AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Samman Nidhi scheme: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన.. రైతులకు అందిస్తున్న సాయంపెంపు

PM Kisan Samman Nidhi scheme: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద కేంద్ర సర్కార్‌ రైతులకు అందిస్తున్న రూ.6వేల ఆర్థిక సాయాన్ని రూ.10వేలకు...

PM Kisan Samman Nidhi scheme: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన.. రైతులకు అందిస్తున్న సాయంపెంపు
Subhash Goud
|

Updated on: Jan 27, 2021 | 5:44 AM

Share

PM Kisan Samman Nidhi scheme: ప్రధానమంత్రి కిసాన్‌ సమ్మాన్‌ నిధి యోజన కింద కేంద్ర సర్కార్‌ రైతులకు అందిస్తున్న రూ.6వేల ఆర్థిక సాయాన్ని రూ.10వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఫిబ్రవరి 1న ప్రవేశపెట్టనున్న 2021 బడ్జెట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలాసీతారామన్‌ ఈ విషయాన్ని ప్రకటించే అవకాశం ఉంది. అయితే రూ.6 వేల సాయంతో పెద్దాగా ప్రయోజనం చేకూరేది ఏమి లేదన్న అభిప్రాయం రైతుల నుంచి వ్యక్తం అవుతోంది. మరోవైపు కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతుల నుంచి తీవ్ర నిరసన వ్యక్తం అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పీఎం-కిసాన్‌ సాయాన్ని రూ.10 వేలకు పెంచడం వల్ల రైతుల ఆగ్రహాన్ని కొంత చల్లార్చవచ్చని కేంద్రం భావిస్తున్నట్లు తెలుస్తోంది. కాగా, కరోనా మహమ్మారి కారణంగా దేశంలో వైద్య సౌకర్యాలు, ఆరోగ్య సేవల కోసం ఇకపై అధిక నిధులు కేటాయించే యోచనలో కేంద్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం ఈ రంగానికి జీడీపీలో ఒక శాతానికిపైగా మాత్రమే ఖర్చు చేస్తుండగా, 2025 నాటకి దీనిని 2.5 శాతానికి పెంచడం లక్ష్యంగా పెట్టుకోనుంది. ఈ మేరకు రానున్న కేంద్ర బడ్జెట్‌లో కొత్త నిధిని ఏర్పాటు చేయనుంది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి దీనిని సమకూర్చాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఇందు కోసం పౌరులు చెల్లించే వ్యక్తిగత ఆదాయపు పన్నుపై, కంపెనీలు చెల్లించే కార్పొరేట్‌ ట్యాక్స్‌పై నాలుగు శాతాన్ని హెల్త్‌, ఎడ్యుకేషన్‌సెస్‌గా వసూలు చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

Also Read: Saral Pension: భారత బీమా నియంత్రణ, అభివృద్ధి సంస్థ కీలక నిర్ణయం.. ఏప్రిల్‌ నుంచి ‘సరళ్‌’ పెన్షన్‌ పథకం