AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: నేతాజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!

నేతాజీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో వివిధ పాఠశాలలకు చెంది విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. నేతాజీ గొప్పతనం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. భారతదేశ ఐక్యత కోసం ప్రజలు బోస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని నిర్వీర్యం చేసి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకునే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

PM Modi: నేతాజీ జయంతి సందర్భంగా దేశ ప్రజలకు ప్రధాని మోదీ కీలక విజ్ఞప్తి..!
Pm Modi In Netaji Birth Anniversary
Balaraju Goud
|

Updated on: Jan 23, 2025 | 4:48 PM

Share

నేతాజీ జయంతి సందర్భంగా దేశవ్యాప్తంగా పరాక్రమ్‌ దివస్‌ నిర్వహిస్తున్నారు. సుభాస్ చంద్రబోస్ జయంతి సందర్భంగా భారత ప్రధాని నరేంద్ర మోదీ గురువారం(జనవరి 23) ఆయనకు నివాళులర్పించారు. అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ప్రజలు ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. దేశాన్ని బలహీనపరిచేందుకు, ఐక్యతను విచ్ఛిన్నం చేసేందుకు ప్రయత్నిస్తున్న శక్తులకు వ్యతిరేకంగా పోరాడాలని సూచించారు.

సుభాష్ చంద్రబోస్ జయంతిని దేశవ్యాప్తంగా పరాక్రమ్‌ దివస్‌‌గా కూడా పిలుస్తారు. భారతదేశ స్వాతంత్ర్యానికి ముఖ్యమైన కృషి చేసిన సుభాష్ చంద్రబోస్ జీవితం, వారసత్వం వేడుకగా దీనిని జరుపుకుంటారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతి సందర్భంగా, దేశం మొత్తం ఆయనను గౌరవప్రదంగా స్మరించుకుంటుంది. నేతాజీకి గౌరవపూర్వకంగా నివాళులర్పిస్తున్నానని ప్రధాని మోదీ అన్నారు.

నేతాజీని స్మరించుకుంటూ ప్రధాన మంత్రి, “ఆయన ఎప్పుడూ సుఖవంతమైన జీవితంలో చిక్కుకోలేదు. అదేవిధంగా, అభివృద్ధి చెందిన భారతదేశాన్ని నిర్మించడానికి మనమందరం మన సౌకర్యాల నుండి బయటపడాలి. ప్రపంచ స్థాయిలో మనల్ని మనం అత్యుత్తమంగా తీర్చిదిద్దుకోవాలి. దేశప్రజలు శ్రేష్ఠతను ఎన్నుకోవాలి. పాండిత్యంపై దృష్టి పెట్టాలి. దేశంలోని స్వరాజ్య సాధన కోసం బోస్ పూర్తిగా దృష్టి కేంద్రీకరించారని, ఇందుకోసం వివిధ వర్గాల ప్రజలు ఆయనతో ఐక్యమయ్యారని చెప్పారు. ఇప్పుడు మనం అభివృద్ధి చెందిన భారతదేశం కోసం ఐక్యంగా ఉండాలని ప్రధాని మోదీ దేశ ప్రజలకు పిలుపునిచ్చారు. భారతదేశ ఐక్యత కోసం ప్రజలు బోస్ జీవితాన్ని స్ఫూర్తిగా తీసుకోవాలని నరేంద్ర మోదీ అన్నారు. దేశాన్ని నిర్వీర్యం చేసి ఐక్యతను విచ్ఛిన్నం చేయాలనుకునే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు.

తొలిసారిగా త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించిన నేల అండమాన్‌. ఇక్కడే తొలిసారి నేతాజీ త్రివర్ణ పతాకం ఎగరేశారని తెలిపారు ప్రధాని మోదీ. ఇవాళ నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ జయంతి సందర్భంగా..పరాక్రమ్‌ దివస్‌గా జరుపుకుంటున్నామన్నారు. ఈ సందర్భంగా అండమాన్ దీవులకు బోస్ పేరు పెట్టడం, ఇండియా గేట్ వద్ద ఆయన విగ్రహాన్ని ఏర్పాటు చేయడం, ఆయన జయంతిని ‘పరాక్రమ్ దివస్’గా జరుపుకోవడం తదితర కార్యక్రమాలను ఆయన ప్రభుత్వ హయాంలో ప్రధాని ప్రస్తావించారు. భారతదేశ వారసత్వం గురించి బోస్ గర్వపడుతున్నారని ఆయన అన్నారు.

నేతాజీ జయంతి సందర్భంగా దేశ రాజధాని ఢిల్లీలో వివిధ పాఠశాలలకు చెంది విద్యార్థులతో ప్రధాని మోదీ ముచ్చటించారు. నేతాజీ గొప్పతనం గురించి వివరించారు. ప్రతి ఒక్కరూ నేతాజీ జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన అడుగుజాడల్లో నడవాలని సూచించారు. ఓల్డ్ పార్లమెంట్ హౌస్ సెంట్రల్ హాల్‌లో వివిధ పాఠశాల విద్యార్థులతో ప్రధాని నరేంద్ర మోదీ సమావేశమై దేశ భవిష్యత్తు గురించి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. ప్రధాని మోదీ విద్యార్థులతో సమావేశమైన 3.27 నిమిషాల వీడియోను కూడా పంచుకున్నారు.

ఈ సందర్భంగా, 2047 నాటికి మీ లక్ష్యం ఏమిటని ప్రధాని మోదీ విద్యార్థులను అడిగారు. దానిపై పిల్లలు దేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చాలని చెప్పారు. 2047 నాటికి మా తరం పూర్తిగా సిద్ధమవుతుందని పిల్లలు చెప్పారు. స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తవుతాయన్నారు. అక్కడికి వచ్చిన విద్యార్థినులతో సంభాషిస్తున్న సందర్భంగా ప్రధాని మోదీ ఉదయం వారు ఇంటి నుంచి ఎన్ని గంటలకు బయలుదేరి ఇక్కడికి వచ్చారని అడిగారు. లంచ్ బాక్స్ తీసుకురాలేదా అని, కార్యక్రమం తర్వాత భోజనం ఎలాగా అంటూ ప్రధాని మోదీ నవ్వుతూ పలకరించారు.

ఈ రోజు ఎందుకు ప్రత్యేకమైన రోజు అని బాలికలను ప్రధాని మోదీ ప్రశ్నించారు. ఆయన ఎక్కడ జన్మించారని ప్రధాని ఆరా తీశారు. నేతాజీ ఒడిశాలోని కటక్‌లో పుట్టారని విద్యార్థినులు తెలిపారు. ఒడిశాలోని కటక్‌లో ఓ పెద్ద ఫంక్షన్‌ జరుగుతోందని మోదీ స్వయంగా చెప్పారు. “తుమ్ ముఝే ఖూన్ దో, మైన్ తుమ్హే ఆజాదీ దూంగా!” “నాకు రక్తం ఇవ్వండి, నేను మీకు స్వేచ్ఛ ఇస్తాను” అనే బోస్ నినాదం గురించి ఆయన విద్యార్థులతో మాట్లాడారు. ప్రధానమంత్రి సూర్యోదయ యోజన గురించి విద్యార్థులకు వివరించారు.

నేతాజీ సుభాష్ చంద్రబోస్ జయంతిని 2021లో ప్రతి సంవత్సరం జనవరి 23న శౌర్య దినోత్సవంగా జరుపుకోవాలని కేంద్రంలోని మోదీ ప్రభుత్వం ప్రకటించింది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..