Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అట్లుంటది అంబానీతోని.. రూ.49లకే అన్‌లిమిటెడ్ డేటా..

అట్లుంటది అంబానీతోని.. రూ.49లకే అన్‌లిమిటెడ్ డేటా..

Phani CH

|

Updated on: Jan 23, 2025 | 1:31 PM

ఈ మధ్యకాలంలో చాలామందికి చేతిలో స్మార్ట్‌ఫోన్‌ లేకపోతే రోజు గడవని పరిస్థితి ఏర్పడింది. దీంతో టెలికం కంపెనీలు యూజర్లను ఆకట్టుకునే విధంగా తక్కువ డబ్బుకే రీఛార్జ్‌ ప్లాన్స్‌ను అందిస్తున్నాయి. ఇక ముఖేష్ అంబానీ సారధ్యంలోని రిలయన్స్ జియో.. ఎప్పటికప్పుడు తమ వినియోగదారులను ఆకర్షించేందుకు ప్రత్యేక ఆఫర్లను అందుబాటులోకి తీసుకువస్తోంది.

ఈ క్రమంలో నే తాజాగా పోటీదారులకు సవాల్ విసురుతూ ఓ మంచి ఆఫర్ అమలులోకి తెచ్చింది. రిలయన్స్ జియో తన కస్టమర్లకు కేవలం రూ. 49కే అన్‌లిమిటెడ్ డేటాను అందిస్తోంది. అయితే దీని వ్యాలిడిటీ 24 గంటలు. ఒక రోజు అపరిమిత డేటా కావాలనుకునేవారికి ఈ రీఛార్జ్ ప్లాన్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. కానీ ఇందులో కాలింగ్, ఎస్‌ఎంఎస్ సౌకర్యం పొందలేరు. మరోవైపు రూ. 11కే గంట పాటు అన్‌లిమిటెడ్ డేటా రీఛార్జ్ ప్లాన్‌ను కూడా రిలయన్స్ జియో అందుబాటులోకి తీసుకొచ్చింది. కాగా రిలయన్స్ జియో తన పోటీదారులైన టెలికం కంపెనీల నుంచి తీవ్రపోటీని ఎదుర్కుంటోంది. ఇక జియో తీసుకొచ్చిన ఈ ప్లాన్లు ఎయిర్‌టెల్, వోడాఫోన్, బీఎస్‌ఎన్‌ఎల్‌కి మరింత సవాలుగా మారే అవకాశాలున్నాయి.

మరిన్ని  వైరల్ వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ట్రంప్‌కి మొదలైన సవాళ్లు.. డోజ్‌పై అమెరికన్‌ ఉద్యోగ సంఘం దావా

Naga Chaitanya: చేపల పులుసు వండి వడ్డించిన నాగ చైతన్య

విశాఖ స్టీల్‌ప్లాంట్‌కి స్పెషల్ ప్యాకేజ్.. కేంద్రం కీలక ప్రకటన

మహాకుంభమేళాలో స్వయంగా.. ప్రసాదం తయారు చేసిన గౌతమ్ అదానీ

అమెరికాలో జన్మతః వచ్చే పౌరసత్వం ఇక లేనట్టే!