PM Modi: శ్రీకృష్ణుడి ఆశీస్సులు మనందరిపై ఉండాలి.. ద్వారకలో ప్రధాని మోదీ ప్రత్యేక పూజలు..
PM Modi: ఆదివారం ఉదయం భేట్ ద్వారక ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పూజలు, దర్శనం అనంతరం ఉదయం 8:25 గంటలకు సుదర్శన సేతును జాతికి అంకితం చేశారు. సుదర్శన్ సేతు గుజరాత్లోని ఓఖాలో ఉంది. ఇది ఓఖాను దేవభూమి బీట్ ద్వారకకు కలుపుతుంది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. ఇంతకు ముందు ఓఖా, భేట్ ద్వారకకు వెళ్లాలంటే పడవను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే ఈ వంతెన నిర్మాణంతో ఇకపై స్థానిక ప్రజలకు, ద్వారకకు వచ్చే పర్యాటకులకు మరింత సులువుగా మారనుంది.

PM Modi: గుజరాత్లో ఓఖా ప్రధాన భూభాగాన్ని, బేట్ ద్వారకను కలుపుతూ నిర్మించిన తీగల వంతెనను ప్రారంభించారు ప్రధాని మోదీ. దాదాపు రెండున్నర కిలో మీటర్ల పొడవున్న ఈ వంతెన.. దేశంలోనే అతి పొడవైన తీగల వంతెనగా చెబుతున్నారు. ఈ వంతెనకు సుదర్శన్ సేతు అనే పేరు పెట్టారు. సుదర్శన్ సేతును ప్రారంభించిన తర్వాత.. వంతెనపై కలియ తిరిగారు ప్రధాని. వంతెనపై నుంచి బోట్లు, పడవల్లో ఉన్న ప్రజలకు అభివాదం చేశారు.
వంతెన ప్రారంభానికి ముందుగా ద్వారక ఆలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజలు చేశారు మోదీ. ఆలయ పూజారులు.. ప్రధానికి ఘన స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందించారు. ఈమేరకు ప్రధాని మోదీ ఓట్వీట్ చేసి, తన అనుభవాలను పంచుకున్నారు. ‘నీటిలో మునిగి ఉన్న ద్వారకా నగరంలో ప్రార్థన చేయడం చాలా దివ్యమైన అనుభవం. నేను ఆధ్యాత్మిక వైభవం, కాలాతీత భక్తితో పురాతన యుగానికి కనెక్ట్ అయ్యాను. భగవాన్ శ్రీ కృష్ణుడు మనందరినీ అనుగ్రహిస్తాడు’ అంటూ రాసుకొచ్చారు.
కాగా, సుదర్శన్ సేతు పొడవు 2.32 కిలోమీటర్లు. రూ.979 కోట్లతో దీన్ని సిద్ధం చేశారు. ఇది దేశంలోని ప్రధాన మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో ఒకటి. ప్రధాని మోదీ ప్రస్తుతం గుజరాత్లో రెండు రోజుల పర్యటనలో ఉన్నారు. గుజరాత్ పర్యటనలో ప్రధాని దేశంలో రూ.52 వేల కోట్లకు పైగా విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
ఆదివారం ఉదయం భేట్ ద్వారక ఆలయానికి చేరుకున్న ప్రధాని మోదీ..
To pray in the city of Dwarka, which is immersed in the waters, was a very divine experience. I felt connected to an ancient era of spiritual grandeur and timeless devotion. May Bhagwan Shri Krishna bless us all. pic.twitter.com/yUO9DJnYWo
— Narendra Modi (@narendramodi) February 25, 2024
ఆదివారం ఉదయం భేట్ ద్వారక ఆలయానికి చేరుకున్నారు. ఆలయంలో పూజలు, దర్శనం అనంతరం ఉదయం 8:25 గంటలకు సుదర్శన సేతును జాతికి అంకితం చేశారు. సుదర్శన్ సేతు గుజరాత్లోని ఓఖాలో ఉంది. ఇది ఓఖాను దేవభూమి బీట్ ద్వారకకు కలుపుతుంది. ప్రధాని మోదీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రాజెక్టుల్లో ఇదీ ఒకటి. ఇంతకు ముందు ఓఖా, భేట్ ద్వారకకు వెళ్లాలంటే పడవను ఉపయోగించాల్సి వచ్చేది. అయితే ఈ వంతెన నిర్మాణంతో ఇకపై స్థానిక ప్రజలకు, ద్వారకకు వచ్చే పర్యాటకులకు మరింత సులువుగా మారనుంది.
సౌర ఫలకాల నుంచి వచ్చే విద్యుత్తుతోనే..
సుదర్శన్ సేతును ప్రత్యేకమైన డిజైన్లో సిద్ధం చేశారు. ఈ వంతెనకు ఇరువైపులా ఫుట్పాత్లు నిర్మించారు. కాలిబాటకు ఆనుకుని ఉన్న గోడలపై గీతా పద్యాలు రాసి శ్రీకృష్ణుడి చిత్రాలను రూపొందించారు. అలాగే ఫుట్ పాత్ పై భాగంలో సోలార్ ప్యానెల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ సోలార్ ప్యానెల్స్ ఒక మెగావాట్ విద్యుత్ను ఉత్పత్తి చేస్తాయి. ఇది ఫుట్పాత్లో ఏర్పాటు చేసిన వీధి దీపాలను ప్రకాశిస్తుంది.
2017లో ప్రధాని మోదీ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. అంతకుముందు ఈ వంతెనకు సిగ్నేచర్ బ్రిడ్జ్ అని పేరు పెట్టారు. అయితే, దాని పేరు తరువాత సుదర్శన్ వంతెనగా మార్చారు. ఈ ప్రాజెక్టుకు కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ 2016లో ఆమోదం తెలిపారు. ఒక సంవత్సరం తర్వాత, 2017 అక్టోబర్లో, ప్రధాని మోదీ ఈ వంతెనకు శంకుస్థాపన చేశారు. ఈ ప్రాజెక్టుకు తొలుత రూ.962 కోట్లు ఖర్చవుతుందని అంచనా వేశారు. అయితే, తర్వాత దాని ఖర్చు రూ.979 కోట్లకు పెరిగింది. ఈ వంతెన నిర్మాణం వల్ల ద్వారకకే కాకుండా లక్షద్వీప్పై నివసించే 8 వేల మందికి పైగా ప్రయోజనం చేకూరుతుంది.
రూ. 52,250 కోట్ల విలువైన ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు..
ప్రధాని మోదీ తన రెండు రోజుల గుజరాత్ పర్యటనలో రూ. 52,250 కోట్లకు పైగా విలువైన అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ప్రధానమంత్రి కార్యాలయం (PMO) ప్రకారం, గుజరాత్లోని రాజ్కోట్, పంజాబ్లోని భటిండా, ఉత్తరప్రదేశ్లోని రాయ్బరేలీ, ఆంధ్రాలోని మంగళగిరిలో కొత్తగా నిర్మించిన ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (AIIMS) భవనాలను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
