AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేశ వ్యాప్తంగా చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మలు దహనం

డ్రాగన్‌ కంట్రీ కన్నింగ్ వేశాలకు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది.

దేశ వ్యాప్తంగా చైనా అధ్యక్షుడి దిష్టి బొమ్మలు దహనం
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Jun 17, 2020 | 12:53 PM

Share

డ్రాగన్‌ కంట్రీ కన్నింగ్ వేశాలకు 20 మంది భారత జవాన్లు వీరమరణం పొందిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇరు దేశాల మధ్య వాతావరణం ఒక్కసారిగా హీటెక్కింది. తొలుత కల్నల్‌ సహా.. మరో ఇద్దరు జవాన్లు మరణించారని అనుకున్నా.. ఆ తర్వాత మొత్తం 20 మంది వరకు భారత జవాన్లు మరణించారని జాతీయ న్యూస్ ఏజెన్సీస్ ప్రకటించాయి. ఈ క్రమంలో భారత ప్రజలు చైనాపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తూ.. నిరసనలు తెల్పుతున్నారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో మంగళవారం సాయంత్రం బాపునగర్‌లో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ దిష్టిబొమ్మలను దహనం చేశారు. అంతేకాదు.. చైనీస్‌కు చెందిన వస్తువులను కూడా కాల్చేస్తూ.. చైనీస్ వస్తువులకు చెక్ పెట్టాలంటూ నినాదాలు చేశారు. మరోవైపు అటు వారణాసిలో కూడా విశాల్‌ భారత్‌ సంస్థాన్‌ సంస్థ ఆధ్వర్యంలో జిన్‌పింగ్‌ దిష్టిబొమ్మను కాల్చేశారు.

కాగా, సోమవారం జరిగిన ఘర్షణలో అటు చైనాకు చెందిన సైనికులు కూడా పెద్ద సంఖ్యలో మరణించారని సమాచారం. దాదాపు 43 మంది సైనికులు గాయపడి ఉంటారని వార్తలు వస్తుంటే.. అమెరికాకు చెందిన న్యూస్ ఏజెన్సీస్ మాత్రం.. 35 మంది చైనా సైనికులు చనిపోయారని ప్రకటించాయి.

ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
ఈఎంఐ, క్రెడిట్ కార్డ్ రుణాలు చెల్లించలేకపోతున్నారు? కారణాలు ఇవే..
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
సుభాష్‌ చంద్రబోస్‌ ప్రయాణించిన రైలు ఇప్పుడు ఎక్కడ నడుస్తుంది?
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
రోజూ ఇవి రెండు తింటే చాలు.. లెక్కలేనన్ని ఆరోగ్య ప్రయోజనాలు..
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
టీ20 వరల్డ్ కప్ స్క్వాడ్ ఫైనల్ నేడే..ఈ 5 కీలక అంశాలపైనే అందరిచూపు
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
ఉదయం Vs రాత్రి.. స్నానం చేయడానికి బెస్ట్ టైమ్ ఏదీ..?
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. త్వరలో రైల్వే ఉద్యోగ నోటిఫికేషన్‌
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
మహిళలకు గుడ్‌న్యూస్‌.. బ్యాంక్‌ అకౌంట్‌లోకి రూ.15 వేలు
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
ప్లీజ్ కామెరాన్.. ఇక ఆపేస్తే బెటరేమో బాస్.. అవతార్ 3 రివ్యూ
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
పురుషుల మూత్రం ఆ రంగులో ఉంటే.. క్యాన్సర్ సంకేతమా? వాస్తవం ఏంటి.?
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు
ఊరు ఊరంతా కరెంట్‌ షాక్‌.. సెల్‌ఫోన్‌ ఛార్జింగ్‌ పెడుతూ యువకుడు