ఢిల్లీలో మళ్ళీ తెరచుకోనున్న మార్కెట్లు, హోటళ్లు
ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్లు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఎకానమీని పునరుధ్ధరించేందుకు ఆంక్షలను సడలించి వీటిని తెరిచేందుకు అనుమతించాలని..
ఢిల్లీలో హోటళ్లు, మార్కెట్లు మళ్ళీ ప్రారంభం కానున్నాయి. ఎకానమీని పునరుధ్ధరించేందుకు ఆంక్షలను సడలించి వీటిని తెరిచేందుకు అనుమతించాలని ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్ మెంట్ అథారిటీ నిర్ణయించింది. అయితే ప్రస్తుతానికి జిమ్ లను మాత్రం మూసే ఉంచుతారు. లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్ అధ్యక్షతన సమావేశమైన ఈ అథారిటీ..మొదట ట్రయల్ బేసిస్ గా వీక్లీ మార్కెట్లను ప్రారంభించాలని నిర్ణయించింది. సీఎం అరవింద్ కేజ్రీవాల్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమావేశంలో పాల్గొన్నారు. గత మార్చి నెలలో కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా నగరంలో వీటిని మూసివేసిన సంగతి తెలిసిందే.