AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

20వేల అడుగుల ఎత్తునుంచి కరెంట్ తీగలపై పడిన విమానం.. 48 మంది సజీవ దహనం.. ఎక్కడంటే?

అయితే ల్యాండింగ్ సమయంలో విమానం దుమ్ము తుఫాను లో చిక్కుకుంది. దీంతో పైలట్‌కు విద్యుత్ తీగలు కనిపించకపోవడంతో విమానం ఆ వైర్లను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంపై దర్యాప్తు చేసినప్పుడు, పైలట్ నిర్దేశించిన ఎత్తు కంటే తక్కువగా ల్యాండింగ్ చేస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పైలట్ తప్పిదం

20వేల అడుగుల ఎత్తునుంచి కరెంట్ తీగలపై పడిన విమానం.. 48 మంది సజీవ దహనం.. ఎక్కడంటే?
Indian Airlines
Jyothi Gadda
|

Updated on: May 31, 2024 | 11:49 AM

Share

20000 అడుగుల ఎత్తు నుండి, విమానం 500 mph వేగంతో కిందకు వచ్చింది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానం హైటెన్షన్ విద్యుత్ వైర్లను ఢీకొట్టింది. ఆ వెంటనే భారీ పేలుడు సంభవించింది. విమానం అమాంతంగా పైకి లేచి ఆకాశంలో అగ్ని బంతిగా మారింది. క్షణాల్లో విమానం శిధిలాలు, ప్రయాణీకుల మృతదేహాలు అక్కడి ఖాళీ మైదానంలో ఎటూ చూసిన చెల్లచెదురుగా పడి కనిపించాయి. ఈ ప్రమాదంలో మొత్తం 48 మంది సజీవ దహనమయ్యారు. మరణించిన వారిలో ముగ్గురు రాజకీయ నాయకులు, దేశంలోని ప్రముఖ వ్యాపారవేత్త ఉన్నారు. ఈ దుర్ఘటన సరిగ్గా 51 సంవత్సరాల క్రితం ఇదే రోజున జరిగింది. అంటే మే 31, 1973న దేశ రాజధాని ఢిల్లీలోని పాలం ((ప్రస్తుతం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) విమానాశ్రయంలో ఇండియన్ ఎయిర్‌లైన్స్ విమానం కూలిపోవడాన్ని ప్రజలు తమ కళ్లతో చూశారు. భారతదేశ చరిత్రలో ఇది అత్యంత ఘోరమైన విమాన ప్రమాదంగా గుర్తుండిపోయింది.

నివేదికల ప్రకారం, ఇండియన్ ఎయిర్‌లైన్స్ ఫ్లైట్ 440 బోయింగ్ 737-200 విమానంలో ప్రయాణించింది. విమానం పేరు సారంగ. విమానం తమిళనాడులోని చెన్నైలోని మద్రాస్ విమానాశ్రయం నుండి బయలుదేరింది. న్యూఢిల్లీలోని పాలం((ప్రస్తుతం ఇందిరా గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం) అంతర్జాతీయ విమానాశ్రయంలో ల్యాండ్ కావాల్సి ఉంది. అయితే ల్యాండింగ్ సమయంలో విమానం దుమ్ము తుఫాను లో చిక్కుకుంది. దీంతో పైలట్‌కు విద్యుత్ తీగలు కనిపించకపోవడంతో విమానం ఆ వైర్లను ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే విమానంలో మంటలు చెలరేగాయి. ప్రమాదంపై దర్యాప్తు చేసినప్పుడు, పైలట్ నిర్దేశించిన ఎత్తు కంటే తక్కువగా ల్యాండింగ్ చేస్తున్నట్లు పరిశోధకులు కనుగొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పైలట్ తప్పిదం వల్లే ప్రమాదం జరిగిందని నిర్ధారించారు.

నివేదికల ప్రకారం , ప్రమాదంలో మరణించిన వారిలో అమెరికా నుండి నలుగురు, బ్రిటన్ నుండి ముగ్గురు, యెమెన్ నుండి ఒక మహిళ ఉన్నారు. అప్పటి దేశంలోని ఇనుము, ఉక్కు గనుల మంత్రి మోహన్ కుమారమంగళం, లోక్ సభ సభ్యుడు, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నాయకుడు కె. బాలధన్యుతం, మాజీ రాజ్యసభ ఎంపీ, భారత జాతీయ కాంగ్రెస్ నాయకురాలు దేవకీ గోపిదాస్, ప్రముఖ వ్యాపారవేత్త రఘునాథ్ రెడ్డి కాకాని ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి…