దిశ కేసులో స్వతంత్ర విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశం

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై స్వతంత్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ‘ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్‌పూర్‌కర్ ఆధ్వర్యాన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరపాలని సూచించింది. ఈ పానెల్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 6 నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే, తదుపరి ఉత్తర్వులు జారీ […]

దిశ కేసులో స్వతంత్ర విచారణ.. సుప్రీంకోర్టు ఆదేశం
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Dec 12, 2019 | 2:37 PM

దిశ కేసులో నలుగురు నిందితులను పోలీసులు ఎన్ కౌంటర్ చేసిన ఘటనపై స్వతంత్ర విచారణ జరగాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. సుప్రీం ‘ మాజీ న్యాయమూర్తి జస్టిస్ సిర్‌పూర్‌కర్ ఆధ్వర్యాన ముగ్గురు సభ్యుల కమిటీ విచారణ జరపాలని సూచించింది. ఈ పానెల్ లో బాంబే హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ రేఖ, సీబీఐ మాజీ డైరెక్టర్ కార్తికేయన్ సభ్యులుగా ఉంటారు. ఈ కమిటీ 6 నెలల్లో నివేదిక సమర్పించాలని కూడా కోర్టు ఆదేశించింది. అయితే, తదుపరి ఉత్తర్వులు జారీ చేసేంతవరకు మరే ఇతర అథారిటీ కానీ, కోర్టు గానీ దీనిపై విచారణ జరపరాదని కోర్టు స్పష్టం చేసింది. అంటే..ఎనిమిది మంది సభ్యులతో తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ‘ సిట్ ‘ గానీ, జాతీయ మానవ హక్కుల సంఘం గానీ జరిపే విచారణను పక్కన పెట్టినట్టే..

ఎన్ కౌంటర్ ఘటనపై నిష్పాక్షిక విచారణ జరగాలని తాము భావిస్తున్నామని చీఫ్ జస్టిస్ బాబ్డే, జస్టిస్ ఎస్.ఎ.నజీర్, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన బెంచ్ పేర్కొంది. పోలీసులు దోషులని తాము అనడంలేదని, అయితే విచారణ జరగాలని కోరుతున్నామని జస్టిస్ బాబ్డే అన్నారు. తెలంగాణ ప్రభుత్వం చేస్తున్న వాదన పైనా విచారణ జరగాల్సిన అవసరం ఉందన్నారు. ‘ ఎన్ కౌంటర్ చేసిన పోలీసులను క్రిమినల్ కోర్టులో ప్రాసిక్యూట్ చేయబోతున్నామని మీరు అంటే.. దానితో తమకు సంబంధం లేదని పిటిషనర్ తరఫు న్యాయవాదిని ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. అయితే అమాయకులు నిజాన్ని తెలుసుకోగోరుతున్నారని మీరు వాదించిన పక్షంలో.. వాస్తవాల జోలికి మాత్రం తాము వెళ్లడం లేదని ఆయన పేర్కొన్నారు. పోలీసుల తరఫున వాదించిన అడ్వొకేట్ ముకుల్ రోహ్తగి.. గతంలో కోర్టు రిటైర్డ్ జడ్జిని నియమించిందని, అయితే అది ఇన్వెస్టిగేషన్ పర్యవేక్షణకు ఉద్దేశించిందని అన్నారు. ఒక న్యాయమూర్తి ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు.  ఎన్ కౌంటర్ ను సవాలు చేస్తూ అడ్వొకేట్లు జీ. ఎస్. మణి, ప్రదీప్ కుమార్ యాదవ్, ముఖేష్ కుమార్ శర్మ దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు విచారించింది .తెలంగాణ ప్రభుత్వం ఇప్పటికే ‘ సిట్ ‘ ఏర్పాటు చేసినందున ఇక రిటైర్డ్ జడ్జితో విచారణ అవసరం లేదన్న ముకుల్ రోహ్తగి అభ్యంతరాన్ని కోర్టు తోసిపుచ్చింది.

పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
పెట్టుబడిదారులకు సాయం చేసే నయా సిస్టమ్‌.. వారికి ఇక పండగే..!
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
రాజమౌళికి ఎన్ని కోట్ల ఆస్తి ఉందో తెలుసా..? తెలిస్తే అవాక్ అవుతారు
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
బాబోయ్ ఎండలు.. వచ్చే రెండు నెలలు అగ్ని గుండమే.. జర జాగ్రత్త!
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
పిల్లలకు చదివింది బాగా గుర్తుండాలా.. బ్లూబెర్రీలు తినిపించండి..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
మీన రాశిలో రాహువుతో శుక్రుడి యుతి.. వారికి పట్టిందల్లా బంగారమే..
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
ఆ విషయంలో ఇంకా వెనకబడే ఉన్న తెలంగాణ యువత
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
12జీబీ ర్యామ్‌లో కొత్త స్మార్ట్‌ఫోన్ లాంచ్! అద్భుతమైన ఫీచర్స్‌
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
30 మంది ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు.. బాంబు పేల్చిన కోమటిరెడ్డి
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
హార్దిక్‌, రోహిత్ కాదు..ముంబై కెప్టెన్‌గా తెరపైకి మరొక కొత్త పేరు
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
ఐటీ సంస్థలను ఆకర్షించేందుకు కేరళ కొత్త ప్లాన్..!
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీకేర్‌ఫుల్.! మాడు పగిలే ఎండలు.. మరో మూడు రోజులు జాగ్రత్త
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
బీఆర్ఎస్ పనైపోయింది.. ఆ పార్టీ గురించి మాట్లాడటం వృథా: ఉత్తమ్
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
'పార్టీలో చెత్త అంతా పోయింది.. గట్టివాళ్లే మిగిలారు': పోచారం
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రాష్ట్ర స్థితి, ప్రజల పరిస్థితులపై కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు..
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
రైలు ఎక్కుతున్న వ్యక్తిని ఆపేశారు.. తీరా బ్యాగ్‌లోనివి చెక్ చేయగా
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
కోడుమూరు అక్కచెల్లెమ్మలు, వృద్దులతో సీఎం జగన్ మాటామంతి..
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
రొయ్యల కంటైనర్‌లో రహస్య పార్శిళ్లు.. తీరా ఏంటని తెరిచి చూడగా.!
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చిన్నారికి రైలు పేరు పెట్టిన పేరెంట్స్‌.. ఎందుకో తెలుసా ??
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
చెవి నొప్పిని లైట్‌ తీసుకోకండి.. అది తీవ్రమైన వ్యాధి లక్షణం
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు
డెబిట్‌ కార్డు ఛార్జీల పెంపు.. ఏప్రిల్‌ 1 నుంచి అమలు