AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

New Parliament Building: రెండో దశలో కొత్త పార్లమెంట్ భవనం పనులు.. ఈ ఫేజ్‌లో వేటిపై దృష్టి పెడతారంటే..

పార్లమెంట్ హౌస్ లో స్వాతంత్య్ర పోరాటంలో అమరవీరులు, మహనీయుల వైభవంతో పాటు దేశ భక్తి సంప్రదాయాలపై కూడా దృష్టి సారించనున్నారు. రాజ్యసభ అంతస్తులో ఉన్న ఈ గ్యాలరీలు దేశంలోని జ్ఞానం, భక్తి సంప్రదాయాల సంగ్రహావలోకనాలను ప్రదర్శిస్తాయి

New Parliament Building: రెండో దశలో కొత్త పార్లమెంట్ భవనం పనులు.. ఈ ఫేజ్‌లో వేటిపై దృష్టి పెడతారంటే..
New Parliament Building
Surya Kala
|

Updated on: Jul 04, 2023 | 8:12 AM

Share

దేశంలో కొత్త పార్లమెంట్ హౌస్ కొలువుదీరింది. ఇప్పటికే పార్లమెంట్ హౌస్ ప్రారంభోత్సవం జరుపుకుంది. ఇప్పుడు ఈ పార్లమెంట్ భవనం గురించి దేశంలోనే కాదు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఇప్పుడు ఈ భవనం రెండో దశ పనులు ప్రారంభించాల్సి ఉంది. రెండో దశలో పార్లమెంట్‌ హౌస్‌ లో కళాత్మక ఉట్టిపడేలా నిర్మాణం సారించనున్నట్లు సమాచారం. కళలు మాత్రమే కాదు, భారతీయ సంప్రదాయాలు, స్వాతంత్య ఉద్యమం వీరోచిత కథలపై దృష్టి పెట్టనున్నారు.

అయితే, మీడియా కథనాల ప్రకారం, పార్లమెంట్ హౌస్‌లో ఆర్ట్ సైడ్ పనులు పూర్తి అవ్వడానికి మరో ఏడాది పట్టవచ్చు. తదుపరి దశలో డైనింగ్ హాల్‌ను అలంకరించడానికి కళాఖండాలు కాకుండా, దాదాపు ఎనిమిది కొత్త గ్యాలరీలు కూడా ఉంటాయి. IGNCA అంటే సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ఇందిరా గాంధీ నేషనల్ సెంటర్ ఫర్ ది ఆర్ట్స్ ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేస్తోంది.

గ్యాలరీలో భారతీయ సంప్రదాయానికి సంబంధించిన కథలు కొత్త పార్లమెంట్ హౌస్‌లో దాదాపు 5,000 కళాఖండాలను సేకరిస్తున్నారు.  ఇవి స్వాతంత్య్ర ఉద్యమానికి, భారతీయ సంప్రదాయాలకు నెలవు. ఇండియన్ ఎక్స్‌ప్రెస్ నివేదిక ప్రకారం IGNCA సభ్య కార్యదర్శి సచ్చిదానంద్ జోషి మాట్లాడుతూ.. లోక్‌సభ పై అంతస్తులో అత్యంత ప్రత్యేకమైన గ్యాలరీని నిర్మించారు, దీనికి “ది బ్యాటిల్ ఆఫ్ హానర్, 1857కి ముందు” అని పేరు పెట్టారు. ఇందులో స్వాతంత్ర్య పోరాటం (1857 నుండి 1947 వరకు) నాటి కథలను హైలైట్ చేసేలా మరో గ్యాలరీని నిర్మించనున్నారు.

ఇవి కూడా చదవండి

మహిళలు, గిరిజనులకు అంకితం చేయబడిన గ్యాలరీ ఐజిఎన్‌సిఎ ప్రకారం, మొదటి అంతస్తులో రెండు గ్యాలరీలు ఉంటాయని, ఇందులో ఒకటి దేశాభివృద్ధిలో మహిళల పాత్రపై దృష్టి పెడుతుందని, మరొకటి స్వాతంత్య్ర ఉద్యమంలో గిరిజన నాయకుల పాత్రను తెలియజేస్తుందని చెప్పారు. ఈ చిత్రాల ఉద్దేశ్యం ప్రజలలో జ్ఞానాన్ని, స్ఫూర్తిని మేల్కొల్పడం.

రాజ్యసభకు సంబంధించిన భవనంలో జ్ఞాన, భక్తికి సంబంధించిన పార్లమెంట్ హౌస్ లో స్వాతంత్య్ర పోరాటంలో అమరవీరులు, మహనీయుల వైభవంతో పాటు దేశ భక్తి సంప్రదాయాలపై కూడా దృష్టి సారించనున్నారు. రాజ్యసభ అంతస్తులో ఉన్న ఈ గ్యాలరీలు దేశంలోని జ్ఞానం, భక్తి సంప్రదాయాల సంగ్రహావలోకనాలను ప్రదర్శిస్తాయి. మొదటి అంతస్తులో ప్రకృతి, సంప్రదాయ క్రీడలకు సంబంధించిన చిత్రాలను ప్రదర్శించనున్నారు. భవనంలోని ఇతర గోడలు శ్లోకాలు , ఇతర పవిత్ర చిహ్నాలతో అలంకరించనున్నారు.

భారతదేశంలోని విభిన్న సంస్కృతుల సంగ్రహావలోకనాలు IGNCA సభ్య కార్యదర్శి సచ్చిదానంద్ జోషి కూడా భారతదేశంలోని అన్ని ప్రాంతాలు, రాష్ట్రాలకు తగిన ప్రాతినిధ్యం కల్పించినట్లు తెలియజేశారు. వివిధ వర్గాల కళ , సంస్కృతికి స్థానం కల్పించారు. భిన్నత్వంలో ఏకత్వాన్ని ప్రదర్శించడానికి మొదటి ప్రాధాన్యత. సెంట్రల్ ఫోయర్‌లో అలంకరించబడిన గోడకు జన జననీ జన్మభూమి అని పేరు పెట్టారు. ఇక్కడ 75 మంది మహిళా కళాకారులు 28 రాష్ట్రాలు, ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలకు ప్రాతినిధ్యం వహిస్తూ హస్తకళలను తయారు చేశారు.

అదే సమయంలో శిల్ప దీర్ఘ అనే గ్యాలరీలో.. దేశం నలుమూలల నుండి 400 మంది కళాకారుల నుంచి సేకరించిన 250 కంటే ఎక్కువ క్రాఫ్ట్ ముక్కలను ఏర్పాటు చేశారు. రెండవ దశ పనిని పూర్తి చేయడానికి భారతీయ సంప్రదాయాలు, ప్రముఖ కళాకారులను కూడా చేర్చారు. స‌మాచారం ప్ర‌కారం.. పార్ల‌మెంట్ హౌస్ క‌ళా ప్రాజెక్టుకు రూ.1200 కోట్ల‌కు పైగా ఖ‌ర్చు అవుతుంద‌ని అంచ‌నా.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..