Corona: షాకింగ్ న్యూస్.. 6 వేల మంది కరోనా రోగులు మిస్సింగ్.? భయందోళనలో ప్రజలు.!!
Corona Patients Missing: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా..
Corona Patients Missing: దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కరోనా కట్టడిలో భాగంగా ఇప్పటికే పలు రాష్ట్రాలు సంపూర్ణ లాక్డౌన్ను విధించాయి. ఇదిలా ఉంటే కర్ణాటకలో వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోంది. ప్రతీ రోజూ 45 వేలకు పైగా పాజిటివ్ కేసులు, 350కి పైగా మరణాలు సంభవిస్తున్నాయి. ఈ నేపధ్యంలోనే పాక్షిక లాక్డౌన్ కరోనాను నిలువరించకలేకపోవడంతో కర్ణాటక సర్కార్ ఇవాళ్టి నుంచి ఈ నెల 24వ తేదీ వరకు పూర్తిస్థాయి లాక్డౌన్ను విధించింది.
ఈ తరుణంలో బెంగళూరులో మరోసారి కొన్ని వేల మంది కరోనా రోగులు అదృశ్యమైనట్లు ఓ షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది. దీనితో ప్రజల్లో మరింత భయాందోళనలు నెలకొన్నాయి. గతంలో 10,835 మంది కరోనా బాధితులు అదృశ్యం కాగా.. వారి ఆచూకీ ఇంకా తెలియలేదు. ప్రస్తుతం మరోసారి 6,029 మంది కరోనా రోగులు అదృశ్యం కావడంతో బెంగళూరు ప్రజల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. తప్పుడు వివరాలు ఇవ్వడంతో పాటు మొబైల్ ఫోన్స్ స్విచ్చాఫ్ చేసుకోవడంతో రోగులను కనిపెట్టడం పోలీసులకు కష్టతరం అవుతోంది.
ఇవీ చదవండి:
Viral Video: అరటితోటను నాశనం చేసిన గజరాజులు.. ఆ ఒక్క చెట్టు తప్ప.. ఎందుకంటే.!
Viral: ఈ ఫోటోలోని టాలీవుడ్ యంగ్ హీరోను గుర్తు పట్టగలరా.? ఎక్కడో చూసినట్లు ఉంది కదూ.!
Viral News: మూడు రోజులు అంధకారంలోకి ప్రపంచం..? అసలు సంగతేంటంటే.!