AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్ మరో ముందడుగు.. స్వదేశీ ఎలక్ట్రిక్ కారును ప్రారంభించిన మోదీ

మోదీ బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం e-VITARAను జెండా ఊపి ప్రారంభించారు. ఈ ప్రాజెక్ట్ భారత  పారిశ్రామిక, సాంకేతిక నైపుణ్యానికి ఒక నిదర్శనంగా నిలుస్తుంది. ప్రస్తుతం భారతదేశంలో అమ్ముడవుతున్న మొత్తం కార్లలో ఎలక్ట్రిక్ మోడళ్లు కేవలం 3 శాతం వాటాను కలిగి ఉన్నాయి. e-VITARA వంటి మోడల్స్ భారతీయ EV మార్కెట్‌కు ఒక కొత్త ఊపునిచ్చే అవకాశం ఉంది.

PM Modi: గ్రీన్ మొబిలిటీ దిశగా భారత్ మరో ముందడుగు.. స్వదేశీ ఎలక్ట్రిక్ కారును ప్రారంభించిన మోదీ
Pm Modi Flags Off The E Vitara,
Krishna S
| Edited By: |

Updated on: Aug 26, 2025 | 1:27 PM

Share

భారత్ స్వయం సమృద్ధి, పర్యావరణ అనుకూల మొబిలిటీ దిశగా ఒక కీలకమైన అడుగు వేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గుజరాత్‌లోని హన్సల్‌పూర్‌లో దేశీయంగా తయారైన బ్యాటరీ ఎలక్ట్రిక్ వాహనం e-VITARAను జెండా ఊపి ప్రారంభించారు. ఈ అత్యాధునిక ఎలక్ట్రిక్ వాహనం దేశంలో తయారు కావడం విశేషం. అంతేకాకుండా ఇది ప్రపంచవ్యాప్తంగా 100కు పైగా దేశాలకు ఎగుమతి కానుంది. ఈ ప్రాజెక్ట్ భారత్ యొక్క ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి ఒక పెద్ద ప్రోత్సాహకంగా నిలుస్తుంది. ఇది దేశీయ తయారీ రంగానికి కొత్త ఊపునిచ్చి, గ్లోబల్ గ్రీన్ మొబిలిటీ మార్కెట్‌లో భారత్‌కు ఒక ప్రత్యేక స్థానాన్ని కల్పించనుంది.

అంతకుముందు ప్రధాని మోదీ ఎక్స్‌లో దీనికి సంబంధించి ఒక పోస్ట్ చేసి.. తమ ఆనందాన్ని పంచుకున్నారు. ‘‘ఈ ప్రాజెక్ట్ భారత పారిశ్రామిక, సాంకేతిక నైపుణ్యానికి ఒక నిదర్శనంగా నిలిచింది. e-VITARA కేవలం ఒక వాహనం మాత్రమే కాదు, ఇది స్వదేశీ ఉత్పత్తి సామర్థ్యానికి, పర్యావరణ అనుకూల భవిష్యత్తుకు భారత్ కట్టుబడి ఉన్న తీరుకు ఒక సంకేతం. కార్యక్రమం ద్వారా దేశీయ బ్యాటరీ పర్యావరణ వ్యవస్థకు కూడా పెద్ద ప్రోత్సాహం లభించింది. అదే హన్సల్‌పూర్‌లోని ప్లాంట్‌లో హైబ్రిడ్ బ్యాటరీ ఎలక్ట్రోడ్‌ల ఉత్పత్తి కూడా మొదలు కానుంది. ఇది దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీకి అవసరమైన కీలక విడిభాగాల కోసం విదేశీ దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది’’ అని మోదీ అన్నారు.

e-VITARA: ఒక నూతన ఆవిష్కరణ

జనవరిలో న్యూఢిల్లీలోని భారత్ మండపంలో జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పోలో మారుతి సుజుకి తన మొట్టమొదటి ఎలక్ట్రిక్ కారు e-VITARAను ఆవిష్కరించింది. మారుతి సుజుకి మోటార్ కార్పొరేషన్ ప్రతినిధి డైరెక్టర్ తోషిహిరో సుజుకి.. ‘‘దేశంలో EVలను వినియోగదారులకు మరింత ఆకర్షణీయంగా మార్చడానికి, మేము ప్రత్యేకమైన BEV ప్లాట్‌ఫామ్‌ను అభివృద్ధి చేస్తున్నాము’’ అని తెలిపారు. e-VITARA బోల్డ్, ఆధునిక డిజైన్‌ను కలిగి ఉంది. ఇందులో త్రీ-పీస్ DRLలతో కూడిన షార్ప్ ఎల్ఈడీ హెడ్‌లైట్లు, బ్లాక్డ్-అవుట్ బంపర్, దృఢమైన సిల్వర్ స్కిడ్ ప్లేట్‌లు ఉన్నాయి.

ఫీచర్లు – బ్యాటరీ ఎంపికలు

ఈ ఎలక్ట్రిక్ ఎస్‌యూవీ రెండు లిథియం-ఐరన్ ఫాస్ఫేట్ బ్యాటరీ ప్యాక్ ఎంపికలతో వస్తుంది. ఇది ఫ్రంట్-వీల్ డ్రైవ్, ఆల్-వీల్ డ్రైవ్ ఎంపికలలో కూడా అందుబాటులో ఉంటుంది. LED హెడ్, టెయిల్ ల్యాంప్స, 18/19 ఇంచెస్ టైర్లు, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ ప్యానెల్, టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్, పవర్డ్ డ్రైవర్ సీటు, వైర్‌లెస్ ఛార్జర్, జేబీఎల్ ప్రీమియం ఆడియో సిస్టమ్, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Follow Us