జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారా మిలిటరీ దళాల ఉపసంహరణ
జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారామిలిటరీ దళాలను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది ఆగస్టులో ఈ బలగాలను అక్కడ మోహరించారు. 370 అధికరణాన్నిరద్దు చేసి..

జమ్మూ కాశ్మీర్ నుంచి 10 వేల పారామిలిటరీ దళాలను తక్షణమే ఉపసంహరించాలని కేంద్రం నిర్ణయించింది. గత ఏడాది ఆగస్టులో ఈ బలగాలను అక్కడ మోహరించారు. 370 అధికరణాన్నిరద్దు చేసి, జమ్మూ కాశ్మీర్ ను రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా విభజించిన తరువాత ముందు జాగ్రత్త చర్యగా ఈ బలగాలను నియోగించారు. అయితే ఈ బలగాల స్థానే..సెంట్రల్ ఆర్మ్డ్ పోలీస్ ఫోర్స్ ను నియమించిన అనంతరం ఈ బలగాలను వెనక్కి పంపాలని హోమ్ శాఖ నిర్ణయించింది. మొత్తం 100 కంపెనీల్లో 40 సీఆర్ఫీ ఎఫ్ నుంచి, సీఐఎస్ ఎఫ్, బీ ఎస్ ఎఫ్, సహస్ర సీమా బల్ దళాల నుంచి 20 కంపెనీల చొప్పున బలగాలు ఉన్నాయి.



