Presidential Election 2022 Results Highlights: భారతదేశ చరిత్రలో సంచలనం.. రాష్ట్రపతిగా తొలి ఆదివాసి మహిళ

| Edited By: Subhash Goud

Updated on: Jul 21, 2022 | 10:04 PM

Presidential Polls 2022 Highlights: కౌన్‌ బనేగా నయా రాష్ట్రపతి? కొత్త ప్రెసిడెంట్‌ ఎవరు? గురువారం సాయంత్రంలోగా తేలిపోయింది. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ముర్ము గెలిచి

Presidential Election 2022 Results Highlights: భారతదేశ చరిత్రలో సంచలనం.. రాష్ట్రపతిగా తొలి ఆదివాసి మహిళ
New President Of India

Presidential Polls 2022 Highlights: కౌన్‌ బనేగా నయా రాష్ట్రపతి? కొత్త ప్రెసిడెంట్‌ ఎవరు? గురువారం సాయంత్రంలోగా తేలిపోయింది. ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. ముర్ము గెలిచి రాష్ట్రపతిగా ఎన్నికైన తొలి గిరిజన మహిళగా హిస్టరీ క్రియేట్‌ చేశారు. మరోవైపు, విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు ఎన్ని ఓట్లు వస్తాయన్న ఆసక్తి కూడా నెలకొనుండగా,  సరిగ్గా 11 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభమమైంది.  బ్యాలట్‌ బాక్సులు అన్ని రాష్ట్రాల నుంచి ఇప్పటికే పార్లమెంట్‌ భవనానికి ఇప్పటికే చేరుకున్నాయి. భారీ బందోబస్తు మధ్య స్ట్రాంగ్‌ రూమ్‌లో నుంచి కౌంటింగ్ కేంద్రానికి తీసుకొచ్చారు అధికారులు.

కౌంటింగ్‌ ప్రాసెస్‌ను చీఫ్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ పర్యవేక్షిస్తారు. ఇవాళ సాయంత్రానికి రిజల్ట్‌ తెలుస్తుందన్నారు. ఎంపీల ఓట్ల కౌంటింగ్‌ పూర్తయ్యాక ఒకసారి, ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌లో 10 రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్‌ పూర్తయ్యాక రెండోసారి పోల్‌ ట్రెండ్స్‌ గురించి చీఫ్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వెల్లడింస్తారు. 20 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కంప్లీట్‌ అయ్యాక ఇంకోసారి బ్రీఫింగ్‌ ఇస్తారు.. ఆపై కౌంటింగ్‌ పూర్తయ్యాక రిజల్ట్‌ ప్రకటించనున్నట్లుగా సమాచారం.

సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతంకుపైగా పోలింగ్‌ నమోదైంది. 10 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్‌ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఓటు వేశారు. వీరిలో ఎంపీలు 776 మంది. ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు. ప్రధాని మోదీ, కేంద్ర మంత్రులు, సీఎంలు కూడా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. భారతీయ జనతా పార్టీ ఎంపీలు సన్నీ డియోల్, సంజయ్ ధోత్రే సహా ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేకపోయారు. పోలింగ్ సమయంలో డియోల్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లగా, ధోత్రే ఐసీయూలో ఉన్నారు. బీజేపీ, శివసేన, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (SP), ఏఐఎంఐఎంలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయలేదు.

తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే ఏపీలో అధికార వైసీపీతో పాటు ప్రతిపక్ష టీడీపీ కూడా ఎన్‌డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకు మద్దతు ఇచ్చిన సంగతి తెలిసిందే. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీ మాత్రం విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు మద్దతు పలికారు.

ప్రస్తుత రాష్ట్రపతి రాంనాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ఈ నెల 24తో ముగుస్తుంది. కొత్త రాష్ట్రపతి ఈ నెల 25న ప్రమాణ స్వీకారం చేస్తారు. ఇవాళ జరిగే కౌంటింగ్‌ కోసం దేశ్యవాప్తంగా అందరూ ఉత్కంఠగా ఎదురు చూస్తున్నారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం..

LIVE NEWS & UPDATES

The liveblog has ended.
  • 21 Jul 2022 09:41 PM (IST)

    జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం

    జూలై 25న రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అస్సాంకు చెందిన 22 మంది, బీహార్‌కు చెందిన 6 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు. మధ్యప్రదేశ్‌లో 16 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ చేశారు.

  • 21 Jul 2022 08:49 PM (IST)

    ద్రౌపది ముర్ముకు అమిత్‌ షా అభినందనలు

    ద్రౌపది ముర్ము గెలుపుపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ట్వీట్ చేశారు. అతి సామాన్య గిరిజన కుటుంబానికి చెందిన ఎన్‌డిఎ అభ్యర్థి శ్రీమతి ద్రౌపది ముర్ము జీ ఎన్నిక కావడం యావత్ దేశానికి గర్వకారణం, నేను ఆమెను అభినందిస్తున్నాను అని అన్నారు.

  • 21 Jul 2022 08:36 PM (IST)

    ద్రౌపది ముర్ముకు శుభాకాంక్షలు తెలిపిన యశ్వంత్‌ సిన్హా

    2022 రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం సాధించడంపై విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హా ముర్ముకు శుభాకాంక్షలు తెలిపారు. మూడు రౌండ్లలో ద్రౌపది ముర్ముకు భారీ ఆధిక్యం లభించింది.

  • 21 Jul 2022 08:31 PM (IST)

    ద్రౌపది ముర్ము ఇంటికెళ్లి శుభాకాంక్షలు తెలిపిన మోడీ

    15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నికయ్యారు. ఓట్ల లెక్కింపులో ముర్ము అఖండ విజయం సాధించారు. దీంతో ప్రధాని నరేంద్ర మోడీ, జేపీ నడ్డా ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు. తూర్పు భారతదేశంలో మారుమూల ప్రాంతంలో జన్మించిన గిరిజన సామాజిక వర్గానికి చెందిన మహిళ ఎన్నికైందని ఈ సందర్భంగా మోడీ అభినందించారు.

  • 21 Jul 2022 08:15 PM (IST)

    కాసేపట్లో ముర్ము ఇంటికి ప్రధాని మోడీ

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ముర్ము అఖండ విజయం సాధించారు. అయితే ప్రధాని నరేంద్ర మోడీ కొద్దిసేపట్లో ముర్ము ఇంటికి వెళ్లి శుభాకాంక్షలు తెలుపనున్నారు.

  • 21 Jul 2022 08:05 PM (IST)

    క్రాస్‌ ఓటింగ్‌

    ద్రౌపది ముర్ము దేశానికి 15వ రాష్ట్రపతి కానున్నారు. ముర్ము క్రాస్ ఓటింగ్ ద్వారా ఇప్పటివరకు 104 మంది ఎమ్మెల్యేలు, 17 మంది ఎంపీల మద్దతు పొందారు. ఇప్పటి వరకు 16 రాష్ట్రాల్లో 104 మంది ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ ద్వారా ద్రౌపది ముర్ముకు ఓటు వేశారు.

  • 21 Jul 2022 08:02 PM (IST)

    15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము

    15వ రాష్ట్రపతి అభ్యర్థిగా ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. మొదటి గిరిజన రాష్ట్రపతిగా ముర్ము చరిత్ర సృష్టించారు. 3 రౌండ్లలోనూ ద్రౌపది భారీ ఆధిక్యం లభించింది. ముర్ముకు 2,161 ఓట్లు, యశ్వంత్‌ సిన్హాకు 1,058 ఓట్లు వచ్చాయి.

  • 21 Jul 2022 07:51 PM (IST)

    రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము విజయం

    ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసింది. ఇందులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం సాధించారు. కాగా, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హా ఓటమి చెందారు. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన రాష్ట్రపతి ఫలితాలు వచ్చేశాయి.

    ఈ ఓట్ల లెక్కింపులో ద్రౌపది ముర్ముకు ఓట్లు రాగా, యశ్వంత్‌ సిన్హాకు ఓట్లు వచ్చాయి. మొదటి రౌండ్‌ నుంచి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, యశ్వంత్‌ సిన్హా వెనుకంజలో ఉంటూ వచ్చారు.

  • 21 Jul 2022 07:46 PM (IST)

    విజయం వైపు ద్రౌపది ముర్ము

    రెండో రౌండ్ కౌంటింగ్ ముగిసిన తర్వాత ఇప్పటివరకు 10 రాష్ట్రాల్లో ఎంపీలు, ఎమ్మెల్యేలందరూ పోల్ చేసిన మొత్తం ఓట్లలో 72 శాతం ఓట్లతో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు.ఇప్పుడు మూడో రౌండ్ ఓట్ల లెక్కింపు కూడా పూర్తయింది. ఫలితాలు త్వరలో వెల్లడికానున్నాయి.

