AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

భారత్‌కు పాక్‌ పౌరుడి మద్దతు..! ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడంలో న్యాయం ఉందంటూ షాకింగ్‌ వీడియో రిలీజ్‌

పాకిస్థాన్‌కు చెందిన ఫారెక్స్ వ్యాపారి అభయ్, భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు మద్దతు తెలిపారు. పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తోందని విమర్శిస్తూ, భారతదేశం ప్రతిస్పందించే హక్కును సమర్థించారు. పుల్వామా దాడిలో మరణించిన 26 మందికి న్యాయం చేయడానికి భారత్‌ తీసుకున్న చర్యను సమర్థిస్తూ, అది న్యాయపూర్వకమని పేర్కొన్నారు.

భారత్‌కు పాక్‌ పౌరుడి మద్దతు..! ఆపరేషన్‌ సిందూర్‌ చేపట్టడంలో న్యాయం ఉందంటూ షాకింగ్‌ వీడియో రిలీజ్‌
Pakistani Supports India
SN Pasha
|

Updated on: May 14, 2025 | 3:15 PM

Share

ఇండియా చేపట్టిన ఆపరేషన్ సిందూర్‌కు ఓ పాకిస్థాన్‌ పౌరుడు మద్దతు తెలిపాడు. ఉగ్రవాదుల ఏరివేత కోసం భారత్‌ చేపట్టిన ఆపరేషన్‌ సిందూర్‌లో న్యాయం ఉందంటూ, భారత్‌కు ఆ హక్కు ఉందంటూ పేర్కొన్నాడు. పాకిస్తాన్ కు చెందిన ఫారెక్స్ వ్యాపారి అభయ్ భారత సైన్యాన్ని సమర్థిస్తూ, తన సొంత దేశం “ఉగ్రవాదాన్ని పెంచుతోందని” విమర్శించాడు. “నేను పాకిస్తానీని.. కానీ, ఒక విషయం సూటిగా చెబుతాను, భారత్‌కు ప్రతిస్పందించే హక్కు ఉంది” అని అభయ్ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసిన వీడియోలో పేర్కొన్నాడు. “మొదట, మీరు వారి ప్రజలపై దాడి చేస్తారు, వారు స్పందించినప్పుడు, అకస్మాత్తుగా శాంతి, మానవ హక్కులు అంటూ విక్టిమ్‌ కార్డ్‌ ప్లే చేస్తారు. 26 మంది అమాయక ప్రాణాలు కోల్పోయినప్పుడు మాత్రం ఏం అనరు. ఎవరూ యుద్ధాన్ని ఇష్టపడరు.

భారత్‌, పాక్‌ రెండు దేశాలు యుద్ధం కోరుకోవడం లేదు. కానీ మీరు ఉగ్రవాదాన్ని పెంచి పోషించడం ప్రారంభించినప్పుడు, అది మీ దారిలోకి వచ్చినప్పుడు ఆశ్చర్యపోకండి.” అని అభయ్‌ పేర్కొన్నాడు. అలాగే సీమాంతర ఉగ్రవాదంపై భారతదేశపు వైఖరిని ప్రస్తావిస్తూ భారత్‌ దీన్ని ఎప్పుడూ ప్రారంభించలేదు. వారు స్పందించారు అంతే, నాకు, అది యుద్ధ చర్య కాదు. అది కేవలం న్యాయం అని తెలిపాడు. ఒక పాకిస్తానీ హిందువుగా ఇది నా అభిప్రాయం.. జై హింద్ అంటూ అభయ్‌ తన వీడియోలో పేర్కొన్నాడు. ఏప్రిల్ 22న పహల్గామ్ లో 26 మంది మృతి చెందిన ఉగ్రవాద దాడికి ప్రతీకారంగా భారత్‌ ఆపరేషన్ సిందూర్‌ను చేపట్టిన విషయం తెలిసిందే. మే 7న పాకిస్తాన్, పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్‌లోని తొమ్మిది జైష్-ఎ-మొహమ్మద్, లష్కరే-ఎ-తోయిబా ఉగ్రవాద శిబిరాలపై భారతదేశం దాడి చేసింది. 25 నిమిషాల ఆపరేషన్‌లో 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారని రక్షణ మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఆపరేషన్ సిందూర్ తర్వాత, పాకిస్తాన్ నియంత్రణ రేఖ (LOC) వెంబడి, ముఖ్యంగా జమ్మూ కశ్మీర్‌లోని పూంచ్ జిల్లాలో భారీ ఫిరంగి దాడులను ప్రారంభించింది. బాలకోట్, మెంధార్, కృష్ణ ఘాటి, మంకోట్ వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకున్న ఈ కాల్పుల్లో కనీసం 16 మంది మరణించారు, 50 మందికి పైగా గాయపడ్డారు. పాకిస్తాన్ దళాలు జమ్మూ కశ్మీర్, పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లోని అనేక భారతీయ నగరాలపై డ్రోన్, క్షిపణి దాడులను కూడా ప్రారంభించాయి, వీటన్నింటినీ భారత రక్షణ వ్యవస్థ అడ్డుకుంది. మూడు రోజుల పాటు తీవ్ర ఘర్షణలు జరిగిన తర్వాత, సరిహద్దు వద్ద కాల్పులు నిలిపివేయాలని రెండు దేశాలు అంగీకరించాయి. కానీ అది స్వల్పకాలికం. శ్రీనగర్, ఇతర సరిహద్దు ప్రాంతాలలో తాజా డ్రోన్ దాడుల ద్వారా పాకిస్తాన్ గంటల్లోనే దానిని ఉల్లంఘించినట్లు సమాచారం.

View this post on Instagram

A post shared by Abhay (@abhayy_s)

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..