‌గా ఈ ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు స‌మాచారం. తొండాముత్తూర్‌లోని పొలాల ద‌గ్గ‌ర రోడ్డు ప‌క్క‌నే ఉన్న బావిలో కారు ప‌డిపోయింది. దీనికి సంబంధించిన మ‌రిన్ని వివ‌రాలు పరిశీలించగా..

సెప్టెంబరు 9, శుక్రవారం తెల్లవారుజామున కోయంబత్తూరు శివార్లలో ఈ కారు ప్రమాదం జరిగింది. ఓనం వేడుకలు కాలేజీ విద్యార్థుల పట్ల విషాదంగా మారాయి. ప్రమాదవశాత్తు వారు ప్రయాణిస్తు్న కారు లోతైన బావిలో ముగ్గురు విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. నలుగురు విద్యార్థుల బృందం ఓనం వేడుకలకు హాజరై తిరిగి వెళ్తుండగా ప్రమాదం జరిగింది. గురువారం రోషన్ (18) అనే విద్యార్థి తన ముగ్గురు స్నేహితులైన ఆదర్శ్, రవి, నందనన్‌లతో కలిసి ఓనం వేడుకలు వెళ్లారు..నలుగురూ వేడుకలను కొనసాగించడానికి సిరువాణిలోని ఒక ప్రైవేట్ క్లబ్‌కు బయలుదేరారు. మరుసటి రోజు ఉదయం, రోషన్ ఇంటికి తిరిగి రావడానికి నలుగురూ క్లబ్ నుండి బయలుదేరారు. తొండముత్తూరు సమీపంలోని తెన్నమనల్లూరు వద్దకు రాగానే కారు నడుపుతున్న రోషన్‌ అదుపు తప్పి రోడ్డుపై నుంచి బావిలో పడిపోయినట్లు సమాచారం. అయితే, రోషన్ తప్పించుకోగలిగాడు. మిగిలిన ముగ్గురు యువకులు కారు నుండి తప్పించుకోలేక కారుతో పాటు బావిలో మునిగిపోయారని పోలీసులు తెలిపారు.

రోషన్ ర్యాష్ డ్రైవింగ్ కారణంగానే ఈ ఘోర ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో రోషన్‌ కూడా గాయాలైనట్టుగా చెప్పారు. అగ్నిమాపక, రెస్క్యూ సర్వీస్ సిబ్బంది బావిలోంచి కారును బయటకు తీశారు. వాహనం నుండి ఒక మృతదేహాన్ని తొలుత బయటకు తీశారు. ఇందుకోసం క్రేన్‌ను ఉపయోగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Follow Us
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చిరంజీవి భార్య సురేఖకు కీలక బాధ్యతలు అప్పగించిన తెలంగాణ సర్కార్
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
చేపలు ఇష్టంగా తింటున్నారా? అయితే ఇది తప్పక తెలుసుకోవాల్సిందే..!
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
నందిని రెడ్డి ఫోన్‌లో సమంత పేరుని ఏమని సేవ్ చేసుకుందో తెలుసా?
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
గేమర్ల కోసం సరికొత్త హైపర్‌ఎక్స్ కస్టమైజబుల్ మౌస్
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
కడుపులో ఉబ్బరం, అజీర్తి వేధిస్తున్నాయా? ఈ చిట్కాలతో చెక్ పెట్టండి
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
నీళ్లలో ఇది కలిపి స్నానం చేయండి.. నెగటివ్ ఎనర్జీ మాయం
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి ఫైర్‌‌ బోల్ట్‌.. టార్గెట్‌ ఎవరంటే
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
సినిమాల వల్ల నాకు రూపాయి లాభం లేదు..
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
కాకులు మనుషుల్ని గుర్తుపడతాయా? మతిపోయే నిజాలు చెబుతున్న సైన్స్!
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?
టాలీవుడ్‌కి గుడ్ బై చెప్పేసిన ఈ హీరోయిన్ ఎవరో గుర్తుపట్టారా.?