హైవే దొంగల ముఠా.. వీరి టార్గెట్ వేరే..
జాతీయ రహదారులపై దొంగల ముఠా గురించి వింటుంటాం. వాహనాల్లో వెళ్లే వారిని ఆపుతూ.. వారిని నిలువునా దోచుకోవడం వంటి వార్తల్ని వింటుంటాం. అయితే పూణెలో పట్టుబట్ట ఓ హైవే దొంగల రూటే సెపరేటు. వీరు హైవేలపై మాటువేసి.. ఏకంగా గూడ్స్ లారీలనే దోచేస్తున్నారు.
జాతీయ రహదారులపై దొంగల ముఠా గురించి వింటుంటాం. వాహనాల్లో వెళ్లే వారిని ఆపుతూ.. వారిని నిలువునా దోచుకోవడం వంటి వార్తల్ని వింటుంటాం. అయితే పూణెలో పట్టుబట్ట ఓ హైవే దొంగల రూటే సెపరేటు. వీరు హైవేలపై మాటువేసి.. ఏకంగా గూడ్స్ లారీలనే దోచేస్తున్నారు. అందులో ఉన్న వస్తువులనే కాదు.. ఏకంగా ఆ లారీలను కూడా దొంగిలించడం వీరి స్పెషాలిటీ. అయితే ఈ ముఠాకు మహారాష్ట్ర పోలీసులు గురువారం నాడు చెక్ పెట్టారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. గత కొద్ది రోజులుగా.. పూణె జాతీయ రహదారిపై.. గూడ్స్ లారీలు దోపిడీకి గురవుతున్నాయన్న ఫిర్యాదులు రావడంతో.. పోలీసులు పక్కా ప్లాన్ వేసి వారిని పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. ఈ క్రమంలో ఏడుగురు సభ్యుల ముఠాను పూణె క్రైం బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి వద్ద నుంచి రెండు లారీలను కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ముఠా సభ్యులు హైవేపై వెళ్తున్న గూడ్స్ లారీలను బైకులతో వచ్చి అడ్డగించి.. ఆ తర్వాత అందులో ఉన్న డ్రైవర్లపై దాడికి పాల్పడుతూ.. అందులో ఉన్న సరుకులను దోచుకోవడం చేస్తుంటారని పోలీసులు తెలిపారు. గురువారం రాత్రి కూడా సిగరెట్లతో వెళ్తున్న ఓ లారీని అడ్డుకుని.. దారి మళ్లిస్తున్న సమయంలో పోలీసులు ఈ ముఠాను పట్టుకున్నారు.