AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లెక్కలు బయటికొస్తున్నాయ్… పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు రూ. 8 లక్షల కరెంట్ బిల్లు చెల్లించాలట !

పంజాబ్ సీఎం అమరందర్ సింగ్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు కరెంట్ బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలట..

లెక్కలు బయటికొస్తున్నాయ్... పంజాబ్ కాంగ్రెస్ నేత నవజ్యోత్ సింగ్ సిద్దు రూ. 8 లక్షల కరెంట్ బిల్లు చెల్లించాలట !
Navjot Singh Sidhu
Umakanth Rao
| Edited By: |

Updated on: Jul 03, 2021 | 9:10 AM

Share

పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ నాయకత్వంపై తిరుగుబాటు బావుటా ఎగురవేసిన రాష్ట్ర మాజీ మంత్రి నవజ్యోత్ సింగ్ సిద్దు కరెంట్ బిల్లు రూ. 8 లక్షల బకాయిలు చెల్లించాలట.. రాష్ట్ర నాయకత్వానికి వ్యతిరేకంగా ఢిల్లీలో సిద్దు . లాబీయింగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఇటీవల పార్టీ అగ్ర నేతలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలను కూడా కలుసుకున్నారు. ఈ నేపథ్యంలో..ఇప్పటివరకూ లేనిది తాజాగా ఆయన కరెంట్ బిల్లు చెల్లింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. సిద్దు తమ విద్యుత్ సంస్థకు రూ. 8 లక్షలకు పైగా బకాయిలు చెల్లించవలసి ఉందంటూ పంజాబ్ స్టేట్ పవర్ కార్పొరేషన్ తన వెబ్ సైట్ లో తెలిపింది. ఆయన రూ. 8,67,540 పే చేయాల్సి ఉందని వెల్లడించింది. ఈ చెల్లింపు గడువు నిన్నటితో ముగిసిపోయింది. గత ఏడాది నుంచి సిద్దు 17 లక్షలకు పైగా కరెంట్ బిల్లు చెల్లించవలసి ఉండగా మార్చి నెలలో 10 లక్షలు చెల్లించారు. ఆ తరువాత నుంచి ఒక్క రూపాయి కూడా కట్టలేదని తెలిసింది. కాగా రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభానికి సీఎం అమరేందర్ సింగే బాధ్యుడని సిద్దు ఆరోపిస్తున్నారు. ముఖ్యమంత్రి సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ పరిస్థితి తలెత్తేది కాదని అంటున్నారు.

విద్యుత్ శాఖను కూడా ముఖ్యమంత్రే పర్యవేక్షిస్తున్నారని ఆయన అంటున్నారు. పవర్ కట్స్ కి పూర్తిగా ఈ ముఖ్యమంత్రిదే బాధ్యత అని ఆరోపిస్తున్నారు. కాగా 8 లక్షల బకాయిల విషయమై ఆయనను సంప్రదించడానికి యత్నించగా.. అందుబాటులో లేరని సమాధానం వచ్చింది. 2019 లో సిద్దు తన మంత్రి పదవికి రాజీనామా చేశారు. కేబినెట్ లో తన స్థాయిని తగ్గించినందుకు ఈ మాజీ క్రికెటర్ అలిగి ఈ చర్య తీసుకున్నారు. అప్పటి నుంచి సీఎం అమరేందర్ సింగ్ కి, ఈయనకు మధ్య విభేదాలు పెరిగాయి. పంజాబ్ అసెంబ్లీకి వచ్చే ఏడాది ఎన్నికలు జరగనున్న తరుణంలో రాష్ట్రంలోని విద్యుత్ సంక్షోభం ప్రధాన అంశంగా మారింది.

మరిన్ని ఇక్కడ చూడండి: Accident: రోడ్డు ప్రమాదంలో ప్రముఖ నటుడి కుమారుడికి గాయాలు.. ఆసుపత్రిలో చికిత్స

Viral News: బాబోయ్‌ పిల్లలు కాదు పిడుగులు.. స్కూల్‌ ఇలా కూడా డుమ్మా కొట్టచ్చా.!

Follow Us
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
అమెరికా పర్యటనలో ఆర్‌ఎస్‌ఎస్ చీఫ్ మోహన్ భగవత్ కీలక వ్యాఖ్యలు..
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
రోజుకో రంగు మారే వింత పువ్వు.. నిన్న, నేడు, రేపు మొక్కను ఇంట్లోనే
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
నా బిడ్డకు తండ్రి అతనే.. 21 ఏళ్ల తర్వాత కుమారుడితో కలిసి ధర్నా..
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
మాడిన పాత్రలపై మసి పోవాలంటే.. ఈ కూరగాయలతో తలా తలా మెరిసిపోతాయ్
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
విడాకుల విషయంలో తప్పంతా నాదే.. ఆమె నన్ను భరించలేకపోయింది..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
వాహనదారులకు బిగ్ అలర్ట్.. నంబర్ ప్లేట్ తేడా ఉంటే క్రిమినల్ కేసే..
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయారా?ఆఫీస్ గందరగోళాన్ని జయించడానికి సూత్రాలు
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
సచిన్‌ vs కపిల్‌.. ‘ఆల్‌టైమ్‌ గ్రేట్‌’ ప్లేయర్ ఎవరు..?
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
భారత్-ఉజ్బెకిస్తాన్ వ్యూహాత్మక బంధం..!
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?
అరటిపండు తిన్నాక నీళ్లు తాగితే మీ పొట్టలో ఏం జరుగుతుందో తెలుసా..?