AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లెక్కలు బయటికొస్తున్నాయ్… పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు రూ. 8 లక్షల కరెంట్ బిల్లు చెల్లించాలట !

పంజాబ్ సీఎం అమరందర్ సింగ్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు కరెంట్ బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలట..

లెక్కలు బయటికొస్తున్నాయ్... పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు రూ. 8 లక్షల కరెంట్ బిల్లు చెల్లించాలట !
Navjot Singh Sidhu
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 03, 2021 | 9:10 AM

Share

పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు కరెంట్ బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలట.. రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సిద్దు . లాబీయింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో..ఇప్పటివరకూ లేనిది తాజాగా ఆయన కరెంట్ బిల్లు చెల్లింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిద్దు తమ విద్యుత్ సంస్థకు రూ. 8 లక్షలకు పైగా బకాయిలు చెల్లించవలసి ఉందంటూ పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ తన వెబ్ సైట్ లో తెలిపింది. ఆయన రూ. 8,67,540 పే చేయాల్సి ఉందని వెల్లడించింది. ఈ చెల్లింపు గడువు నిన్నటితో ముగిసిపోయింది. గత ఏడాది నుంచి సిద్దు 17 లక్షలకు పైగా కరెంట్ బిల్లు చెల్లించవలసి ఉండగా మార్చి నెలలో 10 లక్షలు చెల్లించారు. ఆ తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా కట్టలేదని తెలిసింది. కాగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సీఎం అమరేందర్ సింగే బాధ్యుడని సిద్దు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు.

విద్యుత్ శాఖను కూడా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారని ఆయన అంటున్నారు. పవర్ కట్స్ కి పూర్తిగా ఈ ముఖ్యమంత్రిదే బాధ్యత అని ఆరోపిస్తున్నారు. కాగా 8 లక్షల బకాయిల విషయమై ఆయనను సంప్రదించడానికి యత్నించగా.. అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. 2019 లో సిద్దు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ లో తన స్థాయిని తగ్గించినందుకు ఈ మాజీ క్రికెటర్ అలిగి ఈ చర్య తీసుకున్నారు. అప్పటి నుంచి సీఎం అమరేందర్ సింగ్ కి, ఈయనకు మధ్య విభేదాలు పెరిగాయి. పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభం ప్రధాన అంశంగా మారింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి కుమారుడికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

Viral News: బాబోయ్‌ పిల్లలు కాదు పిడుగులు.. స్కూల్‌ ఇలా కూడా డుమ్మా కొట్టచ్చా.!

Follow Us
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
ఉడికించిన గుడ్డును ఇలా తింటే.. మీ శరీరంలో జరిగే మ్యాజిక్ ఇదే..
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
20 ఏళ్ల పోరాటం.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్!
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
అభిషేక్ కు ఇచ్చిపడేసిన టీ20 వరల్డ్ కప్ హీరో.. నెంబర్ 1 స్థానంతో..
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
బడికి వెళ్లే పిల్లలకు బెస్ట్.. లంచ్ బాక్స్‌లోకి రైస్ ఇలా పెట్టండి
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
వైభవ్ సూర్యవంశీ గురించి ఇంగ్లాండ్ కెప్టెన్ సంచలన స్టేట్మెంట్..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
పీఎఫ్ ఖాతాదారులకు బిగ్ అప్డేట్.. వెబ్ సైట్ తెరుచుకునేది అప్పుడే..
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
గుడ్‌న్యూస్..దేశంలో మరో 2 కొత్త హైవేల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
వైభవ్ కాదయ్యా.. టీమిండియాలో అతడంటేనే ఇంగ్లాండోళ్లకు భయం
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
నిద్రలో కలవరం, భయమా.. చెడు కలలకు కారణం తెలుసా?
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్
NEET UG 2026 అభ్యర్థులకు కీలకఅప్డేట్.. జూలై 7 వరకు మాత్రమే ఛాన్స్