NTA పక్షాళన.. 600 మంది నిపుణుల తొలగింపు.. CISF భద్రతలో కొత్త ఆఫీస్!
NTA: సోమవారం ప్రహ్లాద్ జోషి ఎన్టిఎ పనితీరును సమీక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పరీక్షా విధానంలోని ప్రతి దశను ఏజెన్సీ సమీక్షించాలని, ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి..

నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) పనితీరు, నిర్వహణపై కేంద్ర విద్యుత్, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. దేశవ్యాప్తంగా NTA నిర్వహించే వివిధ పోటీ పరీక్షలను అత్యంత పారదర్శకంగా, ఎటువంటి అక్రమాలకు తావులేకుండా సజావుగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని భద్రతా, మౌలిక వసతుల ఏర్పాట్లను పూర్తి చేయాలని ఈ సందర్భంగా ఆయన అధికారులను ఆదేశించారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి మంగళవారం ఎన్టీఏతో సమావేశమై, పరీక్షలు సజావుగా జరిగేందుకు అవసరమైన అన్ని భద్రతా, సంబంధిత మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యాశాఖ మంత్రి ఆదేశాల మేరకు ఎన్టీఏ తీసుకున్న చర్యలను డైరెక్టర్ జనరల్ కూడా వివరించారు. ప్రశ్నాపత్రాల రూపకల్పన, వాటి పరిశీలనను మరింత పటిష్టం చేసేందుకు ‘ఫోర్-టైర్’ (4-Tier) క్వశ్చన్ పేపర్ పరిశీలన వ్యవస్థను అమల్లోకి తీసుకొస్తున్నారు.
600 మంది నిపుణుల స్థానంలో కొత్తవారిని నియమిస్తూ, పరీక్షా బృందాన్ని పునర్వ్యవస్థీకరించినట్లు NTA పేర్కొంది. పరీక్ష పత్రాల పరిశీలనను పటిష్టం చేయడానికి నాలుగు అంచెల ప్రశ్నపత్రాల తనిఖీ వ్యవస్థను అమలు చేయనున్నారు. రాబోయే రెండు మూడు వారాల్లో 20-25 మంది అధికారులను విధుల్లోకి తీసుకోనున్నారు. భవిష్యత్ నియామకాల ప్రణాళికను కూడా సమీక్షించారు. అదనంగా, యుద్ధ ప్రాతిపదికన NTA కార్యాలయాలను కొత్త ప్రదేశానికి తరలించనున్నారు. అక్కడ CISF బృందాలతో భద్రతను పటిష్టం చేస్తారు.
ఆగస్టు 17న ఉన్నత స్థాయి సమావేశం
సోమవారం ప్రహ్లాద్ జోషి ఎన్టిఎ పనితీరును సమీక్షించేందుకు ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. అన్ని పరీక్షా ప్రక్రియలపై సమగ్ర ఆడిట్ నిర్వహించాలని ఆయన ఆదేశించారు. పరీక్షా విధానంలోని ప్రతి దశను ఏజెన్సీ సమీక్షించాలని, ఏవైనా లోపాలు ఉంటే గుర్తించి, వాటిని పరిష్కరించడానికి తీసుకున్న చర్యలపై ఒక నివేదికను సిద్ధం చేయాలని ఆయన పేర్కొన్నారు. ఈ సమావేశానికి ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి, ఎన్టిఎ డైరెక్టర్ జనరల్, ఇతర సీనియర్ అధికారులు హాజరయ్యారు.
50 మందికి పైగా ఉద్యోగులను తొలగించారు – ఎన్టిఎ
సోమవారం జరిగిన సమావేశంలో 50 మందికి పైగా ఉద్యోగులను తొలగించినట్లు ఎన్టిఎ ప్రకటించింది. ఇది 10 కొత్త వృత్తిపరమైన పోస్టుల కోసం నోటిఫికేషన్లు జారీ చేసి, ప్రస్తుతం నియామకాలు చేపడుతోంది. సైబర్ సెక్యూరిటీ, సైకోమెట్రిక్స్, ప్రశ్నపత్రాల రూపకల్పన, ఇతర ప్రత్యేక రంగాల కోసం ప్రైవేట్ రంగం నుండి డొమైన్ నిపుణులను కూడా తీసుకువస్తోంది. ప్రశ్నపత్రాలలో వ్యత్యాసాలు గుర్తించిన తర్వాత ఇంగ్లీష్, సోషియాలజీ, కామర్స్ విభాగాలకు యూజీసీ నెట్ పరీక్షను తిరిగి నిర్వహిస్తామని ఆదివారం నాడు ఏజెన్సీ ప్రకటించిన నేపథ్యంలో ఎన్టీఏ ఈ చర్య తీసుకుంది. ఇది పోటీ పరీక్షల నిర్వహణ విషయంలో ఆ పరీక్షా సంస్థపై విమర్శలను మరింత తీవ్రతరం చేసింది.
As a follow up meeting on NTA, Union Education Minister Shri @JoshiPralhad directed that all necessary security and related infrastructural facilities should be put in place for the smooth conduct of examinations.
Following directions from the Minister, DG, NTA apprised on the… pic.twitter.com/SCSnko504d
— Ministry of Education (@EduMinOfIndia) August 18, 2026
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
