Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Customs Department: దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరు ప్రయాణీకులు.. అనుమానమొచ్చి చెక్ చేయగా..!

దేశంలో ఏదోమూల అక్రమంగా తరలిస్తున్న బంగారం, డ్రగ్స్ పట్టుబడుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటన తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. ఒకేరోజు భారీగా బంగారం, డ్రగ్స్ పట్టుబడింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారం, డ్రగ్స్‌‌ను కస్టమ్స్ అధికారలు పట్టుకొని సీజ్ చేశారు. కౌలాలంపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురు మహిళ నుంచి 8.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు తెలిపారు.

Follow us
Srikar T

|

Updated on: Nov 13, 2023 | 11:44 AM

దేశంలో ఏదోమూల అక్రమంగా తరలిస్తున్న బంగారం, డ్రగ్స్ పట్టుబడుతూ ఉంటాయి. ఇలాంటి సంఘటన తాజాగా తమిళనాడులో చోటు చేసుకుంది. ఒకేరోజు భారీగా బంగారం, డ్రగ్స్ పట్టుబడింది. చెన్నై ఎయిర్‌పోర్ట్‌లో అక్రమంగా తరలిస్తున్న భారీగా బంగారం, డ్రగ్స్‌‌ను కస్టమ్స్ అధికారలు పట్టుకొని సీజ్ చేశారు. కౌలాలంపూర్‌ నుంచి వచ్చిన ముగ్గురు మహిళ నుంచి 8.5 కిలోల బంగారాన్ని పట్టుకున్నట్లు తెలిపారు. పట్టుబడ్డ బంగారం విలువ రూ.4.5 కోట్లుగా పేర్కొన్నారు. ఇదే క్రమంలో మరో ఇద్దరి నుంచి కూడా బంగారాన్ని పట్టుకొని సీజ్ చేశారు.

తిరుచ్చి విమానాశ్రయంలో కూడా పెద్ద ఎత్తున బంగారం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ఇద్దరి ప్రయాణికుల దగ్గర బంగారం ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడ్డ బంగారం ఒక కేజీ 800 గ్రాములు ఉన్నట్లు తెలిపారు. దీని విలువ బంగారం విలువ కోటి పదహారు లక్షలు ఉంటుందని అంచనా వేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకోని విచారిస్తున్నారు కస్టమ్స్ అధికారులు. ఇదిలా ఉంటే మరో చోట పెద్ద మొత్తంలో డ్రగ్స్ కూడా పట్టుబడింది. బ్యాంకాక్‌ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి..రూ.5.5 కోట్ల విలువైన 5.5 కిలోల హెరాయిన్‌ స్వాధీనం చేసుకున్నారు ఎయిర్ పోర్ట్ కస్టమ్స్ అధికారులు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..