పోలవరం అంచనాల ఆమోదంలో ఉద్దేశపూర్వక జాప్యం.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రంపై వైసీపీ మండిపాటు

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించకుండా 29 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత..

పోలవరం అంచనాల ఆమోదంలో ఉద్దేశపూర్వక జాప్యం.. అఖిలపక్ష సమావేశంలో కేంద్రంపై వైసీపీ మండిపాటు
Follow us

|

Updated on: Jul 18, 2021 | 9:11 PM

పోలవరం ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయాన్ని ఆమోదించకుండా 29 నెలలుగా కేంద్ర ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే కాలయాపన చేస్తోందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నేత విజయసాయి రెడ్డి ఆరోపించారు. ప్రాజెక్టు సవరించిన అంచనా వ్యయం రూ. 55, 657 కోట్లుగా టెక్నికల్‌ కమిటీ ఆమోదం తెలిపినప్పటికీ జల్‌ శక్తి మంత్రిత్వ శాఖ ఆ ఫైల్‌ను పెండింగ్‌లో పెట్టడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చేస్తున్న ద్రోహంగా అభివర్ణించారు. పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల సందర్భంగా ఆదివారం జరిగిన అఖిలపక్ష సమావేశంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ తరఫున విజయసాయి రెడ్డి, మిథున్‌ రెడ్డి పాల్గొన్నారు. అనంతరం సమావేశంలో రాష్ట్రానికి సంబంధించి లేవనెత్తిన సమస్యలను వారిద్దరూ మీడియాకు వివరించారు. ముందుగా విజయసాయి రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉన్న పోలవరం ప్రాజెక్ట్ అథారిటీ ప్రధాన కార్యాలయాన్ని రాజమహేంద్రవరంకు తరలించాల్సిందిగా అనేక సార్లు విజ్ఞప్తి చేసినప్పటికీ కేంద్ర ప్రభుత్వం పెడచెవిన పెట్టిందని అన్నారు. ఈ అంశాలను పార్లమెంట్‌ ఉభయ సభల్లో లేవనెత్తుతామని ఆయన వెల్లడించారు.

విశాఖపట్నం స్టీల్‌ ప్లాంట్‌లో పెట్టుబడుల ఉపసంహరణకు కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న చర్యలను వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ వ్యతిరేకిస్తున్నట్లుగా అఖిలపక్ష సమావేశంలో ప్రభుత్వానికి విస్పష్టంగా చెప్పినట్లు విజయసాయిరెడ్డి తెలిపారు. నష్టాల్లో ఉన్న ఏదైనా ప్రభుత్వరంగ సంస్థను పురుద్ధరించి వాటిని లాభాల్లోకి తీసుకురావడానికి ప్రయత్నించాలి తప్ప ఏకంగా తెగనమ్మడం పరిష్కారం కాబోదని పునరుద్ఘాటించారు. ప్రభుత్వ రంగ సంస్థలనేవి దేశానికి మూలధన ఆస్తి వంటివని, వాటిని అమ్మే అధికారం ఏ ప్రభుత్వానికి ఉండదని సమావేశంలో స్పష్టం చేసినట్లు తెలిపారు. విశాఖస్టీల్‌ ప్లాంట్‌ను తిరిగి లాభాల బాట పట్టించడానికి మూడు మార్గాలను తాము సూచించినట్లు చెప్పారు. అందులో సొంత గనుల కేటాయింపు, ప్రస్తుతం స్టీల్‌ ప్లాంట్‌పై ఉన్న రుణ భారాన్ని ఈక్విటీ కింద మార్పు, లేదా ఏదైనా ఇతర ప్రభుత్వ రంగ సంస్థలో విలీనం చేయడం వంటివి విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చేయకుండా ప్రభుత్వం ముందున్న ప్రత్యామ్నాయాలుగా సూచించినట్లు తెలిపారు.

