AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Sikkim flood: సిక్కింలో క్లౌడ్‌ బర్‌స్ట్‌ బీభత్సం.. కూలిన 14 వంతెనలు.. చిక్కుకుపోయిన 3000 మందికి పైగా పర్యాటకులు

ఎగువన వర్షాలు కొనసాగడం, ప్రవాహ ఉధృతి అంతకంతకూ పెరగడంతో సిక్కింలో పలు చోట్ల డ్యామ్‌ దెబ్బతింది. డ్యామ్‌ భాగాలు కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. మంగళవారం అర్ధరాత్రి డ్యామ్‌ గేట్లను ఎత్తివేయడంతో.. సింగ్టమ్‌లోని బర్దంగ్‌ దగ్గర ఉన్న ఆర్మీ శిబిరాలను వరద ముంచెత్తింది. వరదలో అదృశ్యమైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది.

Sikkim flood: సిక్కింలో క్లౌడ్‌ బర్‌స్ట్‌ బీభత్సం.. కూలిన 14 వంతెనలు.. చిక్కుకుపోయిన 3000 మందికి పైగా పర్యాటకులు
Sikkim Flash Floods
Surya Kala
|

Updated on: Oct 05, 2023 | 8:47 AM

Share

సిక్కింలో క్లౌడ్‌ బర్‌స్ట్‌ బీభత్సం సృష్టించింది. సిక్కింలో కుండపోతగా వాన కురవడంతో లొహాంక్‌ సరస్సు నీటిమట్టం ఒక్కసారిగా పెరిగింది. ఆ ప్రవాహం తీస్తానదిలోకి చేరి చుంగ్‌థాంగ్‌ డ్యామ్‌కు వరద పోటెత్తింది. ఇప్పటివరకు 14 మంది మరణించారు. 23 మంది సైనికులు సహా 102 మంది గల్లంతయ్యారు. 26 మంది గాయపడినట్లు సమాచారం. అయితే, తప్పిపోయిన 23 మందిలో ఒక సైనికుడిని రక్షించారు.  778 మీటర్ల మేర నీటిమట్టం నమోదవ్వడంతో పాటు 50 లక్షల క్యూబిక్‌ మీటర్ల మేర వరదనీరు రావడంతో అధికారులు డ్యామ్‌ గేట్లను ఎత్తివేశారు. వరదల కారణంగా అనేక వంతెనలు కొట్టుకుపోయాయి. రాష్ట్రంలో వేలాది మంది పర్యాటకులు చిక్కుకుపోయినట్లు సమాచారం.

ఎగువన వర్షాలు కొనసాగడం, ప్రవాహ ఉధృతి అంతకంతకూ పెరగడంతో సిక్కింలో పలు చోట్ల డ్యామ్‌ దెబ్బతింది. డ్యామ్‌ భాగాలు కొన్ని నీటిలో కొట్టుకుపోయాయి. మంగళవారం అర్ధరాత్రి డ్యామ్‌ గేట్లను ఎత్తివేయడంతో.. సింగ్టమ్‌లోని బర్దంగ్‌ దగ్గర ఉన్న ఆర్మీ శిబిరాలను వరద ముంచెత్తింది. వరదలో అదృశ్యమైన వారి కోసం సెర్చ్ ఆపరేషన్ ఇంకా కొనసాగుతుంది. ఎన్డీఆర్‌ఎఫ్ బృందాన్ని రంగంలోకి దిగి సహాయ సహకారాలను అందిస్తోంది. వరదల కారణంగా 10వ నంబర్ జాతీయ రహదారి కూడా కొట్టుకుపోయింది. తీస్తా నది నీటిమట్టం 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది.

సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్‌తో ప్రధాని నరేంద్ర మోడీ మాట్లాడారు. సీఎం నుంచి పరిస్థితిపై ప్రధాని సమాచారం తీసుకున్నారు. రాష్ట్రానికి అన్ని విధాలా సాయం చేస్తామని హామీ ఇచ్చారు. ఈరోజు కూడా సిక్కింలో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ ప్రకటించింది. వాతావరణ శాఖ అంచనా ప్రకారం రానున్న 48 గంటల్లో సిక్కింలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి
  1. ఇప్పటి వరకు సిక్కిం లో ఉన్న పరిస్థితి.. తాజా అప్‌డేట్‌లను తెలుసుకోండి…
  2. లొనాక్ సరస్సుపై అకస్మాత్తుగా మేఘాలు కమ్ముకోవడంతో లాచెన్ లోయలోని తీస్తా నదిలో ఒక్కసారిగా వరద వచ్చింది.
  3. సిక్కింలోని వివిధ ప్రాంతాల్లో 3000 మందికి పైగా పర్యాటకులు చిక్కుకుపోయారు.
  4. వరదల కారణంగా 14 వంతెనలు కూలిపోయాయి. వీటిలో 9 బ్రిడ్జిలు బిఆర్‌ఓ పరిధిలో ఉండగా, 5 రాష్ట్ర ప్రభుత్వానికి చెందినవి.
  5. ఇప్పటి వరకు 166 మందిని రక్షించారు. వీరిలో ఆర్మీ జవాను కూడా ఉన్నారు.
  6. సింగ్‌టామ్‌లోని గోలిటార్ వద్ద తీస్తా నది వరద ప్రాంతం నుండి రెస్క్యూ సిబ్బంది అనేక మృతదేహాలను వెలికితీశారు.
  7. ప్రధాని మోడీ సిక్కిం ముఖ్యమంత్రి ప్రేమ్‌సింగ్ తమాంగ్‌తో మాట్లాడి రాష్ట్రంలో అకస్మాత్తుగా వరదల కారణంగా తలెత్తిన పరిస్థితిని సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వానికి అన్ని విధాలా సాయం చేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
  8. చుంగ్తాంగ్ డ్యామ్ నుంచి నీటిని విడుదల చేయడంతో సరస్సులో నీటిమట్టం ఒక్కసారిగా 15 నుంచి 20 అడుగుల మేర పెరిగింది.
  9. బుధవారం ఉదయం తీస్తా నదిలో సింగటంలోని వంతెన పూర్తిగా కొట్టుకుపోయింది.
  10. బుధవారం మధ్యాహ్నం 1 గంట సమయంలో తీస్తా నది నీటిమట్టం ప్రమాద స్థాయి కంటే తక్కువగా ఉంది. సిక్కిం ప్రభుత్వం దీనిని విపత్తుగా ప్రకటించింది.
  11. సిక్కిం, ఉత్తర బెంగాల్‌లో మోహరించిన ఇతర భారతీయ ఆర్మీ సైనికులందరూ సురక్షితంగా ఉన్నారు.
  12. వరదల వల్ల జరిగిన నష్టాన్ని అంచనా వేయడానికి ముఖ్యమంత్రి తమాంగ్ సింగ్‌టామ్‌ను సందర్శించారు.
  13. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా, రోడ్డు కింద రాళ్లు, మట్టి జారిపోవడంతో నేషనల్‌ హైవే 10 లో కొంత భాగం దెబ్బతింది.
  14. గత కొద్ది రోజులుగా రాష్ట్రంలో కురుస్తున్న కుండపోత వర్షాలతో పాటు, తీస్తా నదిలో నీటిమట్టం పెరగడం వల్ల కాలింపాంగ్, డార్జిలింగ్, అలీపుర్‌దువార్ , జల్‌పైగురి జిల్లాల్లోని అనేక ప్రాంతాలు ప్రభావితమయ్యాయి.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..