Tata Motors: రక్షా కా బంధన్ – ప్రతి ప్రయాణంలో భద్రతా బంధం.. టాటా మోటర్స్ ప్రత్యేక కార్యక్రమం
Tata Motors: ఈ మహిళలే భారతదేశంలో అత్యంత సురక్షితమైన ట్రక్కులు తయారు చేసే బృందంలో భాగంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ రాఖీలు వందల కిలోమీటర్లు ప్రయాణించి నవీ ముంబైలోని కలంబోలి ట్రాన్స్పోర్ట్ నగర్కు చేరుకున్నాయి. అక్కడ దేశాన్ని అవిశ్రాంతంగా కదిలించే ట్రక్..

టాటా మోటార్స్ జంషెడ్పూర్ ప్లాంట్లో రక్షాబంధన్ కేవలం ఒక పండుగలా కాదు .. మనసుకు హత్తుకునే అనుభూతిగా జరుపుకుంటారు. ఈ సంవత్సరం దేశంలోనే అత్యంత నమ్మకమైన, సురక్షితమైన ట్రక్కులను తయారు చేసే దుర్గా లైన్ మహిళా సిబ్బంది.. తమకు ఎప్పుడూ కలవని ట్రక్ డ్రైవర్లకు, తమ తెలియని అన్నలకి స్వహస్తాలతో లేఖలు రాశారు. రక్షా కా బంధన్ అనే ప్రత్యేక చొరవ ద్వారా జంషెడ్పూర్లోని టాటా మోటార్స్లోని అన్ని మహిళా దుర్గా లైన్లోని మహిళలు రాఖీలను తయారు చేయడంలో, వారు ఎప్పుడూ కలవని ట్రక్ డ్రైవర్ల కోసం వ్యక్తిగత సందేశాలను అందించడంలో తమ హృదయాలను గెలుచుకుంటున్నారు. కానీ వారు ప్రతి రోజు ప్రత్యేక శ్రద్ద వహిస్తున్నారు. వారిని కుటుంబసభ్యుల్లా గౌరవించి ప్రతి ప్రయాణం భద్రంగా ఉండాలన్న బ్రాండ్ లక్ష్యాన్ని మరోసారి గుర్తు చేశారు.
ఈ రక్షా బంధన్, టాటా మోటార్స్ రక్షణ పండుగను ఇళ్లలో మాత్రమే కాకుండా దేశ హైవేలకూ తీసుకెళ్లింది. ‘రక్షా కా బంధన్’ ప్రత్యేక కార్యక్రమం ద్వారా జమ్షెడ్పూర్లోని ఆల్-వుమెన్ దుర్గా లైన్ మహిళలు ట్రక్ డ్రైవర్ల కోసం తమ చేతులతో రాఖీలు తయారు చేసి వ్యక్తిగత సందేశాలు అందించారు.
ఈ మహిళలే భారతదేశంలో అత్యంత సురక్షితమైన ట్రక్కులు తయారు చేసే బృందంలో భాగంగా ఈ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆ రాఖీలు వందల కిలోమీటర్లు ప్రయాణించి నవీ ముంబైలోని కలంబోలి ట్రాన్స్పోర్ట్ నగర్కు చేరుకున్నాయి. అక్కడ దేశాన్ని అవిశ్రాంతంగా కదిలించే ట్రక్ డ్రైవర్లకు ఈ రాఖీలు కట్టారు. వారు ప్రయాణించే ప్రతి రహదారిలో ఎవరో ఒకరు తమ కోసం చూస్తున్నారని ఇది గుర్తుచేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి




