Breaking: మే 12 నుంచి రైలు సర్వీసులు ప్రారంభం.. రేపటి నుంచే బుకింగ్..!
మే 12 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటికి సంబంధించి మే 11 సాయంత్రం 4 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది.
మే 12 నుంచి రైలు సర్వీసులు ప్రారంభించబోతున్నట్లు రైల్వే శాఖ తెలిపింది. వీటికి సంబంధించి మే 11 సాయంత్రం 4 గంటల నుంచి అడ్వాన్స్ బుకింగ్స్ చేసుకోవాలని సూచించింది. IRCTC ద్వారా టికెట్ల విక్రయాలు జరుగుతాయని.. 15 సర్వీసులను ప్రత్యేక రైళ్లుగా నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే శాఖ వెల్లడించింది. అందులో ఢిల్లీ నుంచి డిబ్రుగఢ్, అగర్తల, హౌరా, పాట్నా, బిలాస్పూర్, రాంచీ, భువనేశ్వర్, సికింద్రాబాద్, బెంగళూరు, చెన్నై, త్రివేండ్రం, మద్గాం, ముంబై సెంట్రల్, అహ్మదాబాద్, జమ్ముతావి వంటి ముఖ్య నగరాలు ఉన్నాయని తెలిపారు. రైల్వే టికెట్ బుకింగ్లన్నీ ఆన్లైన్ ద్వారానే విక్రయించనున్నట్లు రైల్వే శాఖ వివరించింది. అంతేకాదు కన్ఫర్మ్ టికెట్ కలిగి ఉన్న ప్రయాణికులను మాత్రమే రైల్వేస్టేషన్లోకి అనుమతిస్తామని.. ప్రయాణికులకు మాస్క్ తప్పనిసరని రైల్వే శాఖ పేర్కొంది. రైలు బయలుదేరే ముందు స్క్రీనింగ్ చేస్తామని, లక్షణాలు లేని ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తామని రైల్వే శాఖ తెలిపింది.
Read This Story Also: అదృష్టవశాత్తు ఆ ప్రమాదంలో ఎవ్వరికీ ఏం కాలేదు..!