AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Vaccination: వ్యాక్సినేషన్ బాగా జరుగుతోంది..టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలి.. అధికారులతో ప్రధాని మోడీ

Vaccination: దేశంలో కరోనా యొక్క డెల్టాప్లస్ వేరియంట్ ముప్పు పెరుగుతున్న నేపధ్యంలో..టీకాల స్థితి, దేశ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు.

Vaccination: వ్యాక్సినేషన్ బాగా జరుగుతోంది..టీకా కార్యక్రమాన్ని మరింత వేగవంతం చేయాలి.. అధికారులతో ప్రధాని మోడీ
KVD Varma
|

Updated on: Jun 26, 2021 | 9:39 PM

Share

Vaccination: దేశంలో కరోనా యొక్క డెల్టాప్లస్ వేరియంట్ ముప్పు పెరుగుతున్న నేపధ్యంలో..టీకాల స్థితి, దేశ పరిస్థితులపై ప్రధాని నరేంద్ర మోడీ శనివారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించారు. వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా జరిగిన సమావేశంలో పీఎంఓ అధికారులు, ఆరోగ్య కార్యదర్శి, నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వికె పాల్ పాల్గొన్నారు. వయస్సు ప్రకారం టీకా కవరేజ్ గురించి అధికారులు ప్రధానమంత్రికి చెప్పారు. వివిధ రాష్ట్రాల్లోని ఆరోగ్య కార్యకర్తలు, ఫ్రంట్‌లైన్ కార్మికులు, సామాన్య ప్రజలకు టీకాలు వేయడం గురించి ప్రధానికి అధికారులు వివరించారు. ఈ వారం టీకాలు వేస్తున్న వేగంతో ప్రధాని సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ వేగాన్ని మరింత పెంచడం అవసరమని ఆయన అధికారులకు చెప్పారు. పరీక్షలో కొరత లేకుండా చూసుకోవాలన్నారు. ఒక ప్రాంతంలో పెరుగుతున్న ఇన్‌ఫెక్షన్‌ను గుర్తించడానికి, దానిని నిరోధించడానికి టెస్ట్ లు పెద్ద ఆయుధమని ప్రధాని ఈ సందర్భంగా అన్నారు.

గత 6 రోజుల్లో దేశవ్యాప్తంగా 3.77 కోట్ల మోతాదులను అందించినట్లు అధికారులు ప్రధాని మోడీకి తెలిపారు. మలేషియా, సౌదీ అరేబియా, కెనడా వంటి దేశాల మొత్తం జనాభా కంటే ఇది ఎక్కువ అని వారు పేర్కొన్నారు. దేశంలోని 128 జిల్లాల్లో 45 ఏళ్లు పైబడిన వారిలో 50% కంటే ఎక్కువ మందికి టీకాలు వేశారు. 45 పైబడిన వారిలో 16 జిల్లాల్లో 90% కంటే ఎక్కువ టీకాలు వేసినట్టు ప్రధానికి వారు వివరించారు. టీకా కోసం ప్రజల వద్దకు వెళ్ళడానికి కొత్త మార్గాలను కనుగొని అమలు చేయడానికి రాష్ట్ర ప్రభుత్వాలతో సంప్రదిస్తున్నట్లు అధికారులు ప్రధానికి చెప్పారు. దీనికి ఎన్‌జీఓలు, ఇతర సంస్థలతో కలసి ఇటువంటి ప్రయత్నాల్లో పాల్గొనాలని ప్రధాని మోదీ సూచించారు.

దేశంలో ఇప్పటి వరకూ 31.48 కోట్ల మోతాదు కరోనా వ్యాక్సిన్ ఇచ్చారు. వీటిలో 26.02 కోట్లు మొదటి డోస్ కాగా, 5.45 కోట్లు రెండు మోతాదులను పూర్తి చేశారు. జూన్ 21 నుండి కొత్త మార్గదర్శకాల ప్రకారం, దేశవ్యాప్తంగా టీకా డ్రైవ్ ప్రారంభమైనప్పటి నుండి 50 లక్షలకు పైగా మోతాదులను నిరంతరం ఇస్తూ వస్తున్నారు. కోవిన్ యాప్ ప్రకారం, శనివారం సాయంత్రం 5.30 గంటల వరకు 56.31 లక్షల మోతాదులను అందించారు. దేశంలో శుక్రవారం 48,618 కొత్త కరోనా సోకినట్లు గుర్తించబడ్డాయి. ఈ సమయంలో 64,524 మంది కరోనాను ఓడించారు, కాని 1182 మంది మరణించారు. అదే సమయంలో, క్రియాశీల కేసుల సంఖ్యలో 17,101 తగ్గుదల నమోదైంది.

10 రాష్ట్రాల్లో 5% కంటే ఎక్కువ సంక్రమణ రేటు

దేశంలో కరోనా నియంత్రణలో ఉన్న పరిస్థితుల మధ్య, 10 రాష్ట్రాల్లో, సంక్రమణ రేటు ఇప్పటికీ 5% కంటే ఎక్కువగానే ఉంది. అంటే, ప్రతి 100 పరీక్షలకు 5 కంటే ఎక్కువ మంది రోగులు ఈ రాష్ట్రాల్లో ఇంకా ఉంటున్నారు. వీటిలో సిక్కిం, మణిపూర్, మేఘాలయ, మిజోరం, కేరళ, నాగాలాండ్, గోవా, ఆంధ్రప్రదేశ్, ఒడిశా, అరుణాచల్ ప్రదేశ్ ఉన్నాయి.

Also Read: Masked Aadhaar: ఆధార్ ఇప్పుడు మరింత సురక్షితంగా.. మీ ‘మాస్క్ ఆధార్’ డౌన్‌లోడ్ చేసుకోండి ఇలా!

Delta Plus variant: వణికిస్తున్న డెల్టా వేరియంట్.. తమిళనాడులో తొలి మరణం నమోదు..

భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
భారత్‌తో ఆడాలంటే ఆ మూడు షరతులు తీరాల్సిందే.. పాక్ కొత్త డ్రామా
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
గర్ల్ ఫ్రెండ్‌కి వీడియో కాల్ చేసి.. లైవ్‌లో ITI విద్యార్థి సూసైడ్
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
భారీగా దిగి వస్తున్న బంగారం ధరలు.. ఏపీ, తెలంగాణలో తులం ధర ఎంతంటే
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
రోజురోజుకు పెరిగిపోతున్న హనుమంతుడు.. 1500 ఏళ్లుగా పైకప్పు లేకుండా
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
కోటి మంది పిల్లల ఆధార్‌ కార్డులు అప్డేట్‌! ఎందుకంటే..?
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
బతికిస్తారనే కొండంత ఆశతో వచ్చారు.. వైద్యులు చేసిన పనికి
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
అయ్యో దేవుడా.. సమయానికి వైద్యం అందక విద్యార్థిని మృతి!
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
వారందరికీ త్వరలో డబుల్ బెడ్ రూం ఇళ్లు.. ప్రభుత్వం శుభవార్త..
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
CM Revanth Reddy: వాళ్ళని చూసి మీరు ఓటేస్తే మోసపోతారు
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..
కేంద్ర ప్రభుత్వం అదిరే స్కీమ్.. వీరికి ప్రతీ నెలా రూ.3 వేలు..