  • 21 Jul 2022 07:30 PM (IST)

    బీజేపీ ప్రధాన కార్యాలయంలో సంబరాల వాతావరణం

    రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఆధిక్యంలో ఉన్నారు. మూడో రౌండ్‌ కౌంటింగ్‌ కొనసాగుతోంది. మరోవైపు బీజేపీ ప్రధాన కార్యాలయంలో వేడుకలకు సన్నాహాలు ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో జనం అక్కడ గుమిగూడారు.

  • 21 Jul 2022 06:46 PM (IST)

    10 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు పూర్తి

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఇప్పటి వరకు 10 రాష్ట్రాలకు చెందిన ఓట్లను లెక్కింపు జరిగింది. ఏపీ, అరుణాచల్‌ ప్రదేశ్‌, అసోం, బీహార్‌, గుజరాత్‌, హర్యానా, హిమాచల్‌ ప్రదేశ్‌, జార్ఖండ్‌, ఛత్తీస్‌గఢ్‌, గోవా రాష్ట్రాల ఎన్నికల ఓట్ల లెక్కింపు పూర్తయ్యింది. ఫలితాలు రాత్రి వరకు వచ్చే అవకాశం ఉంది

  • 21 Jul 2022 06:39 PM (IST)

    ప్ల కార్డులు పట్టుకుని బీజేపీ కార్యకర్తల నినాదాలు

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం దాదాపు ఖరారు కావడంతో తెలంగాణలో సంబరాలు జోరందుకున్నాయి. ప్రధాని మోదీ, అభ్యర్థి ద్రౌపది ముర్మూ ప్లకార్డులు పట్టుకుని జై బీజేపీ, జై తెలంగాణ, జై బండి సంజయ్ అంటూ నినాదాలు చేస్తున్న బీజేపీ కార్యకర్తలు. ఈ సంబరాల్లో బండి సంజయ్ కుమార్ కూడా పాల్గొన్నారు.

  • 21 Jul 2022 06:37 PM (IST)

    వేములవాడలో బీజేపీ సంబరాలు

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్మూ విజయం దాదాపుగా ఖరారవడంతో బీజేపీలో సంబరాలు మిన్నంటాయి. వేములవాడ రాజన్న ఆలయం ఎదుట బాణసంచా పేలుస్తూ డ్యాన్సులు చేస్తూ సంబురాలు చేసుకుంటున్న బీజేపీ కార్యకర్తలు.

  • 21 Jul 2022 06:35 PM (IST)

    ఆధిక్యంలో కొనసాగుతున్న ద్రౌపది ముర్ము

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి నుంచి ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాపై ముందంజలో ఉన్నారు. ఫలితాలు రాత్రి 8 గంటల వరకు వచ్చే అవకాశం కనిపిస్తోంది.

  • 21 Jul 2022 06:13 PM (IST)

    విజయవాడలోనూ సంబరాలు

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము విజయం ఖాయమంటూ విజయవాడలో బీజేపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. తీన్మార్ డెన్సులతో ఉత్సాహంగా రాష్ట్ర కార్యాలయంలో చిందులేస్తున్నారు బీజేపీ కార్యకర్తలు

  • 21 Jul 2022 05:56 PM (IST)

    హైదరాబాద్‌ బీజేపీ నాయకుల సంబరాలు

    హైదరాబాద్‌: నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయం వద్ద సంబరాలు కొనసాగుతున్నాయి. ద్రౌపది ముర్ము గెలుపు దిశగా వెళ్తుండగా, బీజేపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. టపాసులు కాలుస్తూ డప్పు, వాయిద్ఆయలతో బీజేపీ నాయకుల సందడి నెలకొంది.

  • 21 Jul 2022 05:54 PM (IST)

    రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌

    రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్‌ జరిగిందని బీజేపీ ఎంపీ డా.లక్ష్మణ్‌ అన్నారు. ద్రౌపది ముర్ముకు కాంగ్రెస్‌ నేతలు ఓటు వేశారని అన్నారు. క్రాస్‌ ఓటింగ్‌లో బీజేపీ ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ఎన్నిక చరిత్రాత్మకం.

  • 21 Jul 2022 05:37 PM (IST)

    రెండో రౌండ్‌ ముగిసే సరికి ముర్ముకు 1,349 ఓట్లు

    రాష్ట్రపతి ఎన్నికల ఓటింగ్‌ కొనసాగుతోంది. రెండో రౌండ్‌లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. రెండో రౌండ్‌ ముగిసే సరికి ముర్ముకు 1,349 ఓట్లు రాగా, విపక్షాల అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాకు 537 ఓట్లు వచ్చాయి. ద్రౌపది ముర్ముకు పోలైన ఎంపీల ఓట్ల విలువ 4,83,299 కాగా, యశ్వంత్‌కు పోలైన ఎంపీల ఓట్ల విలువ 1,79,279.

  • 21 Jul 2022 05:29 PM (IST)

    రెండో రౌండ్‌లోనూ ద్రౌపది ముర్ము ఆధిక్యం

    ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉండగా, రెండో రౌండ్‌లోనే ముందంజలో ఉన్నారు.

  • 21 Jul 2022 05:21 PM (IST)

    దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తాం: మంత్రి ధర్మేంద్ర ప్రధాన్‌

    నేడు దేశంలో కొత్త చరిత్ర సృష్టిస్తామని కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ అన్నారు. దేశానికి తదుపరి రాష్ట్రపతిని త్వరలో ప్రకటించనున్నారు. ఒక గిరిజన కుటుంబానికి చెందిన ద్రౌపది ముర్ము దేశ తదుపరి రాష్ట్రపతిగా ఎన్నికవుతారని మంత్రి అన్నారు. నేడు కొత్త చరిత్ర సృష్టించబడుతుందని ఒక గిరిజన ఇంటి కుమార్తె దేశానికి తదుపరి రాష్ట్రపతిగా ఎన్నుకోబడుతుండటం గర్వంగా ఉందన్నారు మంత్రి ధర్మేంద్ర ప్రధాన్

  • 21 Jul 2022 05:18 PM (IST)

    యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము ఆధిక్యం

    కొత్త అధ్యక్షుడిని ఎప్పుడైనా ప్రకటించవచ్చు . ఎంపీల తర్వాత ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. రాష్ట్రపతి ఎన్నికల ఫలితాలు ఎప్పుడైనా రావచ్చు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ద్రౌపది ముర్ము గణనీయమైన ఆధిక్యం సాధిస్తోంది.

  • 21 Jul 2022 05:15 PM (IST)

    ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు

    ఒకటి నుండి ఒకటిన్నర గంటల్లో ఫలితం రావచ్చు రాష్ట్రపతి ఎన్నికకు సంబంధించి ఎమ్మెల్యేల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ద్రౌపది ముర్ము గ్రామంలో సంబరాల వాతావరణం నెలకొంది.

  • 21 Jul 2022 05:04 PM (IST)

    జానపద కళాకారులతో కేంద్ర మంత్రి నృత్యాలు

    ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో ఎంపీల ఓట్ల లెక్కింపు ముగిశాయి. అయితే ఈ మొదటి రౌండ్‌లో ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. ఇక ముర్ము విజయం ఖాయమని సంబరాలు చేసుకుంటున్నారు. ఫలితాలు రాకముందే ఆమె సొంత రాష్ట్రంలో వేడుకలు జరుపుకొంటున్నారు. జానపద కళాకారులతో కలిసి కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ గిరిజన నృత్యం చేశారు.

  • 21 Jul 2022 03:57 PM (IST)

    రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమానికి ప్రధాని మోడీ

    ప్రస్తుతం రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమం రేపు ఢిల్లీలో జరగనుంది. ప్రధానమంత్రి ఆతిథ్యం ఇవ్వనున్నారు. రేపు సాయంత్రం 5:30 గంటలకు ఢిల్లీలోని హోటల్ అశోక్‌లో పదవీవిరమణ చేస్తున్న రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు ప్రధాని నరేంద్ర మోదీ వీడ్కోలు, విందును ఏర్పాటు చేస్తున్నారు.

  • 21 Jul 2022 03:34 PM (IST)

    రేపు ఢిల్లీకి యోగి ఆదిత్యనాథ్‌

    ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఈనెల 24తో తన పదవీ కాలం ముగియనుంది. దీంతో రాష్ట్రపతి వీడ్కోలు కార్యక్రమంలో పాల్గొనేందుకు సీఎం యోగి ఆదిత్యనాథ్ రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అలాగే యూపీ ఉప ముఖ్యమంత్రులిద్దరు రాష్ట్రపతి వీడ్కోలు సభకు హాజరు కానున్నారు. జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారానికి హాజరు కానున్నారు.

  • 21 Jul 2022 03:19 PM (IST)

    మొదటి రౌండ్‌లో చెల్లని ఎంపీ ఓట్లు 15

    రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్‌ కొనసాగుతోంది. మొదటి రౌండ్‌లో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. ముర్ము ఓట్ల విలువ 3,78,000, యశ్వంత్‌ సిన్హాకు ఓట్ల విలువ 1,45,600. మొత్తం 4809 ఓట్లలో 776 మంది ఎంపీలు, 4033 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇందులో ముర్ముకు 540 ఎంపీ ఓట్లు రాగా, సిన్హాకు 208 ఎంపీ ఓట్లు పడ్డాయి. చెల్లని ఎంపీ ఓట్లు 15 ఉన్నట్లు అధికారులు తేల్చారు.

  • 21 Jul 2022 03:10 PM (IST)

    ముర్ము విజయం ఖాయమంటూ పాఠశాలలో వేడుకలు

    ఒడిశా: ఢిల్లీలో రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. పహాద్‌పూర్‌లోని ఎన్‌ఎల్‌ఎస్‌ మెమోరియల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్‌లో వేడుకలు జరుగుతున్నాయి. ఎన్డీయే అభ్యర్థి ద్రౌపది ముర్ము గెలుపు ఖాయమని, ఫలితాలు రాకముందే అక్కడి ప్రజలు, విద్యార్థులు సంబరాలు చేసుకుంటున్నారు.

  • 21 Jul 2022 03:02 PM (IST)

    ముర్ము పోరాట పటిమ ఉన్న నాయకురాలు

    ద్రౌపది ముర్మును రాష్ట్రపతి అభ్యర్థిగా ఎంపిక చేసినప్పుడే చాలా సంతోషించామని ముర్ము సోదరుడు వ్యాఖ్యానించారు. మా కుటుంబ సభ్యులమంతా హ్యాపీగా ఉన్నాము. గ్రామస్తులు కూడా సంతోషంగా ఉన్నారు. ముర్ము పోరాట పటిమ ఉన్న నాయకురాలు అని అన్నారు.

  • 21 Jul 2022 02:57 PM (IST)

    ముగిసిన మొదటి రౌండ్‌

    ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ పదవీ కాలం ఈనెల 24తో ముగియనుంది. కొత్త రాష్ట్రపతి ఈనెల 25న ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఎన్డీయే అభ్యర్థిగా గిరిజన మహిళ ద్రౌపది ముర్ము, విపక్షాల అభ్యర్థిగా యశ్వంత్‌ సిన్హాలు పోటీలో ఉన్నారు. వీరిలో ద్రౌపది ముర్ము విజయం ఖాయమని రాజకీయ విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఇప్పుడు మొదటి రౌండ్‌ ముగిసింది.

  • 21 Jul 2022 02:52 PM (IST)

    మొదటి రౌండ్‌లో ద్రౌపది ముర్ము ఆధిక్యం

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. మొదటి రౌండ్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ రౌండ్‌లో ద్రౌపది ముర్ము ఆధిక్యంలో ఉన్నారు. ముర్ముకు 510, యశ్వంత్‌ సిన్హాకు 208 ఓట్లు వచ్చాయి. చెల్లనివి 15 ఓట్లు ఉన్నాయి.

  • 21 Jul 2022 02:47 PM (IST)

    గెలుపు ప్రకటన రాకముందే ద్రౌపది ముర్ము గ్రామంలో సంబరాలు

    ద్రౌపది ముర్ము గ్రామంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ప్రకటన రాకముందే ఊరంతా సంబరాల్లో మునిగిపోయింది. బాలికలు, పాఠశాల విద్యార్థినులు నృత్యాలు, పాటలతో సంబరాలు చేసుకుంటున్నారు. గ్రామంలో 20 వేల లడ్డూలు తయారు చేశారు.

  • 21 Jul 2022 02:34 PM (IST)

    ద్రౌపది ఇంటిని ప్రధాని మోదీ

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ముగిసిన తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ ఈరోజు సాయంత్రం 4 గంటలకు ద్రౌపది ముర్ము ఇంటికి వెళ్లనున్నారు.

  • 21 Jul 2022 02:33 PM (IST)

    మోడీ మంత్రి వర్గం ద్రౌపతి ముర్ము ఇంటికి..

    మోడీ మంత్రివర్గం అంతా ద్రౌపది ముర్ము ఇంటికి చేరుకుని అభినందనలు తెలుపనున్నారు. రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్ ముగిసిన తర్వాత మోడీ మంత్రివర్గం మొత్తం ద్రౌపది ముర్ము ఇంటికి చేరుకుని ఆమెకు శుభాకాంక్షలు తెలుపనున్నారు. జేపీ నడ్డా కూడా రోడ్ షో చేసిన తర్వాత ద్రౌపది ఇంటికి చేరుకుంటారని తెలుస్తోంది. అదే సమయంలో ద్రౌపది నివాసంలో సాధారణ ప్రజలకు అనుమతించనున్నారు.

  • 21 Jul 2022 02:16 PM (IST)

    పార్లమెంట్ హౌస్‌లో..

    అన్ని రాష్ట్రాల బ్యాలెట్ పత్రాలను క్రమబద్ధీకరించిన తర్వాత రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభంకానుంది.

  • 21 Jul 2022 02:10 PM (IST)

    ఎంపీల ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది..

    తొలుత ఎంపీల ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది

    776 మంది ఎంపీల్లో ఓటు హక్కు వినియోగించుకున్న 763 మంది ఎంపీలు

    వీరిలో 719 మంది పార్లమెంటులో తమ ఓటు హక్కు వినియోగించుకోగా, మరో 44 మంది ఎంపీలు వేరువేరు రాష్ట్రాల్లో అసెంబ్లీలో ఓటు హక్కు వినియోగించుకున్నారు

  • 21 Jul 2022 01:52 PM (IST)

    ముందుగా ఎంపీల ఓట్లను లెక్కింపు..

    రాష్ట్రపతి ఎన్నికల్లో ముందుగా ఎంపీల ఓట్లను లెక్కిస్తారు. ఆ తర్వాత అందులో ఇతర ఓట్లను కలుపుతారు.

  • 21 Jul 2022 01:16 PM (IST)

    కొనసాగుతున్న ఓట్ల లెక్కింపు..

    పార్లమెంట్ హౌస్‌లో బ్యాలెట్ పేపర్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. వివిధ రాష్ట్రాల్లో ఎమ్మెల్యేలు వేసిన ఓట్ల బాక్సులను ఇద్దరు అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో తెరిచారు.

  • 21 Jul 2022 01:13 PM (IST)

    ముర్ము గ్రామంలో విద్యార్థినులు నృత్యాలు..

    ద్రౌపది ముర్ము గ్రామంలో ప్రజలు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. గెలుపు ప్రకటన రాకముందే ఊరంతా సంబరాల్లో మునిగిపోయింది. బాలికలు, పాఠశాల విద్యార్థినులు నృత్యాలు, పాటలతో సంబరాలు చేసుకుంటుండగా.. గ్రామంలో 20 వేల లడ్డూలు తయారయ్యాయి. 

  • 21 Jul 2022 11:39 AM (IST)

    గిరిజనులకే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణం

    కేంద్ర మంత్రి కిరెన్ రిజిజు మాట్లాడుతూ.. తొలి మహిళా గిరిజన అధ్యక్షురాలు కావడం గిరిజనులకే కాదు.. దేశంలోని ప్రతి ఒక్కరికీ గర్వకారణమని అన్నారు.

  • 21 Jul 2022 11:26 AM (IST)

    మొదలైన లెక్కింపు.. ముర్ము గ్రామంలో లడ్డూలు రెడీ..

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈ ఉదయం 11 గంటలకు ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో ద్రౌపది ముర్ము గెలుపు దాదాపు ఖాయమని భావిస్తున్నారు. అదే సమయంలో ముర్ము గ్రామంలో ప్రజలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇందులోభాగంగా 20 వేల లడ్డూలను సిద్ధం చేశారు.

  • 21 Jul 2022 10:52 AM (IST)

    ముర్ము నివాసంలో సన్నాహాలు..

    ఎన్డీయే రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము నివాసంలో సన్నాహాలు జరుగుతున్నాయి..

  • 21 Jul 2022 10:42 AM (IST)

    ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌లో 10 రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్‌..

    కౌంటింగ్‌ ప్రాసెస్‌ను చీఫ్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ అయిన రాజ్యసభ సెక్రటరీ జనరల్‌ పీసీ మోదీ పర్యవేక్షిస్తారు. ఇవాళ సాయంత్రానికి రిజల్ట్‌ తెలుస్తుందన్నారు. ఎంపీల ఓట్ల కౌంటింగ్‌ పూర్తయ్యాక ఒకసారి, ఆల్ఫాబెటికల్‌ ఆర్డర్‌లో 10 రాష్ట్రాల ఓట్ల కౌంటింగ్‌ పూర్తయ్యాక రెండోసారి పోల్‌ ట్రెండ్స్‌ గురించి చీఫ్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్‌ వెల్లడింస్తారు. 20 రాష్ట్రాల ఓట్ల లెక్కింపు కంప్లీట్‌ అయ్యాక ఇంకోసారి బ్రీఫింగ్‌ ఇస్తారు.. ఆపై కౌంటింగ్‌ పూర్తయ్యాక రిజల్ట్‌ ప్రకటించనున్నట్లుగా సమాచారం

  • 21 Jul 2022 10:17 AM (IST)

    ఓట్ల లెక్కింపునకు ముందు ద్రౌపది ముర్ము ట్వీట్..

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందు ద్రౌపది ముర్ము ఓ ట్వీట్ చేశారు. అందులో "జీవితం ఒక అద్దం, మనం నవ్వినప్పుడే అది నవ్వుతుంది" అని రాసుకున్నారు.

  • 21 Jul 2022 10:15 AM (IST)

    బీజేపీ ఆధ్వర్యంలో అభినందన్ యాత్రకు ప్లాన్..

    గురువారం సాయంత్రం రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు అనంతరం బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా నేతృత్వంలో ‘అభినందన్ యాత్ర’ చేపట్టాలని ప్లాన్ చేస్తున్నారు. ఇందులో వేలాది మంది నాయకులు, కార్యకర్తలు పాల్గొంటారు.

  • 21 Jul 2022 10:13 AM (IST)

    రామ్‌నాథ్ కోవింద్ పదవీ కాలం జూలై 24తో ముగియనుంది

    ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవీకాలం జూలై 24తో ముగియనుంది. జూలై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం జరగనుంది.

  • 21 Jul 2022 10:12 AM (IST)

    యశ్వంత్ సిన్హాకు 34, ద్రౌపది ముర్ముకు 44 పార్టీలు మద్దతు..

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థికి భారీ ఆధిక్యం వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే.. విపక్షాల అభ్యర్థి, కేంద్ర మాజీ మంత్రి యశ్వంత్ సిన్హాకు 34 పార్టీలు మద్దతు ప్రకటించగా.. జార్ఖండ్ మాజీ గవర్నర్ ద్రౌపది ముర్ముకు 44 పార్టీలు మద్దతు ప్రకటించాయి.

  • 21 Jul 2022 10:11 AM (IST)

    సాయంత్రం 4 గంటల వరకు ఫలితాలు వెలువడే అవకాశం..

    రాష్ట్రపతి ఎన్నికల ఓట్ల లెక్కింపు ఈరోజు ఉదయం 11 గంటలకు పార్లమెంట్ హౌస్‌లో ప్రారంభం కానుంది. ఫలితాలు సాయంత్రం 4 గంటలకు వచ్చే అవకాశం ఉంది.

  • 21 Jul 2022 10:08 AM (IST)

    రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు హక్కును వినియోగించుకోనిది వీరే..

    భారతీయ జనతా పార్టీ ఎంపీలు సన్నీ డియోల్, సంజయ్ ధోత్రే సహా ఎనిమిది మంది ఎంపీలు ఓటు వేయలేకపోయారు. పోలింగ్ సమయంలో డియోల్ చికిత్స కోసం విదేశాలకు వెళ్లగా, ధోత్రే ఐసీయూలో ఉన్నారు. బీజేపీ, శివసేన, బహుజన్ సమాజ్ పార్టీ (BSP), కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ (SP), ఏఐఎంఐఎంలకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు సోమవారం ఓటు వేయలేదు.

  • 21 Jul 2022 10:07 AM (IST)

    10 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్‌..

    సోమవారం జరిగిన రాష్ట్రపతి ఎన్నికల్లో 99 శాతంకుపైగా పోలింగ్‌ నమోదైంది. 10 రాష్ట్రాల్లో 100 శాతం పోలింగ్‌ జరిగింది. ఎంపీలు, ఎమ్మెల్యేలు మొత్తం 4,809 మంది ఓటు వేశారు. వీరిలో ఎంపీలు 776 మంది. ఎమ్మెల్యేలు 4,033 మంది ఉన్నారు.

  • 21 Jul 2022 10:00 AM (IST)

    ముర్ము సొంతూరు తుడులో సందడి వాతావరణం..

    మరోవైపు ద్రౌపది ముర్ము సొంతూరు ఒడిశాలోని తరనిసేన్ తుడులో సందడి వాతావరణం కనిపిస్తోంది. ఊరు ఊరంతా ఆనందంగా ఉంది. పోలీసులు కూడా బందోబస్తు పెంచారు. ఒక గిరిజన మహిళ ఆ స్థాయికి వెళ్లడం ఆనందంగా ఉందన్నారు ద్రౌపది ముర్ము సోదరుడు.

  • 21 Jul 2022 09:37 AM (IST)

    ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్..!

    776 మంది ఎంపీలు, 4,033 మంది ఎమ్మెల్యేలు సహా మొత్తం 4,809 మంది ఓటర్లు రాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు అర్హులు. నామినేటెడ్ ఎంపీలు, ఎమ్మెల్యేలు, శాసనమండలి సభ్యులు ఇందులో ఓటు వేయలేరు. రాష్ట్రపతి ఎన్నికకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పార్లమెంట్‌ హౌస్‌తో పాటు 31 చోట్ల, అసెంబ్లీ పరిధిలోని 30 కేంద్రాల్లో ఓటింగ్‌ జరిగింది. అనేక రాష్ట్రాల్లో ముర్ముకు అనుకూలంగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు కూడా వార్తలు వచ్చాయి.

  • 21 Jul 2022 09:33 AM (IST)

    పార్లమెంట్‌ హౌస్‌లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధం..

    ఇవాళ దేశ 15వ రాష్ట్రపతి నిర్ణయం జరుగనుంది. పార్లమెంట్‌ హౌస్‌లో రాష్ట్రపతి ఎన్నికల కౌంటింగ్కు సర్వం సిద్ధమైంది. గురువారం ఉదయం 11 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ముందుగా బ్యాలెట్ పేపర్లను క్రమపద్దతిలో అమర్చనున్నారు. అనంతరం రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలించనున్నారు.

Published On - Jul 21,2022 9:32 AM

Follow us
Latest Articles
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
లెక్క సరిచేశారుగా.. చెన్నైను ఓడించి ప్లే ఆఫ్స్‌కు దూసుకెళ్లిన RCB
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
కేన్స్‌లో ఐశ్వర్య మెరుపులు.. ఈసారి చమ్కీలా డ్రెస్‌లో.. ఫొటోస్
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
బుజ్జిని పరిచయం చేసిన భైరవ..ప్రభాస్ లైఫ్‌లో చాలా స్పెషల్..ఎవరంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
దంచికొట్టిన బెంగళూరు బ్యాటర్లు.. చెన్నై టార్గెట్ ఎంతంటే?
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
47 పరుగులకే కింగ్ కోహ్లీ ఔట్.. కానీ ఖాతాలో క్రేజీ రికార్డ్
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
ఎన్నికలను ఒంటిచేత్తో నడిపించిన మహిళా అధికారులు-పనితీరుపై ప్రశంసలు
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
కీర్తీ సురేష్‌కి బాలీవుడ్‌లో హెల్ప్ చేస్తున్నదెవరు.?
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
బొత్స అడ్డాలో హవా ఎవరెవది..?జోరుగా బెట్టింగ్స్
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
ఓటీటీలోకి పృథ్వీరాజ్ 'ఆడు జీవితం' .. స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే?
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం
స్నేహం.. ప్రేమ.. ఆపై సహజీవనం.. చివరికి మరణం