OTT Movie: ఓటీటీ టాప్ ట్రెండింగ్ లో 2 గంటల 32 నిమిషాల క్రైమ్ థ్రిల్లర్.. క్లైమాక్స్ ట్విస్ట్కు మెండ్ బ్లాక్ అవ్వాల్సిందే
చాలా ఏళ్ల క్రితం థియేటర్లలో విడుదలై బ్లాక్ బస్టర్ గా నిలిచిన ఓ క్రైమ్ థ్రిల్లర్ సినిమా ఇప్పుడు OTTలో తెగ ట్రెండ్ అవుతోంది. ఈ సినిమాలోని ఆసక్తికరమైన కథా కథనాలు, ఉత్కంఠభరిత సన్నివేశాలున్న, ఊహించని ట్విస్టులు ఆడియెన్స్ కు మంచి థ్రిల్ అందిస్తున్నాయి.

ప్రతి వారం వివిధ OTT ప్లాట్ఫామ్లలో సరికొత్త కంటెంట్ విడుదల అవుతుంది. లవ్, రొమాంటిక్, ఫ్యామిలీ, క్రైమ్, సస్పెన్స్ థ్రిల్లర్, కామెడీ.. ఇలా అన్ని జానర్లకు చెందిన సినిమాలు, వెబ్ సిరీస్లు ఈ డిజిటల్ స్ట్రీమింగ్ ప్లాట్ఫామ్స్ లలో అందుబాటులోకి వస్తుంటాయి. అయితే ఇప్పుడు ప్రజెంట్ థియేటర్లు అయినా, ఓటీటీలు అయినా క్రైమ్ థ్రిల్లర్ సినిమాల ట్రెండ్ నడుస్తోంది. అలాంటి ఒక క్రైమ్ థ్రిల్లర్ సినిమా ప్రస్తుతం ఓటీటీలో బాగా ట్రెండ్ అవుతోంది. ఇదొక డార్క్ క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఆద్యంతం ఎంగేజింగ్ గా సాగే ఈ మూవీ ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ఫామ్ జియో హాట్స్టార్లో తె ట్రెండ్ అవుతోంది. ఈ సినిమా ట్రెండింగ్ జాబితాలో ఐదవ స్థానంలో ఉండడం గమనార్హ. ప్రేక్షకులు ఈ క్రైమ్ థ్రిల్లర్ను చాలా ఇష్టపడుతున్నారు. ఈ సినిమా పేరు ‘భ్రమం’. బాలీవుడ్ సినిమా ‘అంధాధున్’ కి ఇది అధికారిక మలయాళ రీమేక్. ఈ సినిమా 2018 లో విడుదలైంది, ఆయుష్మాన్ ఖురానా, టబు మరియు రాధికా ఆప్టే నటించారు. తెలుగులో నితిన్ హీరోగా మ్యాస్ట్రో పేరుతో కూడా రిలీజైంది. అయితే ‘అంధాధున్’ తో పోల్చితే భ్రమంలో కొన్ని థ్రిల్లింగ్ సీన్లు ఉన్నాయి. పు ఉన్నా లేనట్లు నటిస్తున్న ఒక పియానో వాద్యకారుడు (పృథ్వీరాజ్) అనుకోకుండా ఒక హత్యలో చిక్కుకోవడమే ఈ చిత్ర ప్రధానాంశం.
ఈ సినిమా కథ పియానిస్ట్ అయిన రే మాథ్యూస్ ( పృథ్వీరాజ్ సుకుమారన్ ) చుట్టూ తిరుగుతుంది. ప్రపంచం ముందు అతను అంధుడిలా నటిస్తాడు. దీంతో ప్రజలు అతని వైపు జాలిగా చూస్తారు. అదే సమయంలో అతనికి సంగీతంలో మంచి అవకాశాలు లభిస్తాయి. అయితే రే మాథ్యూస్ ఒక రోజు అన్నా (రాశి ఖన్నా) ని కలుస్తాడు. అన్నా అతన్ని తన తండ్రి రెస్టారెంట్లో పియానో వాయించమని పంపుతుంది. అక్కడ, అతను ఉదయ్ కుమార్ను కలుస్తాడు. అక్కడ ఉదయ్ కుమార్ను తన ఇంట్లో పియానో వాయించమని ఆహ్వానిస్తాడు. రే మాథ్యూస్ ఆ ఇంటికి వెళ్లినప్పుడు ఒక హత్యను చూస్తాడ. ఇక్కడే కథ ఊహించని మలుపు తిరుగుతుంది. మరి ఆ హత్య ఎవరు చేశారు? దీనిని చూసిన రే మాథ్యూస్ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొన్నాడన్నదే ఈ సినిమా.
భ్రమం చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్, మమతా మోహన్ దాస్, రాశి ఖన్నా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం 2021లో విడుదలైంది. తరువాత దీనిని OTT ప్లాట్ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం చేశారు. ఇప్పుడు ఇది జియో హాట్స్టార్లోనూ స్ట్రీమింగ్ అవుతోంది.
మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




