Narendra Giri: నరేంద్రగిరి సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో.. అందులో ఏముందంటే..

స్వామిజీ నరేంద్రగిరి సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. అఖాడా పరిషత్‌ హెడ్‌ ఆత్మహత్య మిస్టరీ మలుపులు తిరుగుతోంది. పోలీసుల విచారణలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. సూసైడ్‌కు గంట ముందు నరేంద్రగిరి సెల్ఫీ వీడియో..

Narendra Giri: నరేంద్రగిరి సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. సెల్‌ఫోన్‌లో సెల్ఫీ వీడియో.. అందులో ఏముందంటే..
Narendra Giri
Follow us

|

Updated on: Sep 23, 2021 | 6:43 PM

స్వామిజీ నరేంద్రగిరి సూసైడ్‌ కేసులో మరో ట్విస్ట్‌.. అఖాడా పరిషత్‌ హెడ్‌ ఆత్మహత్య మిస్టరీ మలుపులు తిరుగుతోంది. పోలీసుల విచారణలో మరో సంచలన విషయం వెలుగుచూసింది. సూసైడ్‌కు గంట ముందు నరేంద్రగిరి సెల్ఫీ వీడియో రికార్డు ఇప్పుడు కలకలం రేపుతోంది. 4 నిమిషాల 30 సెకండ్ల డ్యురేషన్‌ ఉన్న ఈ వీడియోలో దిమ్మదిరిగే విషయాన్ని వెల్లడించారు నరేంద్రగిరి. మార్ఫింగ్‌ ఫొటోతో ఆనందగిరి తనను బెదిరించారని వీడియోలో ఆరోపించారు నరేంద్రగిరి. మహిళతో తాను కలిసి ఉన్నట్టు ఫొటో సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. తీవ్ర మనస్థాపానికి గురైన తాను ఆత్మహత్యకు పాల్పడుతున్నట్టు స్పష్టం చేశారు నరేంద్రగిరి.

ఇదిలావుంటే.. ప్రయాగరాజ్‌లోని అఖర పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి మరణం విషయంలో కొత్త విషయం వెలుగులోకి వచ్చింది. మహంత్ నరేంద్ర గిరి, సూసైడ్ నోట్ రాయడంతో పాటు, ఆత్మహత్యకు ఒక గంట ముందు తన మొబైల్ ఫోన్‌లో 4.5 నిమిషాల వీడియో స్టేట్‌మెంట్‌ను రికార్డ్ చేశారు. అందులో ఆత్మహత్యకు కారణాలు వెల్లడించినట్లుగా తెలుస్తోంది. పోలీసు చెప్పినదాని ప్రకారం అతని సూసైడ్ నోట్ నిజమా లేక నకిలీదా అనే చర్చ జరుగుతుండగానే ఈ వీడియో వెలుగులోకి రావడం సంచలనంగా మారింది. అయితే కొత్తగా లభించిన వీడియోపై పెద్ద చర్చ జరుగుతోంది. మహంత్ నరేంద్ర గిరికి సెల్ఫీ తీసుకోవడం లేదా మొబైల్ ఫోన్‌లో వీడియో రికార్డ్ చేయడం తెలియదు. కానీ ఆదివారం 19 వ తేదీ ఆత్మహత్యకు ఒక రోజు ముందు అతను తన విశ్వసనీయ శిష్యుడు సర్వేష్ ద్వివేది అలియాస్ బబ్లుకు ఫోన్ చేసి అతని నుండి మొబైల్‌లో వీడియో రికార్డింగ్ నేర్చుకున్నాడని తెలుస్తోంది.

ఈ సెల్ఫీ వీడియోలో తన మనుసులోని విషయాలను వెల్లడించినట్లుగా తెలుస్తోంది. నరేంద్ర గిరి వీడియో స్టేట్‌మెంట్‌లో మాట్లాడుతూ.. “తాను బ్రతకడానికి కారణం లేకుండా పోయిందని బాధపడ్డారు.” అయితే మహంత్ నరేంద్ర గిరి మరణం తరువాత, అతని మొబైల్ ఫోన్ అతని గది నుండి పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతని ఫోన్‌ను పోలీసులు సీల్ చేశారు. ఇది ఫోరెన్సిక్ పరీక్షకోసం పంపించారు. స్వామి ఆనంద్ గిరి ఆధ్య తివారీ, సందీప్ తివారీ మొబైల్ ఫోన్‌లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆలయంలో నెలకు రూ .9,000 పనిచేసే సందీప్ తివారీ వద్ద లక్ష కంటే ఎక్కువ విలువైన శామ్‌సంగ్ గెలాక్సీ నోట్ 20 అల్ట్రా ఫోన్‌ని ఉపయోగిస్తుండటంపై పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలావుంటే.. దేశంలో ఐప్యాడ్‌ను ఉపయోగించిన మొదటి వ్యక్తులలో ఆనంద్ గిరి కూడా ఒకరు.

ఇక.. నరేంద్రగిరి మృతిపై మరిన్ని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. కోట్లాది రూపాయల విలువైన భూమిని నరేంద్రగిరి బిల్డర్స్‌కు అమ్మేశారని.. ఈ విషయమై నరేంద్రగిరి.. అతని శిష్యుల మధ్య వివాదం తలెత్తిందన్న ఆరోపణలున్నాయి. ఈ కేసుని CBIకి అప్పగించాలని సాధువులు డిమాండ్ చేస్తున్నారు. ప్రాథమికంగా నరేంద్రగిరిది ఆత్మహత్యే అని చెబుతున్నా.. అతడి శిష్యులు మాత్రం ముమ్మాటికి హత్యేనని ఆరోపిస్తున్నారు.

ఇవి కూడా చదవండి: ఎంత ఆపినా ఆగలేదు.. కట్టలు తెంచుకున్న దుఖం.. తల్లి కోసం వెక్కి వెక్కి ఏడ్చేశాడు.. ఈ నాయకుడి బాధేంటో తెలిస్తే..

LIC IPO: డ్రాగన్‌ కంట్రీకి మోడీ సర్కార్ మరో ఝలక్‌.. ఇక ముందు భారత్‌లోకి అలా నో ఎంట్రీ..