AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi security: ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు విచారణ.. రిటైర్డ్ జడ్జి నేతృత్వలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు

గత వారం పంజాబ్‌ పర్యటనలో భాగంగా ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా లోపాలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది.

PM Modi security: ప్రధాని భద్రతా వైఫల్యంపై సుప్రీంకోర్టు విచారణ.. రిటైర్డ్ జడ్జి నేతృత్వలో స్వతంత్ర కమిటీ ఏర్పాటు
Modi
Balaraju Goud
|

Updated on: Jan 10, 2022 | 1:05 PM

Share

PM Modi security lapse: గత వారం పంజాబ్‌ పర్యటనలో భాగంగా ఫిరోజ్‌పూర్‌లో ప్రధాని నరేంద్ర మోడీ భద్రతా లోపాలపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి నేతృత్వంలో స్వతంత్ర కమిటీని ఏర్పాటు చేసేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. డిజిపి చండీగఢ్, ఐజి నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, పంజాబ్ అండ్ హర్యానా హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్, ఎడిజిపి (సెక్యూరిటీ) పంజాబ్‌లను కమిటీలో సభ్యులుగా చేర్చాలని సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. ఈ కేసు విచారణ సందర్భంగా ప్రధాన న్యాయమూర్తి మాట్లాడుతూ.. ఈరోజు ఉదయం 10 గంటలకు ప్రధాని భద్రతకు సంబంధించిన పత్రాలు మాకు లభించాయని చెప్పారు.

విచారణ సందర్భంగా, ప్రధాని మోడీ రోడ్డు ప్రయాణం గురించి పంజాబ్ ముఖ్యమంత్రి చరణ్‌జిత్ సింగ్ చన్నీ ప్రభుత్వానికి ముందే తెలుసునని కేంద్ర ప్రభుత్వం తరపున న్యాయవాది సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు వివరించారు. ప్రధానమంత్రి భద్రతకు సంబంధించి SPG చట్టం గురించి సమాచారం అందించారు. అలాగే, భద్రతకు సంబంధించి బ్లూ బుక్‌లో ఇచ్చిన సమాచారాన్ని గుర్తు చేశారు. ఈ మొత్తం ప్రక్రియను అనుసరించడంలో పొరపాటు జరిగిందనడంలో సందేహం లేదు. దీనిపై ఎలాంటి వివాదం ఉండకూడదు. భద్రతా లోపం, నిర్లక్ష్యాన్ని కొట్టిపారేయలేం. డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ పర్యవేక్షణలో స్థానిక పోలీసులే భద్రతా ఏర్పాట్లు చేస్తారని ‘బ్లూ బుక్’లో స్పష్టంగా ఉందని తుషార మెహతా సుప్రీం ధర్మాసనానికి నివేదించారు.

ఈ కేసులో పంజాబ్ ప్రభుత్వ న్యాయవాది డీఎస్ పట్వాలియా మాట్లాడుతూ.. ‘మా అధికారులకు 7 షోకాజ్ నోటీసులు జారీ చేశాం. తన మనసులోని మాటను చెప్పుకునే అవకాశం అతనికి దొరకలేదు. కమిటీ విచారణపై స్టే ఉన్నప్పుడు, షోకాజ్ నోటీసు జారీ చేయడం ఏంటి? అని పంజాబ్ ప్రభుత్వం తరఫు సీనియర్ న్యాయవాది కోర్టు తెలిపారు. కేంద్రం ఏర్పాటు చేసిన కమిటీపై తమకు విశ్వాసం లేదని, అందువల్ల కోర్టు తన తరపున కమిటీని వేయాలని కోరారు. సుప్రీంకోర్టు కోరుకుంటే ఈ విషయంలో ప్రత్యేక విచారణ కమిటీని ఏర్పాటు చేయాలని సూచించారు. ఆ కమిటీకి మేం సహకరిస్తాం కానీ, ఇప్పుడు మన ప్రభుత్వాన్ని, అధికారులను నిందించకూడదున్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం న్యాయమైన విచారణ జరగదని ఆయన అన్నారు. దయచేసి స్వతంత్ర కమిటీని నియమించి, మాకు న్యాయమైన విచారణను అందించాలని పట్వాలియా సుప్రీంకోర్టును వేడుకున్నారు.

ఇదిలావుంటే, గత వారం రూ. 42,750 కోట్ల విలువైన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీ పంజాబ్‌లోని ఫిరోజ్‌పూర్‌కు చేరుకోనున్నారు. ఇందుకోసం వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్‌లో వెళ్లే అవకాశం లేకపోవడంతో రోడ్డు మార్గంలో జాతీయ అమరవీరుల స్మారక స్థూపానికి తీసుకెళ్తున్నారు. అయితే వేదిక నుండి కొంత దూరంలో, రైతులు నిరసన వ్యక్తం చేసి రహదారిని దిగ్బంధించారు, దీని కారణంగా ప్రధాని కాన్వాయ్ ఫ్లైఓవర్‌పై 15-20 నిమిషాల పాటు నిలిచిపోయింది. రోడ్డు ఖాళీగా లేకపోవడంతో ర్యాలీని రద్దు చేసుకుని ఢిల్లీకి తిరిగి వెళ్లాల్సి వచ్చింది.

Read Also….  AP Oxygen Plants: ఏపీలో అందుబాటులోకి కృత్రిమ ప్రాణవాయువు.. ఆక్సిజన్ ఫ్లాంట్లను ప్రారంభించిన సీఎం జగన్