AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Amarnath Yatra 2025: అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న అధికారులు జమ్మూకు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశాలు.. ఎందుకంటే

జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా మంజూరు చేయాలనే ఊహాగానాల మధ్య అమర్‌నాథ్ యాత్ర కోసం మోహరించిన అధికారులను వెనక్కి పిలిచారు. అధికారులు తిరిగి వచ్చి తమ అసలు పదవులను చేపట్టాలని సూచించారు. అయితే ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా మంగళవారం ఏదైనా పెద్ద మార్పు జరిగే అవకాశం ఉందనే ఊహాగానాలను తోసిపుచ్చారు. అయితే ఇల్తిజా ముఫ్తీ ట్వీట్ ఊహాగానాలకు మరింత ఆజ్యం పోసింది.

Amarnath Yatra 2025: అమర్‌నాథ్ యాత్ర విధుల్లో ఉన్న అధికారులు జమ్మూకు తిరిగి రావాలని ప్రభుత్వం ఆదేశాలు.. ఎందుకంటే
Amarnath Yatra 2025
Surya Kala
|

Updated on: Aug 05, 2025 | 10:09 AM

Share

జమ్మూ కాశ్మీర్ కు రాష్ట్ర హోదా మంజూరు చేయడంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. ఇంతలో జమ్మూలో అమర్ నాథ్ యాత్ర విధుల్లో ఉన్న అధికారులను తిరిగి రావాలని కోరారు. అమర్ నాథ్ యాత్ర చేసే భక్తుల కోసం ఏర్పాటు చేసిన ప్రధాన సౌకర్యాల కేంద్రాల నుంచి అధికారులను, ఉద్యోగులను జమ్మూ జిల్లా యంత్రాంగం తొలగించింది. భగవతి నగర్ లో ఉన్న యాత్రి నివాస్ బేస్ క్యాంప్, పురాని మండిలో ఉన్న రామ్ మందిర్, పరేడ్ లో ఉన్న గీతా భవన్ అధికారులకు ఈ నిర్ణయం తక్షణమే వర్తిస్తుంది. అందరూ అసలు పదవులకు తిరిగి రావాలని ఆదేశించారు.

‘అమర్‌నాథ్ యాత్ర 2025 కోసం మోహరించిన అధికారులకు సంబంధించిన అన్ని ఉత్తర్వులను రద్దు చేసింది. ఫెసిలిటేషన్ సెంటర్లలో పోస్ట్ చేయబడిన అధికారులు, ఉద్యోగులు ఈ ఆదేశాల ప్రకారం తక్షణమే ఉపశమనం పొందనున్నారు. ఇందులో జమ్మూలోని భగవతి నగర్‌లోని యాత్రి నివాస్ బేస్ క్యాంప్, పురానీ మండిలోని రామ్ మందిర్, పరేడ్‌లోని గీతా భవన్ ఉన్నాయి’ అని పరిపాలన తన అధికారిక ప్రకటనలో తెలిపింది. అంతేకాదు అందరు అధికారులు, ఉద్యోగులు తమ రెగ్యులర్ పనిని తిరిగి ప్రారంభించడానికి వారి అసలు పోస్టింగ్ స్థలానికి రిపోర్ట్ చేయాలని సూచించారు.

ఏవిధంగా ఊహాగానాలు చక్కర్లు కొడుతున్నాయంటే అదే సమయంలో పిడిపి అధినేత్రి మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ ట్వీట్ చేయడంతో జమ్మూ కాశ్మీర్‌కు రాష్ట్ర హోదా ఇవ్వడం గురించి ఊహాగానాలు తీవ్రమయ్యాయి. ఆమె ‘సరిగ్గా ఆరు సంవత్సరాల క్రితం, ఆగస్టు 4, 2019న, కాశ్మీర్‌పై భయంకరమైన అనిశ్చితి మేఘం కమ్ముకుంది. ఒక వారం పాటు అణచివేసిన గుసగుసలు మళ్ళీ ఏదో పెద్ద విషయం జరగబోతోందని చెబుతున్నాయని ట్వీట్ చేసింది.

ఇవి కూడా చదవండి

జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఏం చెప్పారు? అయితే జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా ఈ విషయంపై మాట్లాడుతూ.. జమ్మూ కాశ్మీర్‌లో మంగళవారం ఏమి జరగబోతోందనే దాని గురించి నేను అనేక విషయాలు విన్నాను. అయితే మంగళవారం ఏమీ జరగదని నేను నిజాయితీగా చెబుతాను. అదృష్టవశాత్తూ చెడు ఏమీ జరగదు. అయితే దురదృష్టవశాత్తు సానుకూలంగా కూడా ఏమీ జరగదు. ఈ వర్షాకాల పార్లమెంటు సమావేశాల్లో జమ్మూ కాశ్మీర్‌కు సానుకూలంగా ఏదైనా జరుగుతుందని నేను ఇప్పటికీ ఆశాజనకంగా ఉన్నాను. అయితే మంగళవారం కాదని స్పష్టం చేశారు. నేను ఢిల్లీలోని ఎవరిని కలవలేదు లేదా మాట్లాడలేదు. ఇది కేవలం అంతర్గత భావన. మంగళవారం ఏమి జరుగుతుందో చూద్దామని చెప్పారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..