AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

‘ మీరు జర భద్రం ! ‘ ముస్లిములకు మౌల్వీల పిలుపు

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు అప్పుడే దేశంలో ‘ సంచలనం ‘ సృష్టించబోతున్నట్టు కనిపిస్తోంది. బహుశా అందుకే మొదట కర్నాటకలోని ముస్లిం వర్గాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని ఇమామ్ లు, మౌల్వీలు ” మీ.. మీ పౌరసత్వ డాక్యుమెంట్లను సిధ్ధంగా.. అప్-డేట్ చేసి ఉంచుకోవాలంటూ ” ముస్లిములకు పిలుపునిచ్చారు. త్వరలో జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ) ని చేపడుతామని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఇందుకు సన్నాహక చర్యగా ముస్లిం మత […]

' మీరు జర భద్రం ! ' ముస్లిములకు మౌల్వీల పిలుపు
Pardhasaradhi Peri
|

Updated on: Dec 12, 2019 | 3:21 PM

Share

కేంద్రం తెచ్చిన పౌరసత్వ సవరణ బిల్లు అప్పుడే దేశంలో ‘ సంచలనం ‘ సృష్టించబోతున్నట్టు కనిపిస్తోంది. బహుశా అందుకే మొదట కర్నాటకలోని ముస్లిం వర్గాలు అప్రమత్తమవుతున్నాయి. ఆ రాష్ట్రంలోని ఇమామ్ లు, మౌల్వీలు ” మీ.. మీ పౌరసత్వ డాక్యుమెంట్లను సిధ్ధంగా.. అప్-డేట్ చేసి ఉంచుకోవాలంటూ ” ముస్లిములకు పిలుపునిచ్చారు. త్వరలో జాతీయ పౌరుల జాబితా (ఎన్నార్సీ) ని చేపడుతామని హోం మంత్రి అమిత్ షా చేసిన ప్రకటన నేపథ్యంలో.. ఇందుకు సన్నాహక చర్యగా ముస్లిం మత గురువులు ఈ పిలుపునిఛ్చినట్టు తెలుస్తోంది. (2024 లో జరిగే లోక్ సభ ఎన్నికల ముందే ఈ ప్రక్రియ ప్రారంభమవుతుందని అమిత్ షా స్పష్టం చేశారు).

కాగా… ముస్లిములు తమ డాక్యుమెంట్లలో ఏవైనా తప్పొప్పులు ఉంటే వాటిని సరిదిద్దుకోవాలని తాము కోరుతున్నట్టు బెంగుళూరులోని జామియా మసీదు ఇమామ్ మక్సూద్ ఇమామ్ తెలిపారు. ఈ దేశంలోని ప్రతి పౌరుడూ తమ పౌరసత్వ పత్రాలను అప్-డేట్ చేసి ఉంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ విషయంలో తమ వర్గీయులకు సాయపడేందుకు ఈ నగరంలో మూడు నెలల క్రితమే ఓ సిటిజన్స్ సెంటర్ ఏర్పాటైన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. అలాగే తమ మసీదులో కూడా ఓ కేంద్రం ఉందని ఆయన చెప్పారు. ఆధార్, పాన్ కార్డ్, ఓటర్ ఐడెంటిటీ కార్డు వంటి వాటిలో తమ పేర్లు, వయస్సు తదితరాలు తప్పుగా ప్రచురితమై ఉంటే.. వాటిని సరిదిద్దుకోవాలని మక్సూద్ పేర్కొన్నారు. దీనివల్ల భవిష్యత్తులో ఎలాంటి సమస్య తలెత్తకుండా ఉంటుందన్నారు.

Follow Us