AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: మతసామరస్యానికి ప్రతీక.. అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్‌ను పంపిన ప్రధాని మోదీ

అజ్మీర్ ద‌ర్గా ఉర్సు ఉత్సవాల సంద‌ర్భంగా ముస్లింల‌కు శుభాకాంక్షలు తెలిపారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. ఈ ద‌ర్గా ఉర్సు ఉత్సవాల్లో స‌మ‌ర్పించే ఛాద‌ర్‌ను అజ్మీర్‌కు పంపారు ప్రధాని మోదీ. ద‌ర్గాలో స‌మ‌ర్పించేందుకు ప్రత్యేకంగా రూపొందించిన చాద‌ర్‌ను ప్రధాని మోదీ ముందు ఉంచారు కేంద్ర మంత్రి కిరెణ్ రిజిజు. జనవరి 4న అజ్మీర్ షరీఫ్ దర్గాలోని సమాధి వద్ద ప్రధాని మోదీ తరుఫున చాదర్ సమర్పించనున్నారు.

PM Modi: మతసామరస్యానికి ప్రతీక.. అజ్మీర్ షరీఫ్ దర్గాకు గిలాఫ్‌ను పంపిన ప్రధాని మోదీ
Pm Modi Chadar To Ajmer Dargah
Balaraju Goud
|

Updated on: Jan 03, 2025 | 9:12 AM

Share

అజ్మీర్‌లోని గరీబ్ నవాజ్ హజ్రత్ ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ దర్గాలో 813వ ఉర్సు ప్రారంభమైంది. ప్రతి సంవత్సరం ఇక్కడికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తరపున చాదర్ అందజేస్తారు. ఈసారి కూడా జనవరి 4న అజ్మీర్ షరీఫ్ దర్గాలోని సమాధి వద్ద ప్రధాని మోదీ చాదర్ సమర్పించనున్నారు. ఈ షీట్‌ను ప్రధాని మోదీ 11వ సారి అందిస్తున్నారు.

కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రి, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరెణ్ రిజిజు జనవరి 4న అజ్మీర్‌లో పర్యటించనున్నారు. అక్కడ ఖ్వాజా గరీబ్ నవాజ్ ఉర్స్ సందర్భంగా ప్రధాని మోదీ తరుఫున తరుఫున చాదర్ అందజేయనున్నారు. కాగా, ప్రధాని మోదీ దేశ సంస్కృతి, నాగరికతను కాపాడుతున్నారని అజ్మీర్ దర్గా చీఫ్ నసీరుద్దీన్ చిస్తీ అన్నారు. ప్రధానమంత్రి చాదర్‌ను స్వాగతిస్తున్నామని ఆయన అన్నారు. 1947 నుంచి ప్రధానిగా ఎవరున్నా ఈ సంప్రదాయం కొనసాగిస్తున్నారన్నారు. గత ప్రధానమంత్రులు సైతం ఖ్వాజా గరీబ్ నవాజ్ కు అకిదత్‌గా పంపారు. ప్రధాని మోదీ కూడా 2014 నుంచి ఇదే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. దీంతో పాటు మన దేశ సంస్కృతిని, నాగరికతను కూడా నరేంద్ర మోదీ కాపాడుతున్నారని పేర్కొన్నారు.

అజ్మీర్ షరీఫ్ దర్గా భారతదేశంలోని అత్యంత ప్రసిద్ధ సూఫీ దర్గాలలో ఒకటి. ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ ఉర్సు అనగా అతని నిర్వాణ దినం జరుపుకుంటారు. ఈ ఏడాది డిసెంబర్ 28 నుంచి దేశ, విదేశాల నుంచి లక్షలాది మంది తరలి రావడంతో 813వ ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. ఉర్సు సమయంలో లక్షలాది మంది భక్తులు అజ్మీర్ షరీఫ్ దర్గాకు చేరుకుంటారు. ఈ సంఘటన మతపరంగానే కాకుండా సాంప్రదాయ దృక్కోణం నుండి కూడా ముఖ్యమైనదిగా పరిగణిస్తారు. ప్రజలు తమ కోరికలను నెరవేర్చుకోవడానికి ఇక్కడి దర్గాలో చాదర్‌ను సమర్పిస్తారు. ఖ్వాజా గరీబ్ నవాజ్ దర్గా వద్ద చాదర్ సమర్పించడం విశ్వాసం, భక్తికి ముఖ్యమైన చిహ్నంగా భావిస్తారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..