Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

లోయలో పడ్డ లారీ.. 10 మంది రైతులు మృతి

లోయలో పడ్డ లారీ.. 10 మంది రైతులు మృతి

Phani CH

|

Updated on: Jan 23, 2025 | 1:35 PM

కర్ణాటకలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తర కన్నడ జిల్లాలో బుధవారం తెల్లవారుజామున కూరగాయల లారీ బోల్తా పడింది. దీంతో పదిమంది రైతులు అక్కడికక్కడే చనిపోయారు. మరో పదిహేను మందికి తీవ్రగాయాలయ్యాయి. సావనూర్ కు చెందిన రైతులు తాము పండించిన కూరగాయలను కుంత మార్కెట్ లో అమ్మేందుకు లారీలో బయలుదేరారు.

వీరు ప్రయాణిస్తున్న లారీ ఎల్లాపూర్ తాలూకాలో అరేబైల్- గుల్లాపురా మధ్య హైవేపై అదుపు తప్పింది. మరో వాహనానికి దారి ఇచ్చే క్రమంలో రోడ్డు పక్కనే ఉన్న లోయలో పడిపోయింది. దీంతో లారీలో కూర్చున్న రైతులు పదిమంది చనిపోగా మరో పదిహేను మంది గాయపడ్డారు. వాహనదారుల సమాచారంతో వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను సమీప ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాఫ్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. లారీలో ప్రయాణం ప్రమాదకరమని.. సాధ్యమైనంతవరకు ప్రజారవాణా సదుపాయాన్ని వినియోగించుకోవాలని అధికారులు కోరుతున్నారు.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ప్రియురాలి భర్తను.. కారు బానెట్‌పై ఈడ్చుకెళ్లిన ప్రియుడు

EPF ఖాతాదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై అంతా ఆన్‌లైన్‌లోనే..

అట్లుంటది అంబానీతోని.. రూ.49లకే అన్‌లిమిటెడ్ డేటా..