AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఉగ్రవాదం పెరగడానికి కారణం ఇదే.. SCO సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం

షాంఘై సహకార సంస్థ(SCO) 20 వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. SCOలో కొత్తగా ఇరాన్ చేరడాన్ని స్వాగతించారు. చర్చా భాగస్వాములుగా చేరిన

PM Modi: ఉగ్రవాదం పెరగడానికి కారణం ఇదే.. SCO సదస్సులో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం
PM Narendra Modi
Sanjay Kasula
| Edited By: |

Updated on: Sep 17, 2021 | 3:55 PM

Share

షాంఘై సహకార సంస్థ(SCO) 20 వార్షికోత్సవంలో ప్రధాని నరేంద్ర మోడీ కీలక ప్రసంగం చేశారు. SCOలో కొత్తగా ఇరాన్ చేరడాన్ని స్వాగతించారు. చర్చా భాగస్వాములుగా చేరిన సౌదీ అరేబియా, ఈజిప్ట్, కతర్​కు కూడా స్వాగతం పలికారు. రోజు రోజుకు ప్రపంచ వ్యాప్తంగా పెరిగిపోతున్న తీవ్ర‌వాదం ప్ర‌పంచ శాంతికి అతిపెద్దగా మారుతోందని ప్ర‌ధాని మోడీ అన్నారు. షాంఘై కోఆప‌రేష‌న్ ఆర్గ‌నైజేష‌న్ స‌ద‌స్సులో వ‌ర్చువ‌ల్ రీతిలో పాల్గొన్న ఆయ‌న స‌భ్య దేశాల‌ను ఉద్దేశించి కీలక ప్రసంగం చేశారు. ఇటీవ‌ల ఆఫ్ఘ‌నిస్తాన్‌ను ఆక్ర‌మించిన తాలిబ‌న్ల అంశాన్ని ప‌రోక్షంగా ప్ర‌స్తావిస్తూ.. తీవ్ర‌వాదుల ఆగ‌డాల వ‌ల్ల ప్ర‌పంచ శాంతి దెబ్బ‌తింటోంద‌న్నని అన్నారు. ప్రాంతీయ స్థిర‌త్వంపై ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. గ్రూపులోని స‌భ్యులంతా కనెక్టివిటీ, న‌మ్మ‌కం లాంటి అంశాల‌పై ప‌ర‌స్ప‌రం ప‌నిచేయాల‌న్నారు. ఆఫ్ఘ‌నిస్తాన్‌లో ఏం జ‌రుగుతుందో అంద‌రికీ తెలుసు అని.. అక్క‌డ రాడిక‌లైజేష‌న్‌, తీవ్ర‌వాదం పెర‌గ‌కుండా చూడాల్సిన బాధ్య‌త‌ను SCO స‌భ్య దేశాలపై ఉందన్నారు.

సెంట్ర‌ల్ ఏషియా చ‌రిత్ర‌ను ప‌రిశీలిస్తే, అక్క‌డ ప్ర‌గ‌తిశీల సంస్కృతులు, విలువలు స‌మ్మిళితం అయ్యాయ‌న్నారు. కొన్ని శ‌తాబ్ధాల పాటు సూఫిజం ఇక్క‌డ వ‌ర్ధిల్లింద‌న్నారు. ఆసియా ప్రాంత‌మంతా అది వ్యాపించింద‌ని, ఇక్క‌డ ప్రాంతీయ సంస్కృతుల్లో ఆ ప‌ద్ధ‌తుల‌ను చూడ‌వ‌చ్చు అని ప్ర‌ధాని మోదీ తెలిపారు.

సెంట్ర‌ల్ ఏషియాలో ఉన్న చారిత్ర‌క వార‌స‌త్వాన్ని ప‌రిశీలిస్తే, ఎస్సీవో స‌భ్యదేశాలు తీవ్ర‌వాదంపై క‌లిసి పోరోడాల్సి వ‌స్తోంద‌న్నారు. ఇండియాతో పాటు అన్ని ఎస్సీవో స‌భ్య‌దేశాల్లో ఇస్లామ్‌తో అనుబంధం క‌లిగి ఉన్న ఎన్నో ఇన్స్‌టిట్యూష‌న్లు ఉన్న‌ట్లు ప్రధాని మోడీ తెలిపారు. షాంఘై స‌హ‌కార సంస్థ 2001లో ఏర్పాటైంది. క‌జ‌కిస్తాన్‌, చైనా, కిర్గిస్తాన్‌, ర‌ష్యా, త‌జికిస్తాన్‌, ఉజ్బెకిస్తాన్‌, ఇండియా, పాకిస్థాన్‌, ఇరాన్ స‌భ్య దేశాలుగా ఉన్నాయి. పొరుగు సంబంధాల‌ను, ప‌ర‌స్ప‌ర విశ్వాసాన్ని పెంచుకోవాల‌న్న ల‌క్ష్యంతో ఎస్సీవోను ప్రారంభించారు.

ఇవి కూడా చదవండి: Cooking Oil: మీరు వాడే వంట నూనె మంచిదేనా.. మీ అనారోగ్యం వెనుక ఫేక్ ఆయిల్ ఉందంటే నమ్ముతారా.. అవును.. ఇది నిజం

Follow Us
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
శని త్రయోదశి-మాసశివరాత్రి అరుదైన యోగం.. ఈ ఒక్క పూజ చేస్తే శని దోష
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
జూన్ 12 రాశిఫలాలు: ఆ రాశుల వారికి ఆర్థిక లాభాలు.. 12 రాశుల వారికి
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
ఇరాన్‌పై బాంబు దాడులు నిలిపివేత.. ట్రంప్ నిర్ణయం వెనుక అసలు కారణం
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
జన్మ నక్షత్రం వల్లే పిల్లలు టాపర్లవుతారా? అసలు నిజం తెలుసుకోండి!
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
వజ్రం మీకు అదృష్టమా? దురదృష్టమా? ఏ రాశుల వారికి శుభం, ఎవరు దూరంగా
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ప్రధాని మోదీతో సీఎం రేవంత్ రెడ్డి కీలక భేటీ
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఐఆర్‌సీటీసీ కొత్త వెబ్‌సైట్ ప్రారంభం.. ముహూర్తం ఫిక్స్
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
ఎరుపెక్కిన మిడిలీస్ట్.. సామాన్యుడిపై మళ్లీ యుద్ధ పంజా!
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
రేపే శుక్ర ప్రదోష వ్రతం.. ఈ 6 పొరపాట్లు చేస్తే శివుని అనుగ్రహం..
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి
పట్టీలు,గొలుసులు నల్లగా మారాయా? ఇలా క్షణాల్లో కత్తగా మార్చండి