ప్రత్యేక హోదా విషయంలో సవతి తల్లి వైఖరి:

ఇక ప్రత్యేక హోదా విషయంలో కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌పై సవతి తల్లి వైఖరిని అనుసరిస్తోందని విజయసాయి రెడ్డి దుయ్యబట్టారు. రాష్ట్ర విభజన చట్టంలో స్పెషల్‌ క్యాటగిరీ స్టేటస్‌ అన్నది పొందుపరిచినప్పటికీ 8 ఏళ్ళు పూర్తవుతున్నా బీజేపీ ప్రభుత్వం అమలు చేయడం లేదని అన్నారు. రాష్ట్రం పట్ల పక్షపాత ధోరణిని అనుసరిస్తోందని మండిపడ్డారు. పాండిచ్చేరి శాసన సభ ఎన్నికల సందర్భంగా బీజేపీ విడుదల చేసిన మానిఫెస్టోలో పాండిచ్చేరికి స్పెషల్‌ కేటగిరీ స్టేటస్‌ ఇస్తామని పేర్కొన్న విషయాన్ని విజయసాయి రెడ్డి గుర్తుచేశారు. ఏపీ విషయానికి వచ్చే సరికి ఆర్థిక సంఘం పేరు చెప్పి కేంద్ర ప్రభుత్వం మొండిచేయి చూపిస్తోందని ఆరోపించారు. బీజేపీయేతర రాష్ట్రాల పట్ల కేంద్ర ప్రభుత్వం తీవ్ర పక్షపాతం ప్రదర్శిస్తోంది. దీనిని బట్టి ఒక విషయం స్పష్టంగా అర్ధమవుతోంది. బీజేపీ అవకాశవాద రాజకీయాలకు, ద్వంద ప్రమాణాలకు పాల్పడుతూ అవసరమైతే చట్టాలను సైతం తుంగలో తొక్కుతోందని ఆరోపించారు. పోలవరం ప్రాజెక్టుకు నిధుల విడుదల, స్పెషల్‌ స్టేటస్‌తోపాటు ప్రతి విషయంలోనూ ఆంధ్రప్రదేశ్‌ పట్ల కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ద్వంద ప్రమాణాలు పాటిస్తోందని అన్నారు.

రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులు:

మరోవైపు పెండింగ్‌లో ఉన్న రాయలసీమ ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతులను త్వరితగతిన మంజూరు చేయాలని కోరినట్టు తెలిపారు. అలాగే బియ్యం సబ్సిడీ కింద కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి చెల్లించాల్సిన రూ. 5,056 కోట్ల బకాయిలను వెంటనే విడుదల చేయాలని విజ్ఞప్తి చేశామని చెప్పారు. గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద కేంద్ర ప్రభుత్వం నుంచి పెద్ద ఎత్తున బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ఉపాధి పనులు చేసిన కార్మికులు వేతనాలు అందక ఇబ్బందుల్లో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. ఉపాధి హామీ బకాయిలు రూ. 6,750 కోట్లను తక్షణమే విడుదల చేయాలని కోరినట్లు విజయసాయి రెడ్డి తెలిపారు. వంశధార ప్రాజెక్ట్‌కు సంబంధించి ట్రైబ్యునల్‌ ఇచ్చిన తీర్పును గెజిట్‌లో నోటిఫై చేయాలని సమావేశంలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.

జాతీయ ఆహార భద్రత చట్టం కింద కేంద్రం రాష్ట్రానికి మంజూరు చేసే రేషన్‌ కార్డుల సంఖ్య విషయంలో నెలకొన్న అసమానతలను కూడా సమావేశంలో ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చినట్లు చెప్పారు. తలసరి ఆదాయం ఎక్కువగా ఉన్న రాష్ట్రాలకు కేంద్రం 75 శాతం పైగా రేషన్‌ కార్డులు మంజూరు చేస్తే జనాభా అధికంగా ఉండి, తలసరి ఆదాయం బాగా తక్కువగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం కేవలం 54 శాతం ప్రజలకు మాత్రమే రేషన్‌ కార్డులు మంజూరు చేసిన విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చి ఈ అసమానతను తక్షణమే సరిదిద్దాలని కోరినట్లు చెప్పారు. అలాగే చాలా కాలంగా పెండింగ్‌లో ఉన్న దిశ బిల్లును ఆమోదించాలని కోరామని తెలిపారు.

తెలంగాణ ప్రభుత్వం బకాయిలను చెల్లించడం లేదు:

2016 నుంచి 18 వరకు చంద్రబాబు హయాంలో తెలంగాణ రాష్ట్రానికి ఆంధ్రప్రదేశ్‌ నుంచి పంపిణీ చేసిన విద్యుత్‌కు సంబంధించి తెలంగాణ ప్రభుత్వం రూ. 6,112 కోట్లు చెల్లించాల్సి ఉందని, కానీ తెలంగాణ ప్రభుత్వం ఈ బకాయిలను చెల్లించడం లేదని విజయసాయి రెడ్డి అన్నారు. ఈ పరిస్థితులలో కేంద్రం జోక్యం చేసుకుని తెలంగాణకు ఇచ్చే నిధుల నుంచి మినహాయించి ఈ బకాయిలను రాష్ట్రానికి ఇవ్వాల్సి ఉంటుందని అన్నారు.

పార్టీ ఫిరాయింపుల చట్టంపై చర్యలేవి:

కాగా, పార్టీ ఫిరాయింపుల చట్టం అమలులో బీజేపీ ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తోందని విజయసాయి రెడ్డి అన్నారు. జేడీ(యూ) మాజీ ఎంపీ శరద్‌ యాదవ్‌పై కేవలం వారం రోజుల నోటీసుతో అనర్హత వేటు వేస్తే రఘురామకృష్ణ రాజు విషయంలో పార్టీ ఫిరాయింపుల చట్టం కింద పిటిషన్‌ దాఖలు చేసి ఏడాది గడచినా చర్యలు లేవని ఆరోపించారు. ఉద్దేశపూర్వకంగా కాలయాపన చేస్తూ 11 నెలల తర్వాత స్పీకర్‌ నిద్ర లేచి పిటిషన్‌లో ఏవో లోపాలున్నాయని, వాటిని సరిదిద్దాలన్నారని చెప్పారు. పార్టీ ఫిరాయింపుల చట్టం కింద దాఖలయ్యే పిటిషన్‌పై స్పీకర్‌ మూడు నుంచి ఆరు మాసాలలోగా చర్యలు తీసుకోవాలని గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన విస్పష్టమైన ఆదేశాలను సైతం స్పీకర్‌ బేఖాతరు చేస్తున్నారని విజయసాయి రెడ్డి ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వం అనుసరిస్తున్న ఈ ద్వంద ప్రమాణాలను విడనాడాలని సమావేశంలో చెప్పినట్లు ఆయన తెలిపారు. ఈ అంశాలన్నింటినీ సభలో కూడా లేవనెత్తుతామని ఆయన మీడియాతో చెప్పారు.

ఇవీ కూడా చదవండి:

Telangana: ఎవరితో శత్రుత్వం లేదు.. తెలంగాణకు నష్టం కలిగిస్తే మాత్రం చూస్తూ ఊరుకోం.. కేంద్రానికి స్పష్టం చేసిన టీఆర్ఎస్..

Kodali Nani: చంద్రబాబు, టీడీపీ నేతలపై మరోసారి తీవ్రంగా స్పందించిన మంత్రి కొడాలి నాని.. ఆయనెప్పుడైనా అలా చేశారా? అంటూ..

Latest Articles
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
కొడుకు నంబర్‌ హ్యాక్‌.. తల్లికి ఫోన్‌.. 12 లక్షలు గోవిందా..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఇండస్ట్రీని షేక్ చేసిన రియల్ స్టోరీ.. నటి తల నరికి దారుణ హత్య..
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
ఐపీఎల్‌ 2024 లో ఒక్క మ్యాచ్ కూడా ఆడని స్టార్ ప్లేయర్లు వీరే
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
గత ఓటమికి ప్రతీకారం తీర్చుకునేనా.. పంజాబ్‌తో పోరుకు చెన్నై రెడీ..
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
సీఎం రేవంత్ రెడ్డికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి సవాల్..!
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
ఆ ఇద్దరూ నన్ను మోసం చేశారు..షాహిద్ కపూర్..
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
రోజుకు రూ.250 పెట్టుబడితో ఏకంగా రూ.24 లక్షల రాబడి
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
పాము కాటుతో చనిపోయిన వ్యక్తిని గంగా నదిలో వేలాడదీసిన గ్రామస్తులు
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
మీరు ఆధార్‌ కార్డుతో మోసపోకుండా ఉండాలంటే ఇలా చేయండి
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే
భారత పర్యటనకు దక్షిణాఫ్రికా.. షెడ్యూల్ ఖరారు..డేట్స్, వేదికలు ఇవే