AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bharat Jodo Yatra: యూపీలో రాహుల్ యాత్రకు షాకిచ్చిన ప్రతిపక్షాలు.. కాశ్మీర్‌లో కలిసిరానున్న పీడీపీ నేతలు..

Bharat Jodo Yatra, Rahul Gandhi: జమ్మూ కాశ్మీర్‌కు భారత్ జోడీ యాత్ర మార్చిలో చేరుకుంటుంది. అయితే, ఈ యాత్రలో పాల్గొనడానికి నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి పీడీపీ, గుప్కర్ కూటమికి మధ్య చర్చలు జరిగాయి.

Bharat Jodo Yatra: యూపీలో రాహుల్ యాత్రకు షాకిచ్చిన ప్రతిపక్షాలు.. కాశ్మీర్‌లో కలిసిరానున్న పీడీపీ నేతలు..
Rahul Gandhi
Venkata Chari
|

Updated on: Dec 28, 2022 | 7:05 AM

Share

Bharat Jodo Yatra: కాంగ్రెస్ భారత్ జోడో యాత్ర ఈ రోజుల్లో స్వల్ప విరామంలో కొనసాగుతోంది. వచ్చే ఏడాది మళ్లీ ఈ ప్రయాణం ప్రారంభం కానుంది. ఉత్తరప్రదేశ్‌లోని ప్రతిపక్ష నేతలను కూడా యాత్రలో చేరాలని పార్టీ ఆహ్వానించింది. అయితే, ప్రముఖ ప్రతిపక్ష నాయకులు యాత్రలో పాల్గొనడం లేదనే వార్తలు వినిపిస్తున్నాయి. రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర ఉత్తరప్రదేశ్‌లో ప్రతిపక్ష భాగస్వాముల పరంగా రిక్తహస్తాన్ని మిగిల్చి ఉండవచ్చు.. కానీ, జమ్మూ కాశ్మీర్‌లో పరిస్థితి ఆయనకు అనుకూలంగా మారింది.

జమ్మూ కాశ్మీర్‌లో భారత్ జోడో యాత్ర మార్చి నెలలో చేరుకుంటుంది. అయితే, ఇందులో పాల్గొనడానికి, నేషనల్ కాన్ఫరెన్స్ నుంచి పీడీపీ, గుప్కర్ అలయన్స్ ఈ యాత్రలో పాల్గొనాలని నిర్ణయించుకున్నాయి. భారత్ జోడో యాత్ర 9 రోజుల పాటు విశ్రాంతి తీసుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 3, 2023న మళ్లీ గర్జించబోతోంది. కన్యాకుమారి నుంచి ప్రారంభమైన ఈ యాత్ర కాశ్మీర్‌లో ముగియనుంది.

కాశ్మీర్‌లో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేయనున్న రాహుల్..

భారత్ జోడో యాత్రకు సన్నాహాలు పూర్తి చేసేందుకు జమ్మూ చేరుకున్న కాంగ్రెస్ నేత, ఎంపీ కేసీ వేణుగోపాల్.. యాత్ర ఇక్కడికి చేరుకోగానే రాహుల్ గాంధీ కాశ్మీర్‌లో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారని తెలిపారు. యాత్రలో ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ, తరిగామి పాల్గొంటున్నట్లు ఆయన ధృవీకరించారు. అదే సమయంలో, నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఫరూక్ అబ్దుల్లా, అతని కుమారుడు ఒమర్ అబ్దుల్లా యాత్ర ప్రారంభానికి ముందే తమ భాగస్వామ్యాన్ని ప్రకటించడం గమనార్హం.

ఇవి కూడా చదవండి

నేషనల్ కాన్ఫరెన్స్ స్పందన ఇదే..

జమ్మూకశ్మీర్ సరిహద్దులోని లఖాపూర్‌లో యాత్ర ప్రవేశించగానే స్వాగతిస్తామని ఫరూక్ అబ్దుల్లా తెలిపారు. అనంతరం ఒమర్ అబ్దుల్లా మాట్లాడుతూ.. పార్టీ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లా పాల్గొంటున్నట్లు ప్రకటించగానే పార్టీలో అందరూ పాల్గొంటారని తెలిపారు.

పీడీపీ ప్రతిస్పందన ఇదే..

ఈ విషయమై జమ్మూకశ్మీర్ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ మాట్లాడుతూ.. ఈరోజు కశ్మీర్‌లో రాహుల్ గాంధీతో కలిసి భారత్ జోడో యాత్రలో పాల్గొనాల్సిందిగా నన్ను ఆహ్వానించారు. ఆయన అలుపెరగని ధైర్యానికి నేను వందనం చేస్తున్నాను. ఫాసిస్ట్ శక్తులను ఎదిరించే ధైర్యం ఉన్న వ్యక్తికి అండగా నిలవడం నా కర్తవ్యమని నమ్ముతున్నాను’ అంటూ ప్రకటించారు.

ఉత్తరప్రదేశ్‌లో పరిస్థితి..

ఉత్తరప్రదేశ్‌లో కాంగ్రెస్ సమాజ్ వాదీ పార్టీ, జయంత్ చౌదరి రాష్ట్రీయ లోక్ దళ్, మాయావతి బహుజన్ సమాజ్ పార్టీలను ఆహ్వానించారు. కానీ, ప్రధాన ప్రతిపక్షం ఏదీ పాల్గొనే అవకాశం లేదని తెలుస్తోంది. ముందస్తు షెడ్యూల్ కారణంగా తాను యాత్రకు హాజరు కాలేనని జయంత్ చౌదరి ఇప్పటికే ప్రకటించారు.

కాంగ్రెస్‌కు దూరమై, మాజీ మిత్రుడు అఖిలేష్ యాదవ్ కూడా యాత్రకు హాజరయ్యే అవకాశం లేదు. అయినప్పటికీ అతను ప్రతినిధిని పంపుతాడా లేదా అనేది స్పష్టంగా తెలియలేదు. కాబట్టి మరోవైపు ఈ యాత్రలో బీఎస్పీ అధినేత్రి మాయావతి కూడా పాల్గొనే అవకాశం స్వల్పంగానే కనిపిస్తోంